పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలి

న్యూట్రిషన్ లపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి

మహబూబాబాద్/ నేటి ధాత్రి

బుధవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, కురవి మండలం నేరేడ జడ్.పి.హెచ్.ఎస్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు,

ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న విద్య బోధనలను స్వయంగా పరిశీలించారు, నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధనలు అందించాలని, రానున్న పదవ తరగతి పరీక్షల్లో అన్ని విద్యాసంస్థలలో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీయాలని సూచించారు,

పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాణ్యమైన డైట్ మెనూ అమలు చేయాలని సూచించారు, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ లపై పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు,
అంతకుముందు పాఠశాల ఆవరణంలోని కిచెన్ షెడ్ డైనింగ్ హాల్ మరుగుదొడ్లు తరగతి గదులు పరిశీలించారు,
భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని, విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు,
మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన సమయంలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలను తనిఖీలు నిర్వహించాలనీ సూచించారు.

మొగుడంపల్లి మండలంలో ఆకస్మిక ఇన్స్పెక్షన్ అధికారుల తనిఖీ…

మొగుడంపల్లి మండలంలో ఆకస్మిక ఇన్స్పెక్షన్ అధికారుల తనిఖీ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాల మన్నాపూర్ మరియు రాయిపల్లి తండా పాఠశాలలు ఈ రోజు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ మరియు జిల్లా ఇన్స్పెక్షన్ టీం మెంబెర్స్ యం,డి వాహబోదీన్, నిమ్మల కిష్టయ్య, పైన పేర్కొన్న పాఠశాలలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఎఫ్ఎల్ఎన్, సీసీఈ రికార్డ్స్ , పిటిఎం , లు క్షుణ్ణంగా రికార్డులను తనిఖీ చేసి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా అధికారులు తగు సూచనలు చేయడం జరిగింది.

జహీరాబాద్లో 108, 102 అంబులెన్స్ల ఆకస్మిక తనిఖీ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-19T124005.645.wav?_=1

 

జహీరాబాద్లో 108, 102 అంబులెన్స్ల ఆకస్మిక తనిఖీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రోగ్రాం మేనేజర్ సంపత్, ఈఎంఈ కిరణ్ 108, 102 అత్యవసర సేవల అంబులెన్స్ వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల్లోని వైద్య పరికరాలు, మందుల నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రైతులను ఇబ్బంది చేస్తే కఠిన చర్యలు తీసుకుం టాం

జిల్లా కలెక్టర్ సత్యశారద

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపులో తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరిం చాల్సి ఉందని ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలు సుకున్నారు. రైతులకు నీడగా టెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది వడ్ల తేమ శాతా న్ని పరిశీలించి నిబంధనల మేరకు తాలు మట్టిలేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాల న్నారు వడ్ల కొనుగోలు వివ రాలు క్యాబ్ ఎంట్రీ లపై ఆరా తీశారు. ఈ విషయంపై కలెక్టర్ మండిపడ్డారు.

ధాన్యం కొను గోలు ఆలస్యం కాకూడదు రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ వని పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెం టనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులను ఇబ్బం దులను గురి చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తాత్కాలిక మండల వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు

కేజీబీవీ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T160913.967.wav?_=2

 

కేజీబీవీ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేజీబీవీ హాస్టల్‌కు కూరగాయలు సక్రమంగా
సరఫరా చేయడం లేదని తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
శుక్రవారం మహాముత్తారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్శన సందర్భంగా విద్యాలయంలోని వసతి సదుపాయాలు, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, మెనూ నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, హాజరు రిజిస్టర్, వంటశాల పరిశుభ్రత వంటి అంశాలను ఆయన పరిశీలించారు.
ఆహార మెనూ అమలు చేయకపోవడం లేదని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషణ దృష్ట్యా ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యతమైన భోజనం అందించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ పర్యవేక్షణ చేస్తూ ఇన్‌చార్జ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాలయంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయలు సక్రమంగా సరఫరా చేయడం లేదని విద్యాశాఖ అధికారి విచారణ నిర్వహించి నివేదిక అందచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ ఆర్ఐ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ…

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఈరోజు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ను .అకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులను మరియు హాస్టల్ సిబ్బందిని జిల్లా వైద్యాధికారి. ఆరోగ్యశాఖ అధికారి. పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా హాస్టల్లో నాణ్యమైన వస్తువులను వంటలకు వాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. నిల్వ ఉన్న వంటలకు సంబంధించి ఆహార పదార్థాలు వాడరాదని. సూచిస్తూ పరిసరాలు పరిశుభ్రతగా. ఉంచాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని నీరు నిలువ ఉండకుండా చూడాలని. ప్రత్యేకంగా విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను వంటలకు వాడాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రతలపై అవగాహన కల్పిస్తూ నాణ్యత మైన భోజనాలు పెట్టాలని. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కేటాయించి విద్యార్థుల చదువుపై దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా హాస్టల్ . యజమాన్యానికి సూచిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రత్యేకంగా తెలియజేశారు అలాగే విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి మీ బాగోబాగులు చూసుకుంటున్నారా అని జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థులందరూ ఎప్పటికప్పుడు తగిన శుభ్రతలుపాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. జిల్లా వైద్యాధికారి. మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంపత్. సిహెచ్ఓ.బాలచంద్రం. వైద్య సిబ్బంది హాస్టల్ సిబ్బంది విద్యార్థులు తదితరులు ఉన్నారు

అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి.

అంగన్వాడి కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి.

ఆకస్మికతనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ ఊర్మిళ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గాంధీనగర్, నడిమి పల్లి అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేసిన క్లస్టర్ స్పెషల్ఆఫీసర్ నైన్ పాక హై స్కూల్ హెచ్ఎం ఊర్మిళ రెడ్డి , జయప్రద సూపర్వైజర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల పరిశుభ్రత, పిల్లల హాజరు, మెనూ ప్రకారం భోజనం, ప్రీస్కూల్ కార్యక్రమాలు, పిల్లల బరువు ఎత్తులు, వ్యక్తిగత శుభ్రతలు గమనించి ,చూసి టీచర్స్ కు , ఆయాలకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఒక పాపకు అక్షరాభ్యాసం చేసి ,రెండవ విడత కోడిగుడ్ల పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్స్ రమ, సాధన రాణి, వసంత, మమత ఆయా సుమలత హాజరైనారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీసీ ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, రైతులు తెచ్చే వరికుప్పల తేమశాతాన్ని ప్రతిరోజూ ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. 17% తేమ శాతం వచ్చిన ప్రతి రైతుకు వెంటనే గన్నిబస్తాలు కేటాయించి, ఎలాంటి ఆలస్యం లేకుండా తూకం వేసి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని, ఏ విధమైన జాప్యం, నిర్లక్ష్యం సహించబోమని ఆయన హెచ్చరించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా నోటీస్ బోర్డు ఏర్పాటు చేసి, అందులో క్రింది వివరాలను రోజువారీగా స్పష్టంగా ప్రదర్శించాలన్నారు.

రోజు కేంద్రానికి వచ్చిన రైతుల సంఖ్య

సేకరించిన అంచనా ధాన్యం పరిమాణం

17% తేమ శాతం వచ్చిన రైతుల సంఖ్య

ఇప్పటివరకు కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం వివరాలు

రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు
అదేవిధంగా రోజువారీ తేమశాతం నమోదు రిజిస్టర్ క్రమ పద్ధతిగా నిర్వహించాలని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం సూచించిన ప్రొఫార్మాలకు అనుగుణంగా రైతుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి శ కిరణ్ కుమార్, డిఎం రాములు, చిట్యాల, మొగుళ్లపల్లి తహసీల్దార్లు ఇమామ్ బాషా, సునీత, సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ….

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.

#ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

#సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.

#డిఎం హెచ్ ఓ సాంబశివ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనకి చేశారు. అనంతరం రికార్డులను, మందులను, దావకాన పరిసరాలను పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని కావున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులను అందివ్వాలి. ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో నే అందుబాటులో ఉండాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(DM&HO) డాక్టర్ మధుసూదన్ గారు ఆకస్మిక తనిఖీ చేసినారు. ఆస్పత్రి హాజరు పట్టికను పరిశీలించినారు. ఆసుపత్రి ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలియజేసినారు. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేసినారు. అదేవిధంగా ఆస్పత్రిలో లేబర్ రూమ్ ,ఆయుష్ రూమ్, యోగ రూమ్ ములను పరిశీలించినారు .
తర్వాత మొగుళ్లపల్లి ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ పరిశీలించినారు. వాక్సినేషన్ టిబి నోటిఫికేషన్ , సీజన్ వ్యాధుల గూర్చి మరియు ఎన్ సి డి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాణి గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆకస్మికంగా స్కూల్స్ తనిఖీ చేసిన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్…

ఆకస్మికంగా స్కూల్స్ తనిఖీ చేసిన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్
సెక్రెటరీ
జడ్జి చిలుక మారి పంచాక్షరి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలోని ఎం జె పి స్కూల్ అలాగే కస్తూర్బా స్కూల్ గ్రామపంచాయతీ భవనంలో విలేజ్ లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ను తనిఖీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎం జె పి స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపాల్ తో కలిసి వంటగదిలను డైనింగ్ హాల్స్ టాయిలెట్స్ టీచింగ్ పరిశీలించి అనంతరం పంచాక్షరి జడ్జిగారు మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచి నాణ్యత మైన భోజనం అందించాలని మంచి చదువు బోధించాలని స్కూల్ ప్రిన్సిపాల్ లకు సూచించారు అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తులో మీరు ఏ లక్ష్యం కోసం చూస్తున్నారో ఆ లక్ష్యం అందే వరకు పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పి ఎల్ వి మంగళపల్లి శ్రీనివాస్ ఎస్ ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు

అమ్మో.. కస్తూర్బా గాంధీ.. ఆకస్మిక తనిఖీల్లో షాకైన అధికారులు

అమ్మో.. కస్తూర్బా గాంధీ.. ఆకస్మిక తనిఖీల్లో షాకైన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ కోసం పలు రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కింది స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణం, గదులు, మరుగుదొడ్లు, వంట గది ఉన్నాయి. ఆకస్మిక తనిఖీ కి వచ్చిన అధికారులే అక్కడి సమస్యలను చూసి అవాక్కయ్యారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు, ఎంపీడీవో మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామారావు, సాయికిరణ్ సిబ్బందితో కలిసి పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నిర్వహణ లోపం ఉండడం తో పాఠశాల ప్రత్యేక అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు జ్వరాలు వచ్చినా ఎందుకు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తూ అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. అధికారులు పాఠశాల వంటగదిని పరిశీలించగా ఎలుకలు కొరికిన టమాటాలు, కుళ్లిపోయ

సిరిసిల్ల జూనియర్ కళాశాలపై ఆకస్మిక తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T170637.807.wav?_=3

 

ప్రభుత్వం జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాధికారి (co-ed) శ్రీనివాస్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగినది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గదుల పరిశీలన మరియు సైన్స్ ల్యాబ్లు, విద్యార్థుల మేధాశక్తి గురించి, పాఠ్యాంశాల గురించి, మరియు విద్యార్థుల హాజరుశాతం పెంచాలని,అధ్యాపకులను ఉద్దేశిస్తూ మారుతున్న టెక్నాలజీ నేర్చుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని వారు కోరారు.ఎంసెట్ జేఈఈ ఎంట్రన్స్ లకు సంబంధించిన తరగతులను “ఫిజిక్స్ వాలా” నిర్వహిస్తున్నారని వాటి లో పాఠాలు విని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. ఈ సంవత్సరం కళాశాలలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని అధ్యాపకులను, విద్యార్థులను కోరారు.

 

 

అలాగే పరిశీలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కష్టపడితేనే విజయం తప్పనిసరి తమ వెంట ఉంటుందని సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు వివేకానంద, మరియు తదితర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

భూపాలపల్లి గిరిజన బాలికల ఆశ్రమలో ఎమ్మెల్యే తనిఖీ….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T145502.392.wav?_=4

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

విద్యార్థుల సమస్యలను ఐటీడీఏ పీవో కు ఫోన్ లైన్లో వివరించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు.

MLA Inspects Tribal Girls Hostel in Bhoopalapalli

గత పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పని చేయడం లేదని కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్, మూడు నెలల నుండి కాస్మోటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి, దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే వెంటనే ఏటూరునాగారం ఐటిడిఏ పీఓకు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. సమస్యలను వీలైనంత త్వరగా ఎస్టిమేట్స్ వేసి పనులను ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలని కోరారు. విద్యార్థుల వసతి గృహాన్ని పక్కనున్న భవనంలోకి మార్చాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T135104.883.wav?_=5

 

సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

– ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

 

– విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు

– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, సెప్టెంబర్ – 01(నేటి ధాత్రి):

 

 

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.

మైనారిటీ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-94.wav?_=6

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

వంటగదిలో ఆహార పదార్థాలను రుచి చూసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను మీడియా మిత్రులతో కలిసి టేస్ట్ చూశారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని తరగతి గదులను కలియ తిరుగుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కావాలని పలువురు విద్యార్థులు అడిగారు. అదేవిధంగా, తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు తరగతి గదుల్లోకి వస్తుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డార్మెటరీ, డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం తదితర సమస్యలను విద్యార్థులు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను అట్టి సమస్యలను త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంద న్నారు. అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ముంజాల రవీందర్ దాట్ల శ్రీనివాస్ భౌత్ విజయ్ ప్రజా ప్రతినిధులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ఎరువుల షాపులపై కలెక్టర్ తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-3.wav?_=7

ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు

కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గీసుగొండ మండలం కీర్తి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది,ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పారాసెటమాల్ మందు అధికంగా ఉండడం పై ఫార్మసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం మేరకే మందుల ఇండెంట్ తెప్పియాలన్నారు. ప్రతి మందు ఈ ఔషధం ప్రకారమే రోగులకు అందించాలన్నారు.ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని,స్క్రాప్ ను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని సూచించారు.
కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

కీర్తినగర్ పిహెచ్సి ఫార్మసీపై ఆగ్రహం వ్యక్తం.

కీర్తినగర్ పిహెచ్సి ఫార్మసీపై ఆగ్రహం వ్యక్తం.

ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటి ధాత్రి:

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కీర్తి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో
పారాసెటమాల్ మందులు అధికంగా ఉండడంపై ఫార్మసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది,ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంతమంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పారాసెటమాల్ మందు అధికంగా ఉండడం పై ఫార్మసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం మేరకే మందుల ఇండెంట్ తెప్పియాలన్నారు.ప్రతి మందు ఈ ఔషధం ప్రకారమే రోగులకు అందించాలన్నారు.ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని, స్క్రాప్ ను వెంటనే తొలగించుటకు చేయుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు.హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని,వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు.కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు..

తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

కలెక్టర్ సత్య శారద దేవి

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలోని భూ భారతి రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ రాజ్ కుమార్ ను మండల వ్యాప్తంగా వచ్చిన ఫైళ్ళ వివరాలు అడిగి తెలుసుకుని రెండు రోజులలో భూ సమస్యల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులతో సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని అన్నారు. ఏమాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బంది టీములుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికను పంపించాలని అన్నారు.

నెక్కొండ సర్వేయర్ పై ఆగ్రహం

మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించిన వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి నెక్కొండ సర్వేయర్ కుశాల్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ భూభారతి దరఖాస్తులపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించక రెవెన్యూ కార్యాలయంలో ఏం చేస్తున్నావ్ అంటూ చురకలంటించారు. ఎక్కువ శాతం భూ సమస్యలు సర్వేయర్లు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, నర్సంపేట డి ఏ ఓ శ్రీనివాస్, వరంగల్ డీఏవో ఫణి కుమార్, రెవెన్యూ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version