అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి…

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి.

జిల్లా ఇన్చార్జి డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక సెక్టార్ మీటింగ్ ఒడితల లక్ష్మి టీచర్ కేంద్రంలో జయప్రద సూపర్వైజరు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి బీడబ్ల్యుఓ మల్లేశ్వరి హాజరై అంగన్వాడి కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. టీచర్ ,ఆయా సమయపాలన కచ్చితంగా పాటించాలి. ప్రీస్కూల్ కార్యక్రమాలన్నీ ఆట ,పాట ,కథ ద్వారా నేర్పించాలి. మెనూ ప్రకారం పిల్లలకు, తల్లులకు వేడిగా రుచిగా భోజనం పెట్టాలి. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయాలి. కొత్తగా లబ్ధిదారులు వచ్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ , ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాతనే ఫుడ్ ఇవ్వాలని సూచించారు తదుపరి ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. లక్ష్మి, ఉమాదేవి, సుజాత మిగతా 25 మంది టీచర్స్ హాజరైనారు.

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల కార్యాలయాలు ఆకస్మిక తనికిలు…

ఎన్.ఐసి కార్యాలయ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్..

కలెక్టర్ తనిఖీలతో అధికారులు,సిబ్బంది హడల్…

హాజరు పట్టికల పరిశీలించి సమయానికి రాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే శాఖల పనితీరు మెరుగుపడి ప్రజలకు ఉత్తమ సేవలో అందించినవారు అవుతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు రెవిన్యూ కార్యాలయంతో పాటు
అవుట్వాడ్ ఇన్వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్.ఐసి కార్యాలయం తనిఖీ హాజరు పట్టికని పరిశీలించి 11:30 అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎన్.ఐసి కార్యాలయ పనితీరు
బాగోలేదని అధికారి విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్ళటం పై అసహనం వ్యక్తం చేశారు
మెమో జారీ చేయాలని డిఆర్ఓ ఆదేశించారు. ఖజానా శాఖ కార్యాలయం తనిఖీ చేస్తూ పెన్షన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు , ఖజానా శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.సిబ్బంది హాజరు పట్టిక పరిశీలిస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులపై
మెమో లు జారీ చేయాలన్నారు.

 

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ తమ కర్తవ్య బాధ్యత లను
చిత్త శుద్ధితో నిర్వహించాలని , ఉదయం 10:30 కల్లా కార్యాలయాలకు చేరుకుని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో బాధ్యతారాహిత్యం తగదు అన్నారు
వివిధ శాఖల అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ అకౌంటెంట్ పరమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version