తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక స్వర్ణ యుగం
◆:- పి.రాములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని 11వ వార్డులో గల 44వ చౌక ధరల పంపిణీ కేంద్రంలో 11వ వార్డు ప్రజలకు సుమారు 180 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది చాలా రోజుల నుండి రేషన్ కార్డుల పంపిణీ లేనందుకు రేషన్ కార్డుల్లో చిన్నపిల్లల పేర్లు నూతన వధువుల పేర్లు చేర్పించలేని పరిస్థితులలో ఇదివరకే కార్డు లేని వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ప్రజా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందివ్వడానికి ముందుకు విచ్చేసిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది ఇందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేసి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ గిరిధర్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సీనియర్ నాయకులు సిద్ధము ఉజ్వల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో 11వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పి.రాములు నేత మరియు సీనియర్ నాయకులు మాధవరెడ్డి నగేష్ వీరన్న అదేవిధంగా వార్డు ఆర్పీలు వరలక్ష్మి మాధవి గార్లు వాడు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,