గ్రామక్య సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం.

గ్రామక్య సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శ్రీ గణేష్, శాలిని మిశ్రా, ఝాన్సీ, స్వశక్తి గ్రామక్య సంఘాల సభ్యులు మరియు ఐకెపి,సిసి రమణాదేవి ఆధ్వర్యంలో గురువారం రోజున సర్పంచి తౌటం లక్ష్మి ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ ని మరియు వార్డు సభ్యులను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మీ మాట్లాడుతూ మహిళ సంఘాలు పొదుపు ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నారు, అనంతరం ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆర్థికంగా బలోపేతం కావాలిని మహిళా సాధికారత సాధించాలని వారికోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందని అన్నారు, అనంతరం సీసీ రమణా దేవి మాట్లాడుతూ చిట్యాల గ్రామైక్య సంఘాల మహిళలు సమావేశాలు పెట్టుకోవడానికి భవన నిర్మాణం కోసం స్థలం కావాలని కోరగా సర్పంచి ఉప సర్పంచ్ సానుకూలంగా స్పందించి గ్రామంలో సర్వే చేయించి స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో
ఇంచార్జీ ఎపిఎం రాజేందర్,శ్రీగణేష్ వివో, ఝాన్సీ వివో,శాలిని మిశ్రా వివో స్వశక్తి వివో ల అధ్యక్షులు సుమలత, ఉమ,కల్పన, అనూష కార్యదర్శులు సంధ్య, అనూష,శారద, వివో లీడర్లు సుజాత, మౌనిక, వివో ఏ లు షాహ్నాజ్ ,లత, రామ్ చందర్ మరియు సంఘాల లీడర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

“టౌటం లక్ష్మి ప్రచారం జోరుగా”

కోహిర్లో కల్తీ రాజ్యం

◆:- టిఫిన్ సెంటర్లలో కల్తీ నూనెలు, పట్టింపు లేని అధికారులు.

◆:- ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం, తినేది ప్రాణాంతకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ కోహిర్: సంగారెడ్డి జిల్లా కోహిర్ పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లు. హోటల్స్లో నాసిరకం, కల్తీ నూనెతోనే దోసె, ఇడ్లీ, పూరీ, బొండం, ఉప్మా వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఒక్కసారి వాడిన నూనెనే రెండు, మూడు రోజుల పాటు మళ్లీ మళ్లీ వేడి చేసి ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జనంతో కిటకిటలాడే ఈ టిఫిన్ సెంటర్లు కల్తీ నూనె వాడుతూ పదేపదే వేడి చేసిన నూనె వినియోగిస్తున్నారని నూనె వేసినప్పుడు నల్లటి పొగలు కక్కుతున్నాయని.

అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు.

కోహిర్ మండలంలో గత కొంతకాలంగా ఆహార భద్రతా శాఖ అధికారులు ఒక్కసారి కూడా తనిఖీలు నిర్వహించలేదని, ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు నిమ్మకు నీరు పోసినట్టు ఉన్నారని కల్తీ ఆహారాలతో ప్రజలు అనారోగ్యం పలు అవుతున్న అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేదని స్థానికులు ప్రశ్నించారు. పదేపదే వేడి చేసిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్, కార్సినో జెనిక్ పదార్థాలు ఏర్పడి క్యాన్సర్, గుండె జబ్బులు, లివర్ డ్యామేజ్ వంటి ప్రమాదాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నా ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోజూ ఈ టిఫిన్ తినే కార్మికులు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ఆహార భద్రత బృందం ఆహార భద్రతా శాఖ బృందం తక్షణం దాడులు నిర్వహిం చాలి. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్పై కేసులు పెట్టి సీజ్ చేయాలని ప్రజలు అంటున్నారు. ఆరోగ్యం అమూల్యం.. డబ్బు ఆదా చేసుకునే పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ టిఫిన్ సెంట ర్లపై అధికారులు వెంటనే చర్య తీసుకుంటారా? అన్నది కోహిర్ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రశ్న.

“టౌటం లక్ష్మి ప్రచారం జోరుగా”

జోరుగా బిఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి తౌటం లక్ష్మి ప్రచారం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల గ్రామ పంచాయతి ఎన్నికలలో చిట్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి తౌటం లక్ష్మి ప్రచారం తో దూసుకుపోతున్నారు, చిట్యాల మండల కేంద్రంల్లో ఇంటి ఇంటి ప్రచారం చేసారు. చిట్యాల గ్రామ అభివృద్ధి కి దోహదం చేస్తాం అని గ్రామాన్ని అన్ని రంగాలలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి గ్రామాన్ని ప్రధమ స్థానములో పెడుతాం అని తెలిపారు,గ్రామా ప్రజలు మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని* కోరారు.
తౌటం లక్ష్మి ప్రచారం తో గ్రామములో ప్రజలుజోష్ నిండిపోతున్నారు గ్రామ అభివృద్ధి చేయాలంటే మిమ్మల్ని
తప్పకుండ గెలిపిస్తాం అని గ్రామ ప్రజలు ఆశభావం వ్యక్తము చేస్తున్నారుఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల గ్రామ నాయకులు మహిళలు గ్రామ ప్రజలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version