అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి…

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి.

జిల్లా ఇన్చార్జి డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక సెక్టార్ మీటింగ్ ఒడితల లక్ష్మి టీచర్ కేంద్రంలో జయప్రద సూపర్వైజరు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి బీడబ్ల్యుఓ మల్లేశ్వరి హాజరై అంగన్వాడి కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. టీచర్ ,ఆయా సమయపాలన కచ్చితంగా పాటించాలి. ప్రీస్కూల్ కార్యక్రమాలన్నీ ఆట ,పాట ,కథ ద్వారా నేర్పించాలి. మెనూ ప్రకారం పిల్లలకు, తల్లులకు వేడిగా రుచిగా భోజనం పెట్టాలి. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయాలి. కొత్తగా లబ్ధిదారులు వచ్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ , ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాతనే ఫుడ్ ఇవ్వాలని సూచించారు తదుపరి ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. లక్ష్మి, ఉమాదేవి, సుజాత మిగతా 25 మంది టీచర్స్ హాజరైనారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version