దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ…

దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ

#మండలంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు.

#తడుక అశోక్ గౌడ్ సీనియర్ నాయకుడు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అశోక్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుందని,అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపిందన్నారు.“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసంల భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు , మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్,బత్తిని కుమారస్వామి, మండల కార్యదర్శి ఓదెల అశోక్ ,కోశాధికారి మురికి మనోహర్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

బాలానగర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జడ్చర్ల / నేటి ధాత్రి.

 

జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండల కేంద్రంలోని జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్‌లో సోమవారం భారతీయ జనతా 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో.. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1980లో ఏర్పడినప్పుడు 2 సీట్లతో ప్రారంభమై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు.పార్టీ సిద్ధాంతం ప్రకారం “దేశ ప్రథమం” నినాదంతో, జాతీయవాదం, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో.. మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ , శ్రీనివాస్ కార్యదర్శి బాలరాజు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ శ్రీశైలం, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింలు,యాదయ్య, సామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ…
1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, ఈ 47 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ, త్యాగాలు, పోరాటాల ఫలితంగా బీజేపీ ఈ స్థాయికి ఎదిగి, కేంద్రంలో అలాగే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తో రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ లు జన్నే మొగిలి పార్లమెంట్ కొ కన్వీనర్ లింగంపల్లిప్రసాద్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి కార్యాలయం కార్యదర్శి వట్టం తిరుపతి మీడియా ఇంచార్జ్ మునెందర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలీఫ్, జిల్లా నాయకులు పొన్నాల కొమురన్న,తుమ్మటి రాంరెడ్డి,తాటికంటి రవి కుమార్ తాటికంటి రవికుమార్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల అధ్యక్షులు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా. పార్టీ స్థాపకులకు మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ స్తూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్. 6. స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందని ప్రారంభ దశలో కేవలం రెండు ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ క్రమక్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలిచుకుంటూ తన బలం పెంచుకుందని మొదటి సారి అటల్ బిహారీ వాజపేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బిజెపి తన సత్తాను చాటుకుందని అనంతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలు సాధిస్తూ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని తెలియజేస్తూ. సబ్కా సాత్ -సబ్కా వికాస్-సబ్కా విశ్వాస్”. అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతని లక్ష్యంగా చేసుకొని దేశంలో ప్రజల ఆశీర్వాదం పొందుతూ ప్రపంచంలోనే అత్యధిక శక్తివంత దేశంగా తీర్చిదిద్దుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారతదేశం ప్రజలు దీవిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుందని తెలియజేస్తూ మండల బిజెపి నాయకులు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి. మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిజెపి మరింత బలపడడానికి ఆకాంక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. ప్రధాన కార్యదర్శి ఇటికలరాజు. కోసినివిజయ్. ఇటుకల మహేందర్. యాదవ్. బోల్గంభాస్కర్ గౌడ్. బక్క శెట్టి రాజేందర్. రెడ్డి మల్ల నరసింహ. గణేష్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిదాత్రి :

భారతదేశంలో ఆదర్శాలకు సంస్కృతికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ బిజెపి అని చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్* అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ జన సంఘ్* , జనతా పార్టీ* నుండి 1980 ఏప్రిల్ 6వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి*, లాల్ కృష్ణ అద్వాని నేతృత్వంలో ఆవిర్భంచి నేటికీ 46 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను చిట్యాల మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో బిజెపి జెండా ఎగరవేయడం జరిగిందిఅని సిద్ధాంతాలకు* కట్టుబడి పనిచేస్తూ ప్రపంచంలోనే* ఎక్కువ సభ్యత్వాలు గలఅతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందని 2 పార్లమెంటు సీట్లతోనే ప్రారంభమై వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దని 500 సంవత్సరాల క్రితం నెరవేరని అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు దేశభక్తిని ప్రతి పౌరునికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశం కోసం ధర్మం* కోసం దేశ ప్రజల శ్రేయస్ కోసం బిజెపి పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీనీ ఆదరించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ బిజెపి సీనియర్ నాయకులు గజానాల రవీందర్ ఓదెల శ్రీహరి సాదా సదానందం గుర్రపు రవి రాయిని శ్రీనివాస్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ పల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version