సింగరేణిలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను..

సింగరేణిలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయండి

బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గనిపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోయాదగిరి సత్తయ్య అధ్యక్షులు, యతిపతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సంరక్షణయే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు,ఉద్యమాలను సింగరేణి కార్మికులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.గతంలో 1.3 లక్షల ఉద్యోగులతో 30 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని, ప్రస్తుతం 39వేల ఉద్యోగులతో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని కోల్ ఇండియాలో 6.5 లక్షల ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగులతో 800 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు.
ఉత్పత్తిలో పెరుగుదల గణనీయంగా పెరిగిందని, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిందని అన్నారు.శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ, తక్కువ వేతనం,భద్రత లేని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులను వినియోగిస్తున్నారు.వారికి కనీస వేతనాలు (హెచ్ పి సి), సురక్షిత పని వాతావరణం, వైద్య సదుపాయాలు,నివాస క్వార్టర్లు లేవు.తెలంగాణ రాష్ట్రం గత 12 సంవత్సరాలుగా కనీస వేతన సవర జరగలేదని సింగరేణిలో కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పటికీ అమలు కాలేదని వెంటనే అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో రాజకీయ జోక్యం విచ్చలవిడిగా పెరిగిందని, సంస్థలు పరిపాలన విభాగం గాడు తప్పిందని అందుకే రాజకీయ జోక్యం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ట్రాన్స్కో,జెన్కో సంస్థల నుండి బకాయిలు
గత ప్రభుత్వ హయాంలో రూ. 26,000 కోట్లు బకాయిలు ఉండగా,ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఆ మొత్తం రూ. 39,661.57 కోట్లుకి పెరిగిందని విద్యుత్ బొగ్గుబకాయలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బొగ్గు బకాయిలు రూ.14,743.25 కోట్లు
విద్యుత్ బకాయిలు రూ.24,918.32 కోట్లు చెల్లింపులకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి
ఉద్యోగ భద్రత,బొగ్గు పరిశ్రమల భవిష్యత్తు, సాంకేతిక సామర్థ్యం పరిరక్షణ కోసం కార్మికులు మరియు ప్రజలతో కలసి ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.
జూలై 24 నుండి 31 వరకు బొగ్గు గనుల పైన ద్వారా సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్య పరచడం.
ఆగస్టు 5 నుండి 14 వరకు కోల్ బెల్టు ప్రాంత గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం,ప్రజల అవగాహన కోసం బహిరంగ సభలు నిర్వహించడం.
ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 5 వరకు సింగరేణి కార్మిక వాడలలో బహిరంగ సమావేశాలు,పత్రికా విలేకరుల సమావేశాలు నిర్వహించడం.
సెప్టెంబర్ 15 నుండి జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం.సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.పర్మనెంట్ కార్మికుల సంఖ్య పెంచాలని కనీసం 50% ఉత్పత్తి శాశ్వత ఉద్యోగులతో ఉత్పత్తి జరగాలని విజ్ఞప్తి చేశారు.కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, సీఎం పిఎఫ్ ఖాతాలు,వైద్యం, క్వార్టర్లు కల్పించాలని,బొగ్గు సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని,కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సీఎం పిఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ చేసి పెన్షన్ సమస్యలు పరిష్కారం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం రూ.39,661.57 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని,చట్టబద్ధ బొగ్గు గనుల సేఫ్టీ/భద్రతా చర్యలు అమలు చేయాలి.కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి.సింగరేణి,కోల్ ఇండియాలలో యూనియన్ వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలని,ఏపీ ఈ ఎక్స్ జెసిసి, వెల్ఫేర్,సేఫ్టీ కమిటీల సమావేశాలు నియమితంగా చేపట్టాలి.సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలని,
తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు జాతీయ ఆందోళన కార్యక్రమాలలో సింగరేణి కార్మికులు భాగస్వామి కావాలని పిలుపునిచ్చినారు.
ఈ కార్యక్రమంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు,సెంట్రల్ సెక్రెటరీ మాదాసు రవీందర్,సెంట్రల్ ట్రెజరర్ ఆకుల హరి, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్,ట్రెజరర్ గూడ శ్రీకాంత్,జాయింట్ సెక్రెటరీ మేకల స్వామి,కట్కూరి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోళ్ళ మహేందర్,ఆర్కె5 ఫిట్ సెక్రెటరీ రామకృష్ణ,అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ చంద్రశేఖర్,టి.కిరణ్ కుమార్,కుంట రాజు,పాగిడి శ్రీకాంత్,చల్ల ప్రశాంత్,బుర్ర అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. పేద ప్రజల ప్రభుత్వం అని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ నైజం అని ఇందిరమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండడానికి అనేక పథకాలు తీసుకొచ్చామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామం జిల్లాల గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని. జిల్లాలలో పెద్దమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఇందిరమ్మ కాలనీ జిల్లాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిభూమి పూజలో పాల్గొనడం జరిగిందని. అలాగే రాష్ట్ర పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని. రాష్ట్రాన్ని గత పాలకులు ఎంతో అప్పుల్లో కూర్చున కూడా దాన్ని అధిగమిస్తూ. రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని. అలాంటిది లేనిపోని అబండాలు వేసి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దయచేసి అభివృద్ధి పథంలో భాగ్యస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఎంత కష్టమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్న ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్. ఏం సి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గo గౌడ్. డైరెక్టర్ బాలు. శ్రీనివాస్ రెడ్డి. గడ్డం మధుకర్. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఆసరి బాలరాజు. మనోజ్. ఉమేష్. తిరుపతి గౌడ్. నరసయ్య. సలీం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

మండల విద్యాశాఖ అధికారి యస్. వెంకటేశ్వర్లు..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుగ్గొండి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం లోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవులలో ఈ నెల 20 నుండి 2025 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలు దుగ్గొండి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించబడునని వివరించారు. శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు.తెలుగు ,ఆంగ్లం, గణితం,పరిసరాల విజ్ఞానం విషయాలలో విద్యా సామర్థ్యంతో పాటు ఎఫ్ఎల్ఎన్ లపై రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లంలలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించడం, పరిసరాల విజ్ఞానంలో భావనలు నేర్చుకునేలా రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే
బాలబాలికలు ఫౌండేషన్ లిటరసీలో భాగంగా విద్యాసామర్ధ్యాలను సాధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని ఎంఈఓ
యస్. వెంకటేశ్వర్లు తెలియజేశారు.

సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి..

 రేపు సైన్స్ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి

జహీరాబాద్. నేటి ధాత్రి:

జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించాలని డిఈవో వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో 21 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. సెన్స్ కార్యక్రమ వేడుకలను ఫోటోలు వీడియోల రూపంలో డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు సెన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి 6302290235న సంప్రదించాలని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version