నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిగ్రామంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో. లక్ష్మి రాజo.ఈ సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి.ఎంపీడీవో మండలంలో పలు గ్రామాల్లో రెండో విడత జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఏమైనా అడపా దడపసంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పరిశీలిస్తున్నార.అని తెలుసుకుంటూ నామినేషన్ల పక్రియలోఎటువంటిచెదురు మధురుసంఘటనలు జరగకుండా పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కొనసాగించాలని నామినేషన్ల ప్రక్రియ పై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేస్తూ ఏదైనా సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారమే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నామినేషన్.పక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలని సంబంధిత.అధికారులను ఆదేశించారు

ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు….

ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె శుభ నివాస్ ను మండల పిఆర్టియు టీఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీవోను శాలువాతో సన్మానం చేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురం బద్రీనాథ్, రవీందర్, జిల్లా కార్యదర్శి శనిగరం శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కందకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన శుభనివాస్…

ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన శుభనివాస్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నల్లబెల్లి ఎంపీడీవో గా తొర్రూరు పట్టణానికి చెందిన జె శుభ నివాస్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎంపీడీవో గా విధులు నిర్వహించిన నరసింహమూర్తి పదవి విరమణ పొందడంతో మండల పంచాయతీ అధికారి రవికి ఎంపీడీవోగా సంబంధిత శాఖ జిల్లా ఉన్నత అధికారులు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ లలో ఎంపికైన అభ్యర్థులకు నూతన బాధ్యతలు అప్పగించగా. ఈ మేరకు జే శుభ నివాస్ ఎంపీడీవో గా నల్లబెల్లి మండలంలో మొదటి పోస్టింగ్ లో బాధ్యతలు చేపట్టి విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన శుభ నివాస్ కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్…

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

మహాదేవపూర్ అక్టోబర్ 24 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామపంచాయతీ పరిధిలో ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిని శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించడం జరిగింది. ఎలికేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతుండగా ఆకస్మిక తనిఖీలలో భాగంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీలు నిర్వహించి లబ్ధిదారులతో మాట్లాడి తగు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను త్వరగా పనులను ప్రారంభించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ ఆఫీసర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

చిట్యాల లో చందాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్…

చిట్యాల లో చందాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ప్రొసీడింగ్స్ తీసుకొని నిర్మాణం చేపట్టని వారు త్వరగా నిర్మాణాలను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు శుక్రవారం జిల్లా కలెక్టర్ చందాపూర్, చిట్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోందని, పనులను నాణ్యవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురబి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నగదు పడే విధంగా చూడాలని, పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇసుకకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. చందాపూర్ గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, గృహ నిర్మాణ శాఖ డి ఈ విఠోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో,అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు

ఇందారంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహణ…

ఇందారంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహణ

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీలో శనివారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు ఆధ్వర్యంలో షాపుల యజమానులకు,గ్రామస్తులకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించి మానవహారం నిర్వహించారు.అదేవిధంగా ఎంపీయుపిఎస్ (ఉర్దూ) పిల్లలకు కూడా అవగాహన కల్పించారు.ఉర్దూ పాఠశాలలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ మరియు కిచెన్ షెడ్లను పరిశీలించారు.ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కార్యక్రమంలో భాగంగా 75% రాయితీతో మొదటి విడతగా 14 మంది అర్హులైన రైతులకు 32 యాంత్రిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై పంపిణీ చేశారు.అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము,ఆవాస్ ప్లస్ సర్వేను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి ఏ.సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు…

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఐబీ మరియు మాదారం గ్రామంలో ప్రధాన రహదారులపై,కాలనీల్లో ఆవులు నిర్బంధం లేకుండా సంచరించడం వలన వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్ అన్నారు.ముఖ్యంగా రాత్రి సమయంలో ఆవుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని,ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతుందని అన్నారు.కాబట్టి దయచేసి ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకొని,ఆవుల యజమానులకు నోటీసులు జారీ చేసి,అవసరమైతే జరిమానాలు విధించడం గాని లేదా ఆవులను గోశాలలో ఉంచే చర్యలు గాని తీసుకోవాలని ఎంపీడీఓ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

గంగాధర నేటిధాత్రి :

 

 

గంగాధర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీఓ గౌరీ రమేష్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రెస్ మీట్ లు పెట్టడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో భవన నిర్మాణ పనులు చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జారతి రాజిరెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సభ్యులను ఎంపీడీవో, ఎంపీ ఓ అభినందించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి జిల్లెల్ల లచ్చయ్య తదితరులు ఉన్నారు.

కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు…

కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

 

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్న మహానుభావుడు ప్రజా కవి కాళోజి నారాయణరావు అన్నారు అని ఎంపీడీవో గజ్జెల విమల మాట్లాడారు.
నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణ రావు అన్యాయాన్ని ఎదురిస్తే నా గొడవ కు సంతృప్తి అని అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అని, అన్యాయాన్ని ఎదురించినవాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించినవారు కాళోజీ అని తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతి ధ్వనిగా ఉంటారని,అన్నారు.
పుట్టుక చావులు కాకుండా బ్రతుకంతా తెలంగాణ కి ఇచ్చిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు అని అతని జన్మదినాన్ని పురష్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవం గా ప్రకటించారు.
కాళోజీ రచనలు, కాళోజీ కథలు,నా గొడవ,జీవన గీత, తెలంగాణ ఉద్యమ కథలు ఎన్నో పుస్తకాలు రాసారు.
1968 సంవత్సరములో జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే పురస్కారం ప్రజాకవి గా బిరుదు పొందారు.
1992 సంవత్సరము లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శాసన మండలి సభ్యునిగా 1958 నుండి 1960 వరకు కొనసాగారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో విద్యావతి,టి ఏ స్వప్న, కార్యాలయ సిబ్బంది గోవిందు నవీన్ కుమార్, దర్శన్,రాజేందర్,నడికూడ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు అంగన్వాడీ టీచర్ కళావతి, ఆయా నర్సక్క,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఘనంగా సన్మానం…

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేడు న్యాల్కల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధ్యాయులకు ఒక ఘనమైన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయుల అంకితభావం, కృషి, మరియు మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారి అమూల్యమైన సేవలను గౌరవించి, గుర్తించారు.ఈ స్మరణీయ సందర్భంలో టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ సమీయుద్దీన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు చేసిన కృషికి, అంకితభావానికి గాను సత్కారం జరుగుతున్నందుకు నేను హృదయపూర్వక ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులను గౌరవించడం మాత్రమే కాకుండా, యువ ఉపాధ్యాయుల తరం మరింత జ్వాలంతమైన ఆవేశంతో అంకితభావంతో తమ సేవలను కొనసాగించేందుకు ప్రేరణనిస్తాయి. ఇంత అర్థవంతంగా గౌరవప్రదంగా ఈ వేడుకను నిర్వహించడం మా మండలానికి నిజంగా గర్వకారణమని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీఓ న్యాల్కల్ జి. శ్రీనివాస్ ఎంఆర్ఓ న్యాల్కల్ ప్రభు ఎంఈఓ న్యాల్కల్ మారుతి రాథోడ్ మీర్జాపూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాజ్ కుమార్ మామిడి ప్రధానోపాధ్యాయలు చంద్రకళ వివిధ పాఠశాల ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143950.186.wav?_=1

 

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు

◆:- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాక్సుధ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్దిదారుల ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T134106.110.wav?_=2

ఆర్థిక భారంతో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు

◆:- సొంతింటి కల నెరవేరేనా!

◆:- పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

◆:- బేస్మిట్ లెవెల్ కే రెండు లక్షలు దాటుతున్న పరిస్థితి!

◆:- నేటికీ అందని ఉచిత ఇసుక!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే సొంత ఇంటి కల నెరవేరడం ఖాయమని, అవసరమైతే లబ్దిదారుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు మండల వ్యాప్తంగా విస్తారంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తామన్న ఉచిత ఇసుక అందలేదు. మండలానికి 583 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 380 ఇండ్ల పనులు ప్రారంభమైనాయి.

Indiramma Beneficiaries

 

పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఓవైపు ఇసుక, మరోవైపు కంకర, సిమెంట్, స్టీల్ ధరలు మూడింతలు పెరగడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులలో వేగం తగ్గింది. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్దిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చెప్పినా నేటి వరకు అందలేదు. కనీసం ఇసుకైనా ఉచితంగా అందితే కొంతమేర భారం తగ్గుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. మరో వైపు ఉన్నత అధికారుల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఒత్తిళ్లు రావడంతో ఎం చేయాలో తోచని పరిస్థితులు
నెలకొంటున్నాయని వాపోతున్నారు. ఒకానొక దశలో అధికారులు లబ్దిదారులకు చేతులు జోడించి తమకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లను అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. దీంతో లబ్దిదారులు ఏం చేయలేక పెరిగిన ధరలతో అనుకున్న అంచనా కంటే అధికంగా ఖర్చులు అవుతున్నాయని ఏం చేయాలో అర్ధం కావడంలేదని అధికారులకు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారు.

ఉచిత ఇసుక సరఫరా అయ్యేనా !

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని తెలిపినా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడిచినా నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఉచిత ఇసుక సరఫరా అనేది మండల స్థాయిలో తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడంతో లబ్దిదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. కొందరు లబ్దిదారులు మొదటి బిల్లుతో బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేస్తే, మరికొందరు పిల్లర్లను నిర్మించి పనులను అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.

త్వరలో ఉచిత ఇసుక అందజేస్తాం

-ఎంపీడీఓ, మంజుల, ఝరాసంగం

ఇందిరమ్మ అబ్దిదారులకు త్వరలో ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు సేకరించాం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఉచిత ఇసుక అందిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

“కోతపల్లి సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు బీజేపీ వినతి పత్రం”..

సులబ్ కాంప్లెక్ నిర్మాణం కొరకు MPDO గారికి వినతి పత్రం అంద చేసిన బీజేపీ నాయకులు *

తాండూరు ( మంచిర్యాల ) నేటి ధాత్రి:

 

 

కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శనివారం సంత సమీపంలో సులబ్ కాంప్లెక్ కి అనుమతి చ్చింది.నిధులు కూడా మంజూరు అయినవి.నిర్మాణం కోసం ముగ్గు పోసి అక్కడికే వదిలేశారని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దుడపాక భరత్ కుమార్ మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా శనివారం సంతకు వచ్చె చుట్టూ పక్కల మండలాల ప్రజలు, పలు గ్రామాల ప్రజలు కూరగాయలు అమ్మే వారికి చాలా ఇబ్బంది కరంగా ఉందని వాటిని వెంటనే నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. సులబ్ కాంప్లెక్ నిర్మాణం ఆలస్య విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ప్రజలు బావిస్తున్నారు. ప్రజల అవసరాలు గుర్తించి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరుపున అధికారులను కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తాండూర్ మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విఘ్నేష్, పుట్ట కుమార్, ఉప అధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రామగౌని మహీధర్ గౌడ్, ఎక్స్ వార్డ్ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పుట్ల దుర్గాచరణ్, బిజెవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్, 126 బూత్ అధ్యక్షులు సలాది శ్రీకాంత్ , యువమోర్చా కార్యకర్త రెవెల్లి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు….

ఆనేగుంటలో పశువుల పాక నిర్మాణానికి భూమిపూజ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T152702.949.wav?_=3

 

ఆనేగుంటలో పశువుల పాక నిర్మాణానికి భూమిపూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆనేగుంట గ్రామంలో 2025 పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పశువుల పాక నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, మండల ప్రత్యేక అధికారి బిక్షపతితో పాటు మండల అభివృద్ధి అధికారి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వివరాలను ఎంపీడీఓ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-2.wav?_=4

ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి

బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్ కు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణపురం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో అర్హులైన లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే గృహ నిర్మాణంకు మట్టి తప్పనిసరి అవసరం ఏర్పడుతుంది, కానీ ఆయా గ్రామ పంచాయతీల్లో మట్టి లభ్యత లేకపోవడం, ఉన్న ప్రాంతంలో మట్టి తీసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుండి అనుమతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 17 గ్రామపంచాయితీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఆయా గ్రామ పరిధిలో మట్టి లభ్యత లేదనందున సింగరేణి ఓసీ త్రీ మట్టిని సింగరేణి అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇప్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్ పాల్గొన్నారు

ఉత్తమ అవార్డు అందుకున్న ఎమ్మార్వో ,ఎంపీడీవో.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-39-3.wav?_=5

ఉత్తమ అవార్డు అందుకున్న ఎమ్మార్వో ,ఎంపీడీవో

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామికి ఉత్తమ ఎమ్మార్వో అవార్డు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్ కారే,జడ్పీ సీఈవో విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురం ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామి ఉత్తమ అవార్డు అందుకున్నారు.

Best EMRO and MPDO Awards in Ganapuram

అదేవిధంగా గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఎల్ భాస్కర్ ఉత్తమ ఎంపీడీవో అవార్డును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే జెడ్పిసిఓ విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురంలోవిధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో, ఎంపీడీవోలు ఉత్తమ అవార్డు అందుకున్నారు.

ఓదెల మండలం లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-49-1.wav?_=6

ఓదెల మండలం లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో పెద్దవల్లి సివిల్ జడ్జి ఎన్ మంజుల జాతీయ జెండాన ఎగురవేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ధీరజ్ కుమార్ జాతీయ పతాకాన్ని
ఎగరవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జి తిరుపతి ఎస్సారెస్పీ కార్యాలయం లో డిఈ బి భాస్కర్, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై దీకొండ రమేష్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఈవో బి సదయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సహబజ్ ఖాన్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో బి భాస్కర్, మండల విద్యా అధికారి కార్యాలయంలో ఎంఈఓ వై రమేష్ ఐకెపి కార్యాలయంలో ఏపీఎం సంపత్
ప్రెస్ క్లబ్ ఆవరణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పని
సుదర్శన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల పశువుల ఆసుపత్రి
ఆవరణలో పశు వైద్యాధికారి మల్లేశం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో కాలేజీ ప్రిన్సిపాల్, మోడల్స్కూల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బీసీ హాస్టల్ ఆవరణలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, కస్తూర్భా గాంధీ పాఠశాల ఆవరణలో ఎస్ఓ జ్యోతి తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలో
పాఠశాల
ప్రధానోపాధ్యాయులు ప్రైవేట పాఠశాలలో అలాగే వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, వివిధ పార్టీల, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరవేసారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంద్రా గస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటున్నా మంటే పూర్వం 1947కు పూర్వం ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే నేడు మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామన్నారు. రాను న్న రోజులలో ప్రపంచ దేశంలో మన భారత దేశాన్ని మరింత ముందుకు తీసుకో వెళ్ళవలసిన బాధ్యత బావి భారత పౌరులమైన మన అందరి పైన ఉందని అలాగే ఉద్యోగంలో పనిచేసేవారు మరింత చురుకుగా బాధ్యతగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించా లని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్ పాష, అడ్వకేట్స్, ఏఎస్ఐ లు, సిఓ అంజి రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగి ల్విండో డైరెక్టర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-17-4.wav?_=7

ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుర్రం సత్యనారాయణ గౌడ్ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికై ప్రశంస పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా అందుకున్నారు.నిస్వార్ధంగా,నిబద్ధతతో,నియమనిష్ఠలతో తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ కి ఉత్తమ ఎంపీడీవో పురస్కారం లభించడం ఆనందదాయకమనీ తోటి అధికారులు హర్షం వ్యక్తం చేశారు.ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తీరుస్తూ తోటి ఉద్యోగులతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ గౌడ్ కి మరెన్నో మంచి ఉన్నత స్థానాన్ని లభించాలని ఆకాంక్షించారు.

నెక్కొండలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

నెక్కొండలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

అంబరాన్ని అంటిన 79స్వతంత్ర దినోత్సవ వేడుకలు

#నెక్కొండ ,నేటి ధాత్రి:

నెక్కొండ మండల వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో పాటు పల్లె నుండి పట్నం దాకా ఘనంగా నిర్వహించారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వేముల రాజుకుమార్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ డిప్యూటీ తాసిల్దార్ రవికుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హంస నరేందర్, రెవెన్యూ ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నెక్కొండ మార్కెట్ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నెక్కొండ మార్కెట్ లో 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒకరికొకరు మిఠాయిలు పంచుతూ ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, రాచకొండ రఘు, ఈదునూరి సాయి కృష్ణ, బండి శివకుమార్, సింగం ప్రసాద్, మార్కెట్ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Independence Day

నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నెక్కొండ ప్రాథమిక సొసైటీ ఆవరణలో సొసైటీ చైర్మన్ మారం రాము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో సురేష్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్.!

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను మంగళవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పర్యవేక్షించారు. పాఠశాల స్టాఫ్ నర్స్ మణిదీపిక ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో ఉన్న 480 మంది విద్యార్థుల హాజరు శాతం ఎప్పటికప్పుడు గమనించాలని,విద్యార్థులకు అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని,చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం సీజన్ పట్ల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ప్రోగ్రాం ఆఫీసర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పల ప్రసాద్,జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version