అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం…

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పకీరు గడ్డ అంగన్వాడీ టీచర్ ప్రమీల ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ పోషణ మాస కార్యక్రమం అనేది ఈరోజు అంగన్వాడి సెంటర్లో నిర్వహించడం జరిగింది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి అంగన్వాడి నుండి ఇచ్చే బొడ్డును పిల్లలకు అరువుగా అందివ్వాలి. దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంగన్వాడి నుండి వచ్చే పోషణ మాస వస్తువులను ప్రతి ఒక్కటి తీసుకుంటే తల్లి తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు అలాగే
అంగన్వాడి కేంద్రమును ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ అవసరమైన సేవలు వినియోగించుకోవాలి డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు పిల్లలకు
గంటలోపు మూర్రిపాలు పట్టించాలి ఏడవ నెల నుంచి అనుబంధ ఆహారము, తల్లిపాలతో పాటుగా ఇవ్వాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో శోభారాణి ఘటన గర్భిణీలు పిల్ల తల్లులు పాల్గొన్నారు

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని ఐసీడీసీ సూపర్వైజర్ సద్గుణ అన్నారు.తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో సోమవారం మొగుడంపల్లి మండలంలో అంగన్వాడి టీచర్ ఎస్.తుల్జమ్మ ఆధ్యక్షతన అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు.తల్లిపాలు బిడ్డ మానసిక,శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు.చాలా మంది తల్లులు పిల్లలకు తేనె,నీళ్లు వంటివి పడుతుంటారని,అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు.రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని సూపర్వైజర్ సద్గుణ పేర్కొన్నారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప,ప్రవీణ, అంగన్వాడి టీచర్ తుల్జమ్మ, ఆశ వర్కర్లు యశోద, ప్రకృత,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

తల్లిపాలు నవజాత శిశువుకు వెలకట్టలేని సంపద

తల్లిపాలు నవజాత శిశువుకు వెలకట్టలేని సంపద…

నేటి ధాత్రి :-

శిశువు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు అందించడం శ్రేష్టకరమని, పిల్లల ఆరోగ్యం, మనుగడ, పోషణ, అభివృద్ధి తో పాటు తల్లి ఆరోగ్యానికి తల్లి పాలే కీలకమని పెద్దకిష్టపురం అంగన్వాడి కార్యకర్త భూక్యా సంత్ర అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పెద్ద కిష్టాపురం గ్రామపంచాయతీలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ర మాట్లాడుతూ, ఉరుకులు పరుగుల జీవితంతో కొందరు తల్లులకు పాలు పట్టే సమయం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు శ్రేష్టమని, తల్లిపాలు పుట్టిన బిడ్డకు వెంటనే పట్టించాలని దీని ద్వారా ఆ బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.తల్లి పాలలో మంచి పౌష్టికాలు ఉండి పిల్లవాడు ఎదుగుదలకు మరింత తోడ్పడుతాయని అన్నారు. పిల్లలకు తల్లిపాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని, దీనివల్ల శిశువుకు ఎటువంటి మానసిక వైకల్యం లేకుండా ఉండడమే కాకుండా తల్లిపాల వల్ల బాలలకు ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు దరి చేరవని అన్నారు. అనంతరం సీజనల్ వ్యాధుల పట్ల గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.వీరభద్రం, వేణు కుమార్, రామ, మానస, రమ్య, కళ్యాణి, మమత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version