జిల్లా కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు…

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను శాంతి, సమన్వయ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతిష్ఠించిన విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని జిల్లా యంత్రాంగం అన్ని పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా భక్తులకు సూచించారు.
ప్రజలందరూ యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వినాయక చవితి పండుగను, నవరాత్రులను దిగ్విజయంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా విగ్రహాలు ప్రతిష్ఠ లో విద్యుత్ ప్రమాదాలు వాటిల్లకుండా రక్షణ చర్యలు పాటించాలన్నారు. వర్షం వల్ల విద్యుత్తు ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకురావాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-86-1.wav?_=1

 

ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకురావాలి

– మైలారం గుట్టల్లో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనులను రెవెన్యూ, పరిశ్రమల శాఖ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్
– వ్యాపారవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే
– 187 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు

గణపురం నేటి ధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టల్లో 187 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ హబ్‌ లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సోమవారం రెవెన్యూ, ఇండస్ట్రీయల్, పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి మైలారం గుట్టపై జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీఎస్సార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. మైలారం రెవెన్యూ శివారులోని 204/1 ,205/1 సర్వే నెంబర్ లలో మొత్తం 187 ఎకరాలు భూమి ఉందన్నారు. ప్రభుత్వ భూమి దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు స్థలం కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మంత్రులు, ఎంపీల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం, ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఇండస్ట్రీస్ పార్క్ కొరకు 60 ఎకరాల్లో 197 ఫ్లాట్లు కేటాంచడం జరిగిందన్నారు. స్క్వేర్ ఫీట్ రూ.1600 లకు టెండర్ కూడా త్వరలోనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ కు 40 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయంకు 10 ఎకరాలు, సైనిక్ స్కూల్ కు 20 ఎకరాలు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కు 15 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే రోడ్డు పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేశారని మరో రూ.15 కోట్ల నిధులు సమకూర్చుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి…

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డివిజన్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డి.ఎస్.పి సైదా సూచించారు. మంగళవారం జహీరాబాద్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వినాయక మండపం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, డిజె సౌండ్ వాడవద్దని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చెన్నూర్‌లో బాల్క సుమన్ కాంగ్రెస్ పరిపాలనపై విమర్శ…

కాంగ్రెసోళ్ళు ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కారు…

కాంగ్రెస్ కర్కశ పరిపాలనలో పథకాలకు ఎగనామం పెడుతున్నారు…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

10 ఏండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగించారని , ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన కర్కశ పరిపాలనగా కొనసాగుతోందని ,గడిచిన 20 నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులకు నియోజక వర్గం నోచుకోలేదని, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాల్క సుమన్ నివాసంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ తో కలిసి పాల్గొన్నారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల, మున్సిపాలిటీల కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. పరిపాలన అప్పుడే మంచిగుండే మా పోరాటం మా గ్రామం నుండే అనే నినాదంతో నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని , అందులో భాగంగానే ఈ నెల 28 న చెన్నూర్, భీమారం, జైపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Congress Governance

గడిచిన 20 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన అధ్వానంగా తయారయిందని, ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో నూతన ఫ్యాక్టరీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ,యువతకు 45 వేల ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించేందుకు కృషి చేస్తానని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గద్దెనెక్కారని ,పదవి వచ్చాక ఉద్యోగాల ఊసే లేదని, తన ఇంట్లో మాత్రం రెండు ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.చెన్నూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ సమక్షంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆజంనగర్–పెగడపల్లి రోడ్డు సమస్య…

బురదమయమైన రోడ్లు పట్టించుకోని అధికారులు

ఆజంనగర్ పెగడపల్లికి రోడ్డు మరమ్మత్తులు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం ఆజం నగర్ గ్రామం నుండి పెగడపల్లికి సరైన రోడ్డు లేక మధ్యలో ఉన్న చిన్న వాగు భారీ వర్షాలు కురిసినట్లైతే దాటలేక పోతున్న రెండు గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు ఆజాంనగర్ గ్రామ రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటే చిన్న వాగు దాటి వెళ్లాలి అంటే రోడ్డు లేక బుర్దమయమైన రోడ్లో నడుచుకుంటూ వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు
ఆజాంనగర్ ప్రగడపల్లి గ్రామాల మధ్య చిన్న వాగు పై బిర్జి నిర్మాణం లేక భారీ వర్షాలు కోవడం వలన రైతుల యొక్క డాక్టర్లు చిన్నవాగులో కొట్టుకపోయినా అయినా జిల్లా అధికారులు స్పందించడం లేదు ఇప్పటికైనా జిల్లా రైతులు స్పందించి ఆజంనగర్ పెగడపల్లి మధ్యలో ఉన్న చిన్న వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

 

* ఆజంనగర్ రైతు తుమ్మేటి దామోదర్ రెడ్డి ని వివరణ కోరగా ఆజంనగర్ పెగడపల్లి మధ్యలో మట్టి రోడ్డు ఉండడంతో మా రెండు గ్రామాల ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాం వ్యవసాయ పని నిమిత్తం పనుల కోసం వెళ్లాలి అంటే రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వెళ్లాలి అలాగే వర్షాకాలం వచ్చిందంటే భారీ వర్షాలు కురవడం వలన రోడ్డు మొత్తం బురదమయం అవుతుంది అలాగే రెండు గ్రామాల మధ్య ఉన్న చిన్న వాగు దాటలేక పోతున్నాం రెండు గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి వ్యవసాయ పనులకు వెళ్లలేక పోతున్నాం గతంలో చిన్న వాగులో రైతుల వ్యవసాయ ట్రాక్టర్లు పనిముట్లు కొట్టుకపోయినా

* ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు ఆజాంనగర్ పెగడపల్లి గ్రామాల ఓటర్లు గుర్తుకు వస్తున్నారు ఓట్లు వేయించుకొని తర్వాత మా గ్రామాల ప్రజలను మర్చిపోతున్న ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చిన్నవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని రెండు గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాం

విప్లవ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-85-1.wav?_=2

విప్లవ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సురవరంకు నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

విప్లవ దృవతార, కమ్యూనిస్టు దిగ్గజం, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తమ పార్లమెంటరీయన్, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీడత పేద ప్రజల అభ్యున్నతికి కృషిచేసిన విప్లవ యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరనిలోటని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థ సారథి అన్నారు.మంగళవారం నర్సంపేట కేంద్రంలోని ఎస్ ఆర్ వొకేషనల్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థ సారథి మాట్లాడుతూ 1942లో మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో జన్మించిన సుధాకర్ రెడ్డి 1960లో ఎఐఎస్ఎఫ్ విద్యార్థినేతగా ఎదిగి 1966 లో ఎఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న గొప్ప విప్లవకారుడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బానోతు స్టాలిన్,పాలక పవన్,భూక్య రాకేష్, పిట్టల అజయ్,కొలువురు బన్నీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఐ ని కలిసి శుభకాంక్షలు తెలిపిన బి ఆర్ఎస్ నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-84-2.wav?_=3

 

సీఐ ని కలిసి శుభకాంక్షలు తెలిపిన బి ఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం నూతన సర్కిల్ ఏర్పడి మెదటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు ని నేడు బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు కలిసి శుభకాంక్షలు తెలిపారు. సి ఐ ని కలిసిన వారిలో మండల పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు, సొసైటీ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ లు నడిపెల్లి మధుసూదన్ రావు, తోట మానస శ్రీనివాస్, పెంచాల రవీందర్, కట్ల శంకరయ్య, మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, దాసరి రవి, నాయకులు గంజి జన్నయ్య, బైరగాని కుమారస్వామి, ఆరే సాంబరెడ్డి, రాందాస్ రాజు, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, ఉడుత సాంబయ్య, పిరాల దేవేందర్ రావు, పిన్నింటి శ్రీనివాసరావు, మామిండ్ల సాంబయ్య, చీటీ శంకర్ .అంజద్, గాజర్ల చింటూ తదితరులు ఉన్నారు

మైలారం గుట్ట స్థలాన్ని అభివృద్ధి పేరుతో దగా

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-83-2.wav?_=4

మైలారం గుట్ట స్థలాన్ని అభివృద్ధి పేరుతో దగా

డి.ఎస్.పి భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం మైలారం గుట్టపై ఎడ్యుకేషన్ ,ఇండస్ట్రియల్ హబ్ కు 204/1, 205/1 సర్వే నెంబర్ల లో మొత్తం భూమి 187 ఎకరాలు ఉందని దాన్ని మొత్తం కేటాయిస్తున్నట్లు ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పారు .మేము అభివృద్ధిని స్వాగతిస్తాం. కానీ ఇంకా మొత్తం ఉన్న భూమి ఎంత పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయవలసి ఉంది .ఎందుకంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కుంటలు ,చెరువులు తెగిపోతే మొరంచే పల్లెకు, ధర్మరావుపేటకు, గణపురం కట్టకు ,గణపురం బతుకమ్మ స్థలానికి .ప్రతి చోటుకు వందల లారీల మట్టి తరలించారు. ఇది ఎమ్మెల్యేకు ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు ప్రభుత్వ భూమి లేకుండా అభివృద్ధి ముసుగులో భూమి అన్యక్రాంతం చేస్తే ముందు తరాల వారికి మట్టి కూడా దొరకదు. ఇల్లు కట్టుకుంటే ఇటుక ,సిమెంటు కొన్నట్టుగా మట్టి కూడా కొనవలసి వస్తుంది. గండ్ర వెంకటరమణ రెడ్డి తీసుకున్న ఆయిల్ మిల్లు పర్మిషన్ రద్దుచేసి నేడు జి ఎస్ ఆర్ అధికారంలోకి రాగానే ఈ భూమిని కాపాడి మైలారం ప్రజలకు, విలేకర్లకు ఇంటిస్థలాలు, కుల సంఘలా గుల్లకి , నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. మొత్తం గుట్ట చుట్టూ బాటలు తీసి మైలారం ,గాంధీనగర్ ప్రజల నోట్లో మట్టి కొట్టారు ప్రభుత్వ స్థలం అంటే ప్రజలందరి ది .ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావు .50 ఎకరాల భూమిని తరతరాలకు శాశ్వతంగా కేటాయించాలి .భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని మీరు యాత్ర చేయడం జరిగింది .మీరు చేసిన యాత్ర నిజమే అయితే భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం కట్టుకోవడానికి ఒక ఎకరం స్థలాన్ని కేటాయించండి. భూమి దుర్వినియోగం కాకుండా కాపాడుతామని చెప్పడం ఈ భూమిని శాశ్వతంగా మనకు దూరం చేయడమే అని ప్రజలు గమనించాలి. విలేకర్లకు ఇంటిస్తాలాలు, కుల సంఘాలకు గుడి స్థలాలు, పేదవారికి ఇంటి స్థలాలు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలు చేసి ఈ భూమిని కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నాం.

భూపాలపల్లిలో బిజెపి నాయకులకు ఘన సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T161743.003.wav?_=5

నూతనంగా ఎన్నికైన బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని దొంగల రాజేందర్ అన్నారు
స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి జిల్లా నూతన పదవులు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం స్థానిక బిజెపి నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది
నూతనంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఊరటి మునిందర్ రూరల్ మండల అధ్యక్షుడు పులి గుజ్జరాజు కి భూపాలపల్లి స్థానిక బిజెపి నాయకులు బిఎంఎస్ కార్యాలయంలో ఘనంగా పూల పుష్పం ఇచ్చి శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం స్వీట్స్ పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భట్టు రవి కంబాల రాజయ్య కంచం నరసింహమూర్తి అజ్మీర రాజు నాయక్ జంజాల సురేష్ తుమ్మేటి దామోదర్ బాణాల మధు ఆవుల సంతోష్ తాండ్ర హరీష్ తోట్ల స్వామి సిలోజు సాగర చారి తదితరులు పాల్గొన్నారు

కవేలిలో ఆరోగ్య కేంద్రం పనులు ఆగిపోయాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T161111.926.wav?_=6

ఆరోగ్య కేంద్రం పనులు మధ్యలోనే ఆగిపోయాయి: గ్రామస్థుల ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గోడలు, పైకప్పు పూర్తయినా, లోపలి పనులు అసంపూర్తిగా ఉండటంతో భవనం నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామ ప్రజలు ఆరోగ్య సదుపాయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పనులను త్వరగా పూర్తి చేసి సబ్ సెంటర్ ను ప్రారంభించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రైతన్నల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-82-1.wav?_=7

రైతన్నల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత

ఎద్దు ఏడ్చిన ఏవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో లేదు

మళ్లీ సారె కావాలి, మళ్లీ కారు ఏ కావాలి అంటున్న రైతన్నలు

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

మరిపెడ నేటిధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ఆర్ అండ్ బీ అతిధి గృహం ముందు వరంగల్, ఖమ్మం హైవే పై రైతన్నలు రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిస్ రెడ్యానాయక్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులతో కలిసి వర్షంన్ని సైతo లెక్క చేయకుండా ధర్నాకు దిగారు, సకాలంలో రైతులకు యూరియా అందడం లేదని ఫైర్ అయ్యారు.యూరియా కొరత ఉందని పడిగాపులు గాసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నికి చలనం లేదు అన్నారు, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో ఎక్కడ లేదు అన్నారు, సకాలంలో పంటలకు యూరియా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి అని, ఐన కూడా రాష్ట్ర ప్రభుత్వo నిర్లక్ష్య వైఖరినీ అవలంభిస్తున్నది అన్నారు, పంట నష్టపోయిన ప్రతి రైతాంగన్ని ఆదుకొని, ప్రతి రైతు కు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు,ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత ఏర్పడింది అన్నారు, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే మరిపెడ మండలానికి 5 వేల టన్నుల యూరియాను సరఫరా చేయాలన్నారు,యూరియాను సరఫరా చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని మండిపడ్డారు,కేసీఆర్ హయాంలో కూడా యూరియా ఇవ్వడానికి కేంద్రం సహకరించలేదనీ, ఐన ముందు చూపుతో నా తెలంగాణ రైతన్న లు యూరియ కోసం,ఎరువుల కోసం తిప్పలు పడవద్దు అని, రైతన్నలు అప్పుల పాలు కావద్దు అని ఏ సీజన్ కు ఆ సీజన్ లోనే రైతు బంధు డబ్బులు ఇచ్చే వారు అన్నారు, ఇది ముందే గ్రహించిన కేసీఆర్ రెండు నెలల ముందే యూరియా బస్తాలను తీసుకువచ్చి గోడౌన్లలో నిలువ చేశారన్నారు,తెలంగాణను దోచుకోవడానికే వచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ఎరువుల బస్తాలు అందించలేని చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండి పడ్డారు. ప్రజా పాలన తెచ్చిన మార్పు ఇదేనా అన్నారు, ప్రజలు మార్పు మార్పు అంటే రైతన్న ను అగం చేసే మార్పు వస్తాది అనుకోలేదు అన్నారు, మళ్లీ సారే కావాలి, కారు ఏ రావాలి అంటున్న రైతన్న లు,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేసిన తప్పు ని ప్రజలు మరోసారి పునరావృతం కావద్దు అని,కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పుతరు అన్నారు,బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షుడు రవిచంద్ర,బీఆర్ఎస్ మండల నాయకులు రాంబాబు, రవీందర్, కాలు నాయక్,మాజీ ఎంపిపి గడ్డం వెంకన్న,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, చిన్న గూడూరు మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ కౌన్సిలర్లు,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, మండల నాయకులు తాళ్ళపల్లి శ్రీనివాస్,ప్రవీణ్ రెడ్డి,లతీఫ్, తాళ్లపల్లి రఘురాం,కొమ్ము చంద్రశేఖర్,కొమ్ము నరేష్,అజ్మీర రెడ్డి, దుస్సా నర్సయ్య,గంధసిరి కృష్ణ, బాలాజి,రెండు మండల ల మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,రైతులు, యువకులు పాల్గొన్నారు.

మట్టి గణపతులను ఉంచి పర్యావరణాన్ని రక్షించాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T160541.014-1.wav?_=8

మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలి

పరకాల సీఐ క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వలన జల కాలుష్యం ఏర్పడి జీవవైవిధ్యానికి నష్టం కలుగుతుందని,ఈ సందర్భంలో ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.వినాయక చవితి పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా,ఆనందోత్సాహంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-2.wav?_=9

 

వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరి

దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా దుగ్గొండి మండలంలో మండపాల పట్ల అన్ లైన్ ద్వారా పర్మిషన్ తప్పనిసరి అని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు.అందుకు తీసుకోవలసిన ప్రత్యేక జాగ్రత్తల పట్ల వివరిస్తూ వినాయక నవరాత్రుల పట్ల పర్మిషన్ తీసుకున్న వారు ప్రతి విగ్రహానికి ఒక ఆర్గనైజర్ 24/7 ప్రత్యేకంగా ఉండాలని తెలిపారు.అలాగే విద్యుత్ కనెక్షన్ సంబంధించి ఆ శాఖతో అనుమతి పొందాలన్నారు. డి.జేలు ఉపయోగించకుండా స్కూల్స్, హాస్పిటల్స్ ప్రదేశాల్లో 50 డెసిమల్ సౌండ్ ఉపయోగిస్తూ సాధారణ ప్రదేశంలో 55 డెసిమల్ సౌండ్ వాడాలని చెప్పారు.విగ్రహ ప్రదేశాలలో మద్యం సేవించి,అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకూడదని అలాగే కమ్యూనిటీ,పార్టీలకు విరుద్ధంగా పాటలు పెట్టకూడదని ఎస్సై హెచ్చరించారు.అగ్నిప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగించకుండా నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్సై రణధీర్ రెడ్డి మండల ప్రజలకు సూచించారు.

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T133713.630-1.wav?_=10

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T155155.515-1.wav?_=11

యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..

రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T154258.504-1.wav?_=12

రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో మంగళవారం సహా రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
వర్షాలు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వంటి నీటిమునిగే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ వివరించారు. మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుండి వచ్చే సమాచారం పై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యల కోసం తహసీల్దార్లు, ఎమర్జెన్సీ టీములు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాతావరణ శాఖ ముందస్తు ఇస్తున్న సమాచారం ప్రకారం ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-3.wav?_=13

 

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T153720.610-1.wav?_=14

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-78-3.wav?_=15

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామ ప్రజా సమస్యలపై ఆ గ్రామ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు.వృద్ధాప్య పింఛన్స్, కరెంట్ బిల్లు,రేషన్ కార్డు,గ్యాస్ బిల్లు, జాబ్ కార్డు,డ్రైనేజీ,తాగునీటి సమస్యల పట్ల గ్రామస్తులు సిపిఎం నాయకులకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య,మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య,మండల నాయకులు పుచ్చకాయల నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పొన్నం రాజు, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి, మాదాసి శీను,శ్రీకాంత్,రమేష్, బత్తిని స్వామి, కొండబత్తుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T152700.294-1.wav?_=16


సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే


నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామ ప్రజా సమస్యలపై ఆ గ్రామ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు.వృద్ధాప్య పింఛన్స్, కరెంట్ బిల్లు,రేషన్ కార్డు,గ్యాస్ బిల్లు, జాబ్ కార్డు,డ్రైనేజీ,తాగునీటి సమస్యల పట్ల గ్రామస్తులు సిపిఎం నాయకులకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య,మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య,మండల నాయకులు పుచ్చకాయల నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పొన్నం రాజు, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి, మాదాసి శీను,శ్రీకాంత్,రమేష్, బత్తిని స్వామి, కొండబత్తుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version