పాఠశాల లో నవోదయ పుస్తకాల పంపిణీ.

పాఠశాల లో నవోదయ పుస్తకాల పంపిణీ.

మరిపెడ నేటిధాత్రి

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ , తను పనిచేసే పాఠశాల లో తన సొంత డబ్బులతో (సుమారు 2000 రూపాయలు విలువచేసే) నవోదయ మెటీరియల్ ను విద్యార్థుల కు అందజేశారు, ఈ పుస్తకాల ను చిల్లంచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంద జయ చేతుల మీద విద్యార్థులకు అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా నవోదయ సీటు సాధించేలా కృషి చేయాలని సూచించడం జరిగింది. నవోదయ సీటు సాధించిన విద్యార్థులకు నవోదయలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు, విద్యార్థులు కష్టపడి నవోదయ సీటు సాధించి మీ తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం లక్ష్మయ్య ,రాజేశ్వరి గణేష్, క్రాంతి , తదితరులు పాల్గొన్నారు

బిగ్ బ్రేకింగ్………

 

బిగ్ బ్రేకింగ్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T115959.308.wav?_=1


“నేటిధాత్రి”, 

తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌లో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు

రూ.700 కోట్ల వ్యవహారంలో ఈడీ తనిఖీలు

లోలోనా పేరుతో ప్రభుత్వ స్కీంను..స్కామ్‌గా మార్చిన మొయినుద్దీన్‌

మొయినుద్దీన్‌కు చెందిన లోలోనా కార్యాలయాల్లో సోదాలు

మొయినుద్దీన్‌, ఇక్రముద్దీన్‌ నివాసాల్లో ఈడీ సోదాలు

మాజీ డైరెక్టర్‌ రామచంద్రనాయక్..మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్‌ నివాసాల్లోనూ సోద

పరకాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి

పరకాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా

నూతన మున్సిపాలిటీ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి కొట్టబట్టల పంపిణీ

అనంతరం మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన,మెప్మా ఫుడ్ స్టాల్ ల సందర్శన

పరకాల నేటిధాత్రి

మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో వన మహోత్సవంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలను నాటి జెసిబి,6 స్వచ ఆటోలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,అధికారులతో కలిసి శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను అధికారులతో కలిసి సందర్శించి మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాల సందర్శన స్టాల్ ను పరిశీలించి అనంతరం మున్సిపల్ కార్మిక సిబ్బందికి బట్టలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన పరకాల గత పాలకుల వైఖరి వల్ల నిరాధారణకు గురైందని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నానన్నారు.పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయబోతున్నామని,త్వరలో సెట్విన్ రాబోతుందని,టి యుఎఫ్ఐడిసి నిధులతో డిపిఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు.త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే నలభై కోట్లతో డ్రైనేజీ,దాదాపు 11 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు.ప్రజల సహకారంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని,ప్రజలు పరిశుభ్రత పాటించి పారిశుద్ధ్యంను పరిష్కరించడంలో భాగస్వాములు కావాలన్నారు. పరకాలకు పూర్వ వైభవం తీసుకురావడంలో ప్రజలు సహకరించాలని కోరారు.మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని,రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,నివాస గృహాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరా,రైతు భరోసా,2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, యువతకు రాజీవ్ యువ వికాసం,మహిళలకు వడ్డీ లేని రుణాలను,ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు,మున్సిపాలిటీ ఆశీకారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ..

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ
జమ్మికుంట (నేటిధాత్రి)
ఈరోజు జమ్మికుంట మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని లకు కేంద్రమంత్రి బండి సంజయ్ సంకల్పంగా తీసుకున్నటువంటి నిజోయకవర్గ పదో తరగతి విద్యార్థినిలకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి కరీంనగర్ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎర్రవెల్లి సంపత్ రావు సంపెల్లి సంపత్ రావు, పుల్లూరు ఈశ్వర్, పుల్లూరి రవి, ఈ కార్యక్రమంలో పాల్గొని సైకిల్లు పంపిణీ చేయడం జరిగింది.

అంబేద్కర్ కాలనీ15వ వార్డులో రేషన్ కార్డుల పంపిణీ..

సిరిసిల్ల అంబేద్కర్ కాలనీ15వ వార్డులో రేషన్ కార్డుల పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్, 15వ వార్డు కాలనీలోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగినది. బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలందరికీ ఇలాంటి రేషన్ కార్డులు ఇవ్వ లేదు, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికి ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరమని అంతే కాకుండా పేదకుటుంబలకు రేషన్ షాపులలో అందించే సన్న బియ్యం తింటున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేదురి లక్ష్మణ్,గొల్లపల్లి పరశురాములు,నక్క నరసయ్య, కొమ్ము త్యాగరాజు, ఆకునూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఇటిక్యాలలోఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పత్రాలు పంపిణీ.

ఇటిక్యాలలోఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పత్రాలు పంపిణీ. . .

రాయికల్ జూలై 18, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-32.wav?_=2

రాయికల్.మండలం ఇటిక్యాల గ్రామంలో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం రోజున గ్రామపంచాయతీ .ఆవరణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేష్, నాయకులు, ఆదిరెడ్డి, జలంధర్ రెడ్డి, గంగారెడ్డి, సాయ గౌడ్, స్వామి రెడ్డి, గంగాధర్, లక్ష్మణ్, మహేష్, ముత్తన్న, శేఖర్,హనుమాన్లు, రాజారాం, జాకీర్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఏలేటి సౌమ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్.!

ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

అవోపా కల్వకుర్తి యూనిట్ అధ్యక్షుడు పాపిశెట్టి సతీష్ గుప్తా ఆధ్వర్యంలో యు.పి.ఎస్ పంజుగుల విద్యార్థులకు యు.పి.ఎస్ పంజుగుల హెచ్ఎం ఎల్లయ్య గౌడ్ అధ్యక్షతన 70 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ , ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవోప జనరల్ సెక్రెటరీ యాద శోభన్ బాబు , సీనియర్ అవోపా సభ్యులు గాదె కుమారస్వామి , గాదె ఉమాదేవి , పోల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయ బృందము తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణీ..

విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం /జహీరాబాద్:గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని యువ నాయకులు ధన్ రాజ్ అన్నారు. ధన్ రాజ్ పుట్టినరోజు రోజు సందర్బంగా,గురువారం క్రిష్ణ పూర్ గ్రామం లో విద్యార్థుల కు పెన్ను లు పెన్సిల్ తో పాటు విద్య సామాగ్రి ని అందజేశారు. ఈ సందర్బంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ..విద్యార్థులకు అవసరమైన వనరులను అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ నాగమణి మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో.

హనుమాన్ దేవాలయానికి సిమెంట్ పంపిణి.

హనుమాన్ దేవాలయానికి సిమెంట్ పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని లింగసాని పల్లి గ్రామ హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల వెంకటేష్ గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణానికి సహకరించమని కోరగా తన వంతుగా సిమెంట్ ని అందజేస్తానని తెలియజేసి, ఆలయ నిర్మాణానికి సిమెంట్ పంపారు.ఈ కార్యక్రమంలో లింగస్వామి పల్లి గ్రామ పెద్దలు రాములు,కిరణ్, శేఖర్ రెడ్డి పరశురాములు, భీమయ్య,సత్యం,శ్రీను, శంకర్ ,వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరావు, రొడ్డ వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ.

తాట్లవాయి. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ. . .

రాయికల్, జూలై 16, నేటి ధాత్రి. . .

రాయికల్ మండలంలోని తట్లవాయి. గ్రామపంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోసరి మహేష్ చెట్లపల్లి రాజు కెల్లెటి స్వాతి కొండవేని లక్ష్మి బద్ది శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ ఆకుల మల్లేశం పంచాయతీ కార్యదర్శి బాణావతి తిరుమల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ తిరుమల కారోబార్ మహిపాల్ లబ్ధిదారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

బోర్నపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ.

బోర్నపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ.

రాయికల్ జూలై 16, నేటి ధాత్రి.

రాయికల్ మండల పరిధిలోని బోర్నపెల్లి గ్రామంలో బుధవారం రాయికల్ మండల ఆర్ఐ పద్మయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇండ్ల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్, కోల శ్రీనివాస్.మాజీ సర్పంచ్ రాజు లత, ఆంజనేయులు, రాగుల సత్యం, లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు శనివారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి అయిన సందర్భంగా పట్టణంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృదే ధ్యేయంగా మంత్రి వివేక్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫ్లై ఓవర్ వంతెనపై త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,వంతెనకు ఇరువైపుల రోడ్డు విస్తరణకు కోటి యాబై లక్షల రూపాయల నిధులను మంత్రి వివేక్ మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సత్యనారాయణ,తదితర నాయకులు పాల్గొన్నారు.

ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ల్యాప్టాప్ .

ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా ల్యాప్టాప్ ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండలో గురువారం మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్నద్డం చేసేందుకై తన వంతు సహకారంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు ఉచిత ల్యాప్టాప్ ల పంపిణీ కార్యక్రమం..తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (Girls) పాఠశాలకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(TASK) ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా(ఎనిమిది)ల్యాప్టాప్ ల అందజేసిన చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ…మారుతున్న డిజిటల్ ప్రపంచంతో పోటీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా సన్నద్ధం కావాలని,వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించి,వారిలోని ప్రతిభను ప్రోత్సహించి,వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాడానికి తన వంతు ప్రయత్నంగా ల్యాప్టాప్ లను అందజేస్తున్నాని,డిజిటల్ యుగంలో విద్యార్థులు మరింత సమగ్రమైన,మెరుగైన విద్యను పొందడానికి డిజిటల్& కంప్యూటర్ తరగతులు సహాయపడుతాయని,విద్యార్థులు కంప్యూటర్ కోడింగ్ లాంటి తదితర కొత్త విషయాలపై పాఠశాల దశలోనే అవగాహన కల్పించాలని,కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు సాగాలని తన వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…మా పాఠశాలకు ఎలాంటి సహాయం అడిగిన వెంటనే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పందించి, సహాయ సహకారాలు అందిస్తున్నారని,గతంలో విద్యార్తులకు వాష్ రూమ్స్ విషయంపై స్పందించి వెంటనే ఒక లక్ష రూపాయలతో వాటికి మరమత్తులు చేయించారని,అలాగే ఈరోజు మా విద్యార్థులు అడిగిన వెంటనే ఉచితంగా ల్యాప్టాప్ లను అందించి అన్ని విధాలుగా మా పాఠశాలను సహాయ,సహకారాలు అందిస్తూ మా విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని,వారికి మా పాఠశాల ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు…ఈ కార్యక్రమంలో…పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణ రత్నం, ఉపాధ్యాయులు మురళితో, సీనియర్ నాయకులు దశరథ్ నాయక్,లాలూ నాయక్, నర్సింగ్,రమేష్,రఘు,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు కొండల్, యాదవ్,రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం.

టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి.

చెందిన సీఎం దారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్.

ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

మధుకర్ మాట్లాడుతూ.

నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకోవాలని వారికి.

ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక పరంల ఉపయోగపడుతుందని అలాగే ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన దోమల హరిత.

రాజు కి.(17,500 రూపాయల).

చెక్కులు అందజేయడం జరిగిందని చెక్కులు రావడానికి కృషి చేసిన.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కి. ప్రభుత్వ శాసనసభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి.

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి శ్రీ కేకే మహేందర్ రెడ్డి కి.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి వారికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యాం.

బ ల్కం లక్ష్మీపతి.

అంబటి అంజయ్య.

వేముల కర్ర నరేష్.

దూస సత్తయ్య.

రాము మహిళా నాయకురాలు అడిగొప్పుల యమున.

ముందటి శారద.

దీకొండ జ్యోతి.

మౌనిక.

కనుకుంట్ల .

రే నవ్వ.

గుడ్ల వసంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ.

*కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ
కార్యక్రమంలో మోకుదెబ్బ నాయకులు..*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల
ప్రవేశ పెట్టిన కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి శనివారం ప్రారంభించడం
జరిగింది..జిల్లా బీసీ సంక్షేమ శాఖ, ఆబ్కారీ శాఖల ఆధ్వర్యంలో డివిజన్ లోని ఆరు మండలాలకు చెందిన 214 మంది గీత కార్మికులకు కిట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుస్పలత,కందాల శంకరయ్య గౌడ్,ఆబకారి సీఐ నరేష్ రెడ్డి,ఎస్ఐ శార్వాణి,గౌడ జనహక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,పొగాకు వెంకటేశ్వర్లు, రమేష్ గౌడ్,పోగాకు సాయితేజ గౌడ్,భూపతి మల్లంపల్లి గౌడ సంఘం సభ్యులు అరేల్లి ప్రకాష్ గౌడ్, కక్కేర్ల రాజు,రమేష్,రాజు,రామకృష్ణ,
తదితరులు పాల్గొన్నారు.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రిలో 14 మంది డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ – సింగరేణి భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామి గారు
ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గౌరవ డా. వివేక్ వెంకటస్వామి గారు, 14 మంది బొగ్గుగని కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు

ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం శ్రీ దేవేందర్ , ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

 

Singareni

 

 

“బొగ్గుగని కార్మికులంటే మా కాకా డా. వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ మూసివేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో చర్చించి, ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారు. లక్షలాది కార్మిక కుటుంబాలకు బాసటగా నిలిచారు.”

 

Singareni

 

“ఈరోజు సింగరేణి సంస్థ లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రధాన కారణం. తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”

“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, సంస్థ అభివృద్ధికి తగిన ప్రయత్నం జరగలేదు. కేవలం నిధుల వాడకానికే పరిమితమైంది. ఇకపై కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనగలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.”

 

Singareni

 

 

ఈ కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కుటుంబాలు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశం వారి జీవితాలకు మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా.

రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా…

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో పలు రేషన్ డిపోలను సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారులు తనిఖీ నిర్వహించారు రేషన్ డిపోలు వివరాలను తెలుసుకొని సరుకులను పరిశీలించారు ఈ తనిఖీలు సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాశ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అధికారులు తనిఖీలు చేపట్టారు బియ్యం పంపిణీ పై ఆరా ఈ సందర్భంగా సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జై ప్రకాష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఘనపురం షాపు నెంబర్ మూడు రేషన్ డిపో తనిఖీ చేశామన్నారు ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్న విధానం రేషన్ బియ్యం వివరాలు నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని చెప్పారు ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం అందించకపోతే రేషన్ షాపులపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారి వెంట భూపాలపల్లి జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ పలు మండలాల తాసిల్దార్లు అధికారులు ప్రజలు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ
మెట్ పల్లి జూన్ 25 నేటి ధాత్రి:

 

మెట్ పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల విట్టంపేట్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్నులు, పెన్సిల్లు ఇతర సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సురిగి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు సన్నీ, రవితేజ సతీష్ లు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్పీ విక్రమ్ కుమార్ ఉపాధ్యాయ బృందం ఎస్ భానుతేజ, లక్షణ, సుచిత లు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా పూల మొక్కలు పంపిణీ.

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా పూల మొక్కలు పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత విగ్రహం వద్ద జన సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ జన్మదినం సందర్భంగా దివాస్ కార్యక్రమాలలో బాగంగా నేడు మహిళా మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాల పల్లం అన్నపూర్ణ అధ్వర్యం అమ్మ పేరు తో మొక్కలు పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్,మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష,జిల్లా ఉపాధ్యక్షురాలు ఆసాని లావణ్య, మరియు పండుగ మాధవి,సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు వైశాలి,కొనరావుపేట్ మండల మహిళా అధ్యక్షురాలు తీగల జయశ్రీ,బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్, కొంపల్లి రాజేందర్ సిరిసిల్ల వంశీ,అభి,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version