డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వీడని అ సౌకర్యాల గ్రహణం…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వీడని అ సౌకర్యాల గ్రహణం

◆:- పి.రాములు నేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని హోతి కే దగ్గర దాదాపు 600 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగినది ఈ ఇండ్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు వీధిలైట్లు శుభ్రమైన పరిసరాలు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కనీసం మంచినీరు కూడా అసలే రావడం లేదు ఇప్పటికే ఇండ్లలో 90 శాతం మంది నివాసముంటున్నప్పటికిని అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి వేళల్లో ఇండ్ల మధ్య తిరగాలంటే ప్రాణం చేతిలో పట్టుకొని ఏ విషపురుగులు కాటేస్తాయోనని భయపడుతున్నారు కాలనీలో పూర్తి చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి మంచినీళ్లు లేక కాలనీకి అంటుకొని ఉన్న బోరు బావుల వద్ద చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు ఇండ్ల మధ్యలో ఉన్న మురికి ఎక్కడికి అక్కడే అట్లాగే ఉంది దట్టమైన పోదలు కుప్పలు కుప్పలుగా వృధా అయిన నిర్మాణ సామగ్రి ఎక్కడికి అక్కడే పడి ఉంది ఈ విషయాలన్నీ కూడా కాలనీలోని ఒకరి గృహానికి గృహప్రవేశానికి విచ్చేసిన పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి తేవడంతో తను స్పందించి కనీసం వీధి స్తంభాలకు చిన్నపాటి బల్బులు అయిన వేయిస్తాను అని చెప్పి వీధి స్తంభాలకు బల్బులు వేయించడం జరిగింది దీనికి సంతోషించిన కాలనీ ప్రజలు రాములు నేత గారికి కృతజ్ఞతలు తెలిపినారు రాములు నేత కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా ఐక్యంగా ఉంటే ఈ విషయాలన్నీ కూడా అధికారుల దృష్టికి తెస్తాం వాస్తవానికి ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే అధికారులు వాటిని నీరుగార్చాలని చూస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా కొనసాగుతుంది ఈ సమస్యలన్నీ కూడా అధికారులు అనుకుంటే ఒక రోజులో పూర్తయ్యేటట్లు చేయగలరని ప్రభుత్వానికి ఇరకాటం పెట్టడానికి ప్రజలకు అయోమయానికి గురిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని ఇదంతా అధికారుల పెద్ద ఎత్తు నిర్లక్ష్యమని అధికారులతో కచ్చితంగా పనిచేయిస్తామని కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు ఇకనైనా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని అశ్రద్ధలు వీడి కాలనీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కాలనీ ప్రజల తరఫునుండి కోరినారు కార్యక్రమంలో జహీరాబాద్ బిజెపి పట్టణ కార్యవర్గ సభ్యులు అప్పం శ్రావణ్ రిటైర్డ్ రెవిన్యూ అధికారి నరసింహులు పాల్గొన్న తదితరులు పాల్గొన్నారు,

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన…

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్లో సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, శుక్రవారం మధ్యాహ్నం జర్నలిస్టులు ఊరేగింపు నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని, అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

రేవ్.జార్జ్.బి గార్డెన్ దొర గారి 33వ వర్ధంతి

రేవ్.జార్జ్.బి గార్డెన్ దొర గారి 33వ వర్ధంతి

జహీరాబాద్ నేటి ధాత్రి

 

జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ లొని ఎంఆర్ హెచ్ఎస్ గార్డెన్ నగర్ లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప నాయకులు దీపక్ వినోద్ ప్రభాకర్ మోహన్ ప్రవీణ్ చింటు సురేష్ ప్రశాంత్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version