భూ భారతి తో పెండింగ్ సమస్యలు పరిష్కారం…

భూ భారతి తో పెండింగ్ సమస్యలు పరిష్కారం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భూభారతి రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని ఝరాసంగం నాయబ్ తహసీల్దార్‌ కరుణాకర్ రావు అన్నారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని బోరేగావ్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.ఈ చట్టం ప్రకారం భూములకు సంబంధించిన సమస్యలు అధికారులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో వివిద రకాలుగా ఉన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామారావు జూనియర్ అసిస్టెంట్ శివాజీ జూనియర్ అసిస్టెంట్ ఎజాస్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింలు బస్ శెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version