నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియర్ రామస్వామి..

నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియర్ రామస్వామి.

చిట్యాల, నేటి దాత్రి:

 

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో పెరియర్ రామస్వామి వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య విచ్చేసి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేరియర్ రామస్వామి 1879 సెప్టెంబర్ 17న జన్మించి 1973 డిశంబర్ 24న మరణించాడని అన్నారు. పెరియర్ 19 సంవత్సరాల వయసులోనే నాగమ్మ అనే బాలికను వివాహమాడరని ఆన్నారు. తన తండ్రి కోపగించుకున్నాడని ఇల్లు విడిచి బెజవాడ కలకత్తా కాశి తిరిగి సన్యాసిగా మారి లోకజ్ఞానం తెలుసుకున్నాడని పెరియార్ రామస్వామి పేరే ఒక అగ్ని కణం ,చాందస వాదుల గుండెల్లో ఒక పిడుగు సాంప్రదాయం పేరా సామాన్యుని పీకు తింటున్న బ్రాహ్మణత్వంపై తిరుగుబాటు చేసి సామాన్య మానవుని కాల్చుకు తింటున్న పెత్తందారి వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేశాడని తెలిపారు. పెరియర్ దళితులకు, దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ఎబి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ మండల ప్రధాన కార్యదర్శి పుల్లా ప్రతాప్ మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల సీనియర్ నాయకులు గుర్రపు తిరుపతి రాజమౌళి గురుకుంట్ల కిరణ్ నేరెళ్ల సమ్మయ్య గడ్డం సదానందం పాముకుంట్ల చందర్ కట్కూరి కుమార్ (గని) తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version