నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు. ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .
ఝరాసంగం:ఇక్కడ పారిశుధ్య లోపంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరత పేరుతో గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడి కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది.
అందుకు నిదర్శనంగా ఝరాసంగం మండలంలోని బిడకన్నె,కంబాలపల్లి,కృష్ణాపూర్ గ్రామాల దుస్థితి గురించి చెప్పవచ్చు.ఈ గ్రామాలలో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ గ్రామాల్లో విధిగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నుండి దుర్గంధం వెదజల్లుతుంది.
దీంతో ఈగలు,దోమలు,బ్యాక్టీరియా వెదజల్లి రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోనైనా బ్లీచింగ్ పౌడర్ నైనా సరిగా చల్లడం లేదని వారు వివరించారు.నిధుల కొరత పేరుతో ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి బోర్లు,మంచినీటి కుళాయిలు ఇతర నీటి పథకాల వద్ద మురుగునీరు నిలుచుని పిచ్చిగడ్డి మొలవడంతో పారిశుద్ధ్యం కొరవడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కనీసం గ్రామాలలో వీధి బల్బులు కూడా సక్రమంగా బిగించకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కనీసం మండల స్థాయి అధికారులైన గ్రామాలను సందర్శించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపించారు.
Suffer Due to Poor Sanitation
కాగా తమ గ్రామ సమస్యలను కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడంలేదని మంగళవారం బిడకన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం కార్యదర్శి చంద్రన్న ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.చెత్త చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారని వారు కోరారు.మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.వీధి బలుపులు లేక రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప్పు సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మండల ప్రజలందరికీ యువ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మీ కందరికీ సకల శుభాలు కలగాలని జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని గణనాథుని వేడుకుంటూ విగ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలన్నారు,
ఝరాసంగం: పెంపుడు జంతువులు, మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ తరుణంలోనే ఓ పిల్లి… తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. నాగుపాము బారి నుంచి ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో జరిగింది.మంగళవారం అర్థరాత్రి గొల్ల నర్సమ్మ-సిద్దన్న దంపతులు ఇంట్లో నిద్రలో ఉండగా, నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. ఈ దృశ్యాన్ని గమనించిన వారి పెంపుడు పిల్లి… ఆ పాముపై దాడి చేసి అడ్డుకుంది. వేటాడి దానిని చంపేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం లేచిన దంపతులు… ఇంట్లో చనిపోయి ఉన్న పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది పిల్లి ధైర్యంతో ఊపిరిపీల్చుకున్నారు. చంపిందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నారు
బాబు క్యాంప్ సంఘమిత్ర ఆధ్వర్యంలో.కొలువుదీరిన బొజ్జ గణపయ్య.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.
పూజారి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రసాదాలు తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ క్లబ్ కమిటీ సభ్యులు బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
54 నిమిషాల్లో గణనాథుని ప్రతిరూపం.. కళ్లకు గంతలు కట్టుకుని గణపతి తయారీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్కు చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 54 నిమిషాల్లో మట్టితో మూడు అడుగుల గణనాథుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని ఆయన హైదరాబాద్ కుషాయిగూడ చక్రిపురం ప్రాంతంలోని తన శిల్పకళ వర్క్షాప్లో రూపొందించారు.కళ అనేది కేవలం చేతి వృత్తి మాత్రమే కాదు, అది భక్తి, మంచి భావాలు, మనసును హత్తుకునే అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. నేటి యువత, పెద్దలు, పిల్లలు – తమ వృత్తుల్లో ఒత్తిడికి గురయ్యే వారందరూ కళను అభ్యసించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందవచ్చని శిల్పి అన్నారు. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. “పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అందరూ మట్టి గణపతులను ఉపయోగించాలని” శిల్పి హోతి బస్వరాజ్ పిలుపునిచ్చారు.
భూపాలపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్
భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రజలు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
వంతెనల పై నుండి ప్రజలు వాహనదారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి
అత్యవసర పరిస్థితిలో ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయగలరు 9030632608
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరిన చోట్ల, కాజ్వేల వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మొరంచపల్లి వాగు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న మార్గాల్లో ప్రయాణాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలలో భాగంగా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలను అడ్డు పెట్టాలని ఆదేశించారు.
ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చే సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 కంట్రోల్ రూముకు కాల్ చేయాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే వర్షాల కారణంగా పశువులు ప్రమాదానికి గురికాకుండా చూడాలని, వాటిని మేత కోసం బయటకు వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీయొచ్చనని హెచ్చరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వరద ప్రవాహాన్ని తాసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ భాస్కర్ కలిసి పరిశీలించారు
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.
వంటగదిలో ఆహార పదార్థాలను రుచి చూసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను మీడియా మిత్రులతో కలిసి టేస్ట్ చూశారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని తరగతి గదులను కలియ తిరుగుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కావాలని పలువురు విద్యార్థులు అడిగారు. అదేవిధంగా, తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు తరగతి గదుల్లోకి వస్తుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డార్మెటరీ, డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం తదితర సమస్యలను విద్యార్థులు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను అట్టి సమస్యలను త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంద న్నారు. అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ముంజాల రవీందర్ దాట్ల శ్రీనివాస్ భౌత్ విజయ్ ప్రజా ప్రతినిధులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
శాయంపేట మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎలాంటి సమాచారం లేకుండా రావడంతో అధికారులు పరుగులు పెట్టారు. పరిష్కా రంలో అధికారులు జాప్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
భూభారతి దరఖాస్తులు ఎన్ని వచ్చాయో,వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కార్యాలయం ఎదుట ఉన్న భూభారతి కానీ ప్రజల సమస్యలను అడిగి తెలుసు కుని స్థానిక తాసిల్దార్ కు ఆదేశించారు అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట తహసిల్దార్ సత్యనారాయణ, అన్ని శాఖల ప్రభుత్వ అధి కారులు, ఎస్సై పరమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
న్యాయవాది పై దాడిని తీవ్రంగా ఖండించిన వరంగల్ బార్ అసోసియేషన్:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
కూకట్పల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు అడ్వకేట్ తన్నేరు శ్రీకాంత్ కోర్టు వారంట్ అమలు చేస్తూ ఉండగా జరిగిన క్రూర దాడిని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇట్టి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిపై దాడి జరగడం అనేది న్యాయవ్యవస్థ గౌరవాన్ని, కోర్టుల అధికారం పట్ల చేసిన దారుణమైన సవాలుగా మేము భావిస్తున్నాము. నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి. రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, జాయింట్ సెక్రటరీ ముసిపట్ల శ్రీధర్ గౌడ్, లేడీ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, లైబ్రరీ సెక్రటరీ గుండా కిశోర్ కుమార్,20 ఇయర్స్ సీనియర్ ఈసీ ఇజ్జగిరి సురేష్, 10 ఇయర్స్ సీనియర్ ఈసీ కలకోట్ల నిర్మలా జ్యోతి, ఈసీ మెంబర్లు మర్రి రాజు, జాటోత్ రవి, మడిపెల్లి మహేందర్, తోట అరుణ మరియు న్యాయవాదులు కోటేశ్వర్, దయాన్ శ్రీనివాస్, శివ, సదానందం, శ్రీనివాస్, భిక్షపతి, ప్రదీప్ , అనీల్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొని ఖండించడం జరిగింది.
భారీ మట్టి గణపతులను తయారు చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్న ఊట్కురి శంకర్
పర్యావరణాన్ని కాపాడుదాం… మట్టి గణపతులను పూజిద్దాం
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ గ్రామానికి చెందిన ఊట్కూరి శంకర్ తన చిన్న వయసు నుండే మట్టి గణపతులను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందాడు అప్పటినుండి మొదలైన తన మట్టి గణనాధుల ప్రతిమల తయారీ ప్రయాణం కొనసాగిస్తూ తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ పర్యావరణ ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తూ కే సముద్రం ప్రజల మనసు గెలుచుకుంటూ అబ్బుర పరుస్తున్నారు ఊట్కూరి శంకర్, కేసముద్రం విలేజ్ బస్టాండ్ సెంటర్లో శ్రీ మట్టి గణపతి ఉత్సవ కమిటీలో ఊట్కూరి శంకర్ ఎం ఎస్ సి చదువుకొని మహబూబాబాద్ నలంద డిగ్రీ ప్రైవేట్ కళాశాలలో బోటనీ లెక్చరర్ గా విధులు నిర్వహించుకుంటూ ఉత్సవ కమిటీలో ఒక సభ్యునిగా కొనసాగుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాను సొంతంగా తయారు చేసిన మట్టి గణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకున్న మండపంలో పూజలు నిర్వహిస్తామని వివరించారు. సాక్షాత్తు శ్రీ పార్వతీదేవి తన స్వా హస్తాలతో మట్టి గణపతిని చేసి ప్రాణప్రతిష్ట చేసిందని పురాణాలు చెబుతున్నాయి, మనుషులను సృష్టించిన దేవతల ప్రతిమల్ని మనం కూడా మట్టితోనే వినాయకుడి రూపు ప్రతిమ విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించడం మన సనాతన ధర్మ ఆచారం అని వినాయకుని భక్తితో పూజించే ప్రజలు అందరూ ఈ ధర్మాన్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజిద్దాం… పర్యావరణహిత ప్రేమికులమవుతాం అనే ఈ సందేశం నన్ను కదిలించిందని అప్పటినుంచి నేను మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను తయారు చేస్తూ మన వంతు కృషిగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పర్యావరణ నిపుణులు రెండవ సందర్భాలలో పలు సూచనలు చేస్తూ వస్తున్నారని అన్నారు. ఇప్పటికే గణపతిని ఆరాధించే ప్రజలు 25% శాతం వరకు మట్టి గణపతిని పూజిస్తున్నారని ఇలాగే ప్రతి వినాయకుని మండపాల నిర్వాహకులు మట్టి గణపతి లనే మండపాలలో నెలకొల్పి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పి ఓ పి తో తయారు చేసిన గణపతి విగ్రహాల ప్రతిమలనే పూజించరాదని పిఓపి విగ్రహాల వల్ల కలిగే నష్టం నీటిని కాలుష్యం చేస్తుందని నీటి జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని అందుకే మన వంతు కృషిగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి వినాయకు లే ఉత్తమమైనదని తెలిపారు. వినాయకుడు అంటేనే “ప్రకృతి” ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన తెలంగాణ ప్రజల ఆనవాయితీ అని మట్టి విగ్రహాలను సహజ రంగులను వాడటం వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఊట్కూరి శంకర్ ప్రజలకు విన్నవించుకుంటున్నారు. రానున్న రోజులలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాల తయారు చేసుకునేందుకు ఉత్సాహవంతులు ముందుకు రావాలని మీలో ఉన్న ప్రతిభను చాటుకోవాలని కోరారు. నేను కూడా ఇంకా కష్టపడి మట్టి గణపతి విగ్రహాల తయారీలో ఉత్సవ కమిటీ సభ్యులు నాకు ఎంతగానో సహకరిస్తున్నారని తన తోటి ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.సామర్థ్యాన్ని సాధ్యమైనంతవరకు మెరుగుపరుచుకుంటూ ఉత్సాహం ఉన్న వారికి మట్టి గణపతి విగ్రహాల తయారీలో భాగస్వాములను చేస్తానని వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేలా సహకారం అందిస్తానని అన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న తాసిల్దార్ తిరుమల రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల్ తాసిల్దార్ పనిచేస్తున్న తిరుమల రావు ప్రజలకు సక్రమంగా సేవలు అందిస్తున్నారు. ప్రజల సమస్యలు విన్న వెంటనే పరిష్కారం చూపిస్తూ, పేదల అభ్యర్థనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తూ, కార్యాలయంలో పారదర్శకతను కాపాడుతున్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నందుకు స్థానికులు తాసిల్దార్ తిరుమల రావుకి ఝరాసంగం మండల్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు,
`ఎక్కడో అక్కడ పుల్ స్టాప్ పెట్టకపోతే ఆసుపత్రుల ఆగడాలు ఆగవు
`సామాన్యులకు సరైన వైద్యం అందదు
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే యోచనలో అనేక పదకాలు అమలు చేస్తుంటాయి. ప్రైవేటు వ్యాపారులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ఆలోచన చేస్తాయి. దురదృష్టమేమిటంటే మన దేశంలో విద్య, వైద్యం వ్యాపారమైపోయాయి. విద్య, వైద్యం ప్రజలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. అయితే సమాజంలోని అన్ని వర్గాలకు ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వానికి కూడా పూర్తి స్దాయిలో వీలు కాకపోవచ్చు. అప్పుడు పరోక్షంగా ప్రైవేటు వ్యవస్ధలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడుంది. ఇక్కడే ప్రైవేటు వ్యక్తులు విద్య, వైద్యాన్ని పూర్తిగా వ్యాపారమయం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్య రంగాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులు భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రజల కోసం ప్రభుత్వాలు తెచ్చే ఉచిత వైద్యాన్ని కూడా వైద్య వ్యవస్ధలు అలుసుగా తీసుకుంటున్నాయి. డబ్బు సంపాదనకు మార్గంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పధకాలను వారికి వరంగా చేసుకుంటున్నాయి. పైగా ప్రభుత్వాన్నే బెదిరించే స్దాయికి చేరుకుంటున్నాయి. ప్రజలకు మేలైన పాలన అందించాలి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగాలని ప్రభుత్వాలు కోరుకుంటాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్వీర్యం చేసే పన్నాగాలు పన్నుతుంటాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పధకం గత ఇరవై సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలు జరుగుతోంది. ఈ పధకం తెచ్చిన నాడు పెద్దగా ప్రభుత్వాసుపత్రుల లేవు. కాని ప్రజలకు మెరుగైన వైద్యం అందాలన్న ఆలోచనతో అప్పటి పాలకులు ఆరోగ్యశ్రీ తెచ్చారు. అందుకోసం ప్రైవేటు ఆసుపత్రుల సహకారం తీసుకున్నారు. అయితే ఆ ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వమే నేరుగా బిల్లులు చెల్లించే ఏర్పాటు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు పదిలక్షల వరకు పరిమితి పెంచింది. గతంలో ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందేలా వుండేది. ఇలా ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను ప్రైవుటు ఆసుపత్రులు కామదేనువుగా మార్చుకున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలు పెంచినా ప్రైవేటు ఆసుపత్రుల ఆశ తగ్గలేదు. తమ వైద్యానికి అదనంగా మరో చార్జీలు పెంచాలని కోరారు. అయినా రేవంత్ సర్కారు మరో 22శాతం ఫీజులు చెల్లించేందుకు కూడా అంగీకరించింది. అయినా ఆసుపత్రుల దన దాహం తీరడం లేదు. అయినవీ కానివీ అన్నట్లు లెక్కలేస్తున్నారు. సహజంగా జరిగే వైద్యానికి మించి బిల్లులు వేస్తున్నారు. ఇష్టాను సారం లెక్కలు చూపిస్తున్నారు. అయినా సరే పధకానికి ఆటంకం కలగొద్దన్న ఆలోచనతో ప్రభుత్వం మరింత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు తెలిసినా, భరిస్తూ, సహిస్తూ వస్తోంది. తమ వైద్యానికి ధరలు పెంచాలని కోరినా ప్రభుత్వం ఒప్పుకుంటూనే వుంది. వారికి అందాల్సిన బకాయిలు ఇప్పటికే రెండుసార్లు చెల్లించారు. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ బాకాయిలు ఏకంగా రూ.1700 కోట్లు చెల్లించారు. తర్వాత మరో 340 కోట్లు చెల్లించారు. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ సమయంలో ఏ ప్రభుత్వం ఆసుపత్రుల బకాయిలు చెల్లించలేదు. మొత్తని వాడిని మొత్తబుద్దవుతుందని ఒకసామెత. ప్రైవేటు ఆసుపత్రుల తీరు అలాగే వుంది. ఓ వైపు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పధకాన్ని చేయాల్సినంత దుర్వినియోగం చేస్తున్నారు. తప్పుడు బిల్లులు అనేకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే అనేకం వెలుగులోకి కూడా వచ్చాయి. అయినా వారి భయం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తమ మీద ఆదారపడాల్సిందే అన్న ధీమా వారిలో మరింత పెరిగిపోతూ వస్తోంది. ఇటీవల తమ బకాయిలు చెల్లించకపోతే తాము వైద్యం ఆపేస్తామంటూ ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు అల్టిమేటమ్ జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ బాకాయిలు చెల్లించపోతే ఆరోగ్య శ్రీ సేవలు ఆపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఆరోగ్య శ్రీ వల్లనే బతుకుతున్నాయి. ఆరోగ్య శ్రీ లేకుంటే తెలంగాణలో సగానికి పైగా ఆసుపత్రులు మూత పడాల్సిందే. ఈ నిజం తెలిసినా ప్రైవేటు ఆసుపత్రులు తమ ఆగడాలు ఆపడం లేదు. ప్రభుత్వాల ఉదాసీనత, మెకత వైఖరిని అలుసుగా చేసుకుంటున్నారు. చెలరేగిపోతున్నారు. ప్రతీసారి అనేక కొర్రీలు పెడుతూ, ఆరోగ్య శ్రీకి అడ్డంకులు సృష్టిస్తూ, ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజం చెప్పాలంటే కేవలం ఆరోగ్యశ్రీ కోసమే తెలంగాణలో అనేక ఆసుపత్రులు వెలిశాయి. ఈ సంగతి ఆసుపత్రుల నిర్వాహకులకు తెలిసినా, ప్రభుత్వాలను బెదిరించి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆపేస్తే తెలంగాణలోని సుమారు 70శాతం ఆసుపత్రులు మూసుకోవాల్సిందే. కాని ప్రభుత్వం ఆ పని చేయదన్న దుర్మార్గం పెచ్చరిల్లిపోతోంది. ఆసుపత్రలు మీద చర్యలు తీసుకునే స్ధితి వుండదన్న ధీమాతో ప్రైవేటు ఆసుపత్రులు ఆటలాడుతున్నాయి. గత ప్రభుత్వం కేసిఆర్ హాయంలో ఆరోగ్యశ్రీ అమలులో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. దాంతో విజిలెన్స్ ఎంక్వౌరీ చేశారు. ఆ రిపోర్టు కూడా ప్రభుత్వం వద్ద వుంది. ఆ రిపోర్టు పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవడం మొదలుపెడితే, సోకాల్డ్ గొప్ప ఆసుపత్రులని చెప్పుకునేవి అనేకం మూత బడడం ఖాయం. అంతలా ఆరోగ్యశ్రీలో అవినీతి జరిగాయనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అందుకు గత ప్రభుత్వం ఆసుపత్రుల గొంతెమ్మ కోరికలు తీర్చలేదు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడతామంటే సహించేది లేదని తేల్చి చెప్పింది. అందుకే గత ప్రభుత్వ హాయంలో రెండు వేల కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ బకాయిలు వున్నా, ప్రైవేటు ఆసుపత్రులు నోరు మెదపలేదు. బకాయిలు ఇస్తేగాని వైద్యం చేయలేమని చేతులెత్తేయలేదు. పదే పదే తమ చికిత్సలకు చార్జీలు పెంచాలని కోరలేదు. మొత్తం పదేళ్ల కాలంలో ఒకటో, అరో తప్ప ఆరోగ్యశ్రీ ఆసుత్రులు ప్రభుత్వాన్ని కోరింది లేదు. ప్రభుత్వం బకాయిలు ఇచ్చినప్పుడు తీసుకున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలంటూ వేడుకుంటూ వుండేవారు. కాని ఇప్పుడు ఆసుపత్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నెల 30లోగా బకాయిలు చెల్లించాలని డెడ్ లైన్పెడుతున్నాయి. లేకుంటే సేవలు నిలిచిపోతాయని అల్టిమేటమ్ జారీ చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో బాకీ పడిన బకాయిలను ఏక కాలంలో రేవంత్ సర్కార్ వెనుకాడకుండా ఏక కాలంలో 1780కోట్లకు పైగా విడుదల చేయడం అనేది గొప్ప విషయం. ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకూడదన్న ఆలోచనతో రేవంత్ సర్కార్ ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేశాయి. నిజానికి ప్రభుత్వం అంత మొత్తం ఒకేసారి విడుదల చేస్తుందని ప్రైవేటు ఆసుపత్రులు ఊహించలేదు. మొత్తం 2200 కోట్ల బకాయిల్లో ఓ 300 నుంచి 500 కోట్లు విడుదల చేస్తాయని అనుకున్నారు. కాని ఎంతో ఉదారతతో ఎక్కడా వైద్య సేవలకు అంతరాయం కలకూడదన్న గొప్ప మనసుతో రేవంత్ సర్కారు ఏక కాలంలో మూడువంతులకు పైగా నిధులు విడుదల చేసింది. అయినా ప్రైవేటు ఆసుపత్రులకు నీతి లేకుండాపోయింది. నిజాయితీ అనే పదం కూడా వారి డిక్షనరీలో లేకుండా చేసుకుంటున్నారు. రేవంత్ సర్కార్ ఇలా ఏక కాలంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడంతో ఈ రెండుసంవత్సరాల కాలంలో పెద్దఎత్తున ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లు, ఎంతో మంది వ్యాపార వేత్తలు కూడా వైద్య రంగంలోకి దిగారు. పెద్దఎత్తున ఆసుపత్రులు పెట్టారు. ప్రభుత్వాన్ని కోరి, ఒప్పించి, మెప్పించి ఆరోగ్య శ్రీ సేవల కోసం ఎంపానల్ మెంట్లు చేయించుకున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య శ్రీ నిధుల మీదనే ఆదారపడి ఆసుపత్రులు నడిపించుకుంటూ ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేసేదశకు చేరుకుంటున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటే తప్ప ప్రైవేటు ఆసుపత్రులు దారికి రావు. గత ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ ఎంక్వౌరీ రిపోర్టును బట్టిచర్యలు తీసుకుంటే చాలా ఆసుపత్రుల లైసెన్స్లు రద్దవుతాయి.
బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
#క్యాంపు కార్యాలయం వేదికగా నగరవాసులకు మట్టి గణపతులను పంపిణీ…
హన్మకొండ, నేటిధాత్రి:
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగరంలోని భక్తులకు,ప్రజలకు స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు పర్యావరణ హితంగా ఉండాలని కోరుతూ నగరంలో 30000 విగ్రహాలకు అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు సరఫరా అందిస్తున్నదని వెల్లడించారు.మా వంతుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.ఈ మట్టి గణపతుల పూజతో పాటుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. ఇప్పటికే అధికారులకు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చామని నవరాత్రి వేడుకలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని,నగరంలో ఏర్పాటు చేసిన మండలాలలో పర్యవేక్షణను చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పాల్గొన్నారు.
కథలాపూర్ మండలం లోని సిరికొండ శ్రీరాం యూత్ అధ్యక్షునిగా ముంజ మహేష్ వీరేంద్ర ను మంగళవారం రోజున నియమించినట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఉపాధ్యక్షులు నునుగొండ పునీత్, ప్రధాన కార్యదర్శి బెజ్జారపు నితిన్, కోశాధికారిగా మర్రిపెల్లి వంశీ లు ఎన్నికయ్యారు. తన నియామకానికి సహకారాన్ని అందించిన సభ్యులకు వీరేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. యూత్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.. ముందస్తుగా అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాస్, ఓలవేని శ్రీనివాస్,నీలి కన్నయ్య, సిరిమల్లె రాజశేఖర్,మల్యాల మారుతి,గాంధారి శ్రీనివాస్ మహేష్ వీరేంద్ర ను అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని 11వ వార్డులో గల 44వ చౌక ధరల పంపిణీ కేంద్రంలో 11వ వార్డు ప్రజలకు సుమారు 180 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది చాలా రోజుల నుండి రేషన్ కార్డుల పంపిణీ లేనందుకు రేషన్ కార్డుల్లో చిన్నపిల్లల పేర్లు నూతన వధువుల పేర్లు చేర్పించలేని పరిస్థితులలో ఇదివరకే కార్డు లేని వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ప్రజా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందివ్వడానికి ముందుకు విచ్చేసిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది ఇందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేసి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ గిరిధర్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సీనియర్ నాయకులు సిద్ధము ఉజ్వల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో 11వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పి.రాములు నేత మరియు సీనియర్ నాయకులు మాధవరెడ్డి నగేష్ వీరన్న అదేవిధంగా వార్డు ఆర్పీలు వరలక్ష్మి మాధవి గార్లు వాడు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా వారి మెడల్లో చైన్ స్నాచింగ్లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి సూమారు 23లక్షల 50వేల రూపాయల విలువ గల 237గ్రాముల బంగారు పుస్తెల తాళ్ళు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Police Commissionerate
ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్న నిందితుడు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఓ సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నిషన్గా హైదరాబాద్లో పనిచేసేవాడు ఇదే క్రమములో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి దానిని స్థానిక మణిప్పురం గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసేడు. ఈ సంఘటలో నిందితుడుని స్థానిక నెరెడ్మెట్ పోలీసులు ఈ ఏడాది అరెస్టు చేసిన జైలుకు తరలించారు. బెయిల్పై విడుదలైన నిందితుడిలో ఏలాంటి మార్పు రాకపోగా తన జల్సాలకు అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రొడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో చైన్ స్నాచింగ్లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్న నిందితుడు ముందుగా చైన్ స్నాచింగ్ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్ళి చైన్ స్నాచింగ్లకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం పది చైన్ స్నాచింగ్లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, అలాగే సుబేదారి, కాజీపేట,హసన్పర్తి, కమలాపూర్, కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడగా, హన్మకొండ, హసన్పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడు మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడటం జరిగింది. ఈ వరుస చైన్ స్నాచింగ్ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్, హన్మకొండ ఏసిపిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడుని గుర్తించిన పోలీసులు పక్కా సమచారంతో ఈ రోజు ఉదయం పోలీసులు ఉదయం యాదవ్నగర్ క్రాస్ రోడ్డు వద్ద వాహన కెయూసి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ చేసిన బంగారు గొలుసులను విక్రయించేందుకు అనుమానస్పదంగా చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడుని రోడ్డుపై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిందితుడుని పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతను నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైమ్స్ డిసిపి గుణశేకర్, క్రైమ్స్ ఏసిపి సదయ్య, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, కెయూసి, సిసిఎస్ ఇన్స్స్పెక్టర్లు రవికుమార్, రాఘవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, సిసిఎస్ ఎస్.ఐ లు రాజ్కుమార్, శివకుమార్, హెడ్కానిస్టేబుళ్ళు అంజయ్య, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్, చంద్రశేకర్, రాములు, నగేష్లతో కెయూసి పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ లొని ఎంఆర్ హెచ్ఎస్ గార్డెన్ నగర్ లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప నాయకులు దీపక్ వినోద్ ప్రభాకర్ మోహన్ ప్రవీణ్ చింటు సురేష్ ప్రశాంత్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.