కాంగ్రెస్ నాయకుల కు అడ్డగా తహసిల్దార్ కార్యాలయం…

కాంగ్రెస్ నాయకుల కు అడ్డగా తహసిల్దార్ కార్యాలయం.

#కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే శిక్షించాలి.

#ఆత్మ హత్య యత్నానికి ప్రేరేపించిన ఎమ్మార్వో ను తక్షణమే సస్పెండ్ చేయాలి.

#కల్పన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.

#మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

నల్లబెల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వాంకుడోత్ కల్పన సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్గొన్న సంఘటన పై బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పాల్గొని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక గిరిజన మహిళ ఉద్యోగి పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను తమ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని అక్రమ పనుల కోసం అధికారులను వేధిస్తూ తమ ఉనికిని చాటుకునేందుకు నీచమైన రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడం సిగ్గుచేటు. గిరిజన మహిళ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించకపోవడం దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వాంకుడోత్ కల్పన తనకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రమాదం ఉందని వారు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని ఎమ్మార్వో కు పలుమార్లు చెప్పినా కూడా ఎమ్మార్వో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాజీ పడాలని చెప్పడం ఆమెను మానసికంగా ఎంతగానో కృంగాదీసింది. తోటి ఉద్యోగరాలకు ప్రమాదం ఉందని తెలిసి ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారకుడైన ఎమ్మార్వో ముప్పు కృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయలలో కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడుతున్న అధికారులకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మండలంలో మైనింగ్, మట్టి మాఫియా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారుల పైన జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రశ్నించిన వారి పైన అక్రమంగా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు. ఇప్పటివరకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న కల్పనను పై ఉన్నతాధికారులు ఎవరు పరామర్శించకపోవడం బాధాకరమని. నిరసన కార్యక్రమాన్ని విరమించాలని నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై గోవర్ధన్ చెప్పినప్పటికీ కూడా శాంతించని బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆర్డీవో వచ్చి బాధితురాలకు భరోసా ఇచ్చేంతవరకు నిరసన కార్యక్రమాన్ని విరమింప చేసే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారు. పరిస్థితి చేయి దాటి పోతుందని గమనించిన ఎస్సై గోవర్ధన్ ఆర్డీవోతో చరవాణి ద్వారా పెద్ది స్వప్నతో మాట్లాడుతూ కల్పన ఆత్మహత్యయత్నని కి కారకులైన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వగా నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ మేరకు కేసును సుమోటోగా తీసుకొని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు పాలెపు రాజేశ్వరరావు, గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారామ్ యాదవ్, అమరేందర్, గోనె యువరాజు, మామిండ్ల మోహన్ రెడ్డి, లావుడియా తిరుపతి, జాటోతు తిరుపతి, మాజీ ఎంపిటిసి లక్ష్మి, ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, మేడిపల్లి రాజు, మాటూరి హరీష్, తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ సుష్మ రాజ్ గోపాల్ గౌడ్ కుటుంబానికి పరమార్శ…

మాజీ సర్పంచ్ సుష్మ రాజ్ గోపాల్ గౌడ్ కుటుంబానికి పరమార్శ

గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

నెల్లికుదురు మండలం బొడ్లాడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ మండ సుష్మ రాజగోపాల్ గౌడ్ తండ్రి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి జలగం వెంకన్న అకాల మరణం చెందగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వెంకన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగాఢ సానుభూతిని తెలిపి సుష్మ రాజగోపాల్ గౌడ్ కి, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు సిపిఎం రాష్ట్ర నాయకులు భిక్షమయ్య గౌడ్ దంపతులు,కేసముద్రం కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్..ఈ పరామర్శలో వీరితోపాటు మాజీ సర్పంచ్ నరేందర్ ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక స్వర్ణ యుగం…

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక స్వర్ణ యుగం

◆:- పి.రాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని 11వ వార్డులో గల 44వ చౌక ధరల పంపిణీ కేంద్రంలో 11వ వార్డు ప్రజలకు సుమారు 180 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది చాలా రోజుల నుండి రేషన్ కార్డుల పంపిణీ లేనందుకు రేషన్ కార్డుల్లో చిన్నపిల్లల పేర్లు నూతన వధువుల పేర్లు చేర్పించలేని పరిస్థితులలో ఇదివరకే కార్డు లేని వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ప్రజా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందివ్వడానికి ముందుకు విచ్చేసిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది ఇందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేసి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ గిరిధర్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సీనియర్ నాయకులు సిద్ధము ఉజ్వల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో 11వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పి.రాములు నేత మరియు సీనియర్ నాయకులు మాధవరెడ్డి నగేష్ వీరన్న అదేవిధంగా వార్డు ఆర్పీలు వరలక్ష్మి మాధవి గార్లు వాడు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version