మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ
మందమర్రి నేటి ధాత్రి
ఈరోజు మందమర్రి సింగరేణి ఉన్నత పాఠశాల మనోవికాస పిల్లలకు
బెల్లంపల్లి నివాసి గుండేటి అంబదాస్ లత గార్ల కుమారుడు శివరాంప్రసాద్ ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క వైష్ణవి మేనమామ మేనత్త ఆడేపు అశోక్ కుమార్ సరోజన సహకరించిన స్కూల్ టీచర్ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@ స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు. ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు మల్లాపూర్ సెప్టెంబర్ 27 నేటిదాత్రి
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మొగిలిపేట గ్రామం లో మల్లాపూర్ మండలం కి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన 9 లక్షల 25 వేల విలువగల 17 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్,మండల ఫిషర్మాన్ అధ్యక్షుడు రొడ్డ రాజు,మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు,మొగిలపేట విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్,మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, మసుల చిన్నయ్య,మిట్టపల్లి మహేష్, ఎండి సల్మాన్,సుద్దాల సతీష్, దేవ రవి,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,సింగరపు అశోక్,ఇప్పపెల్లి గణేష్,గోపిడి నరేష్, ఎట్టేం మల్లేశ్,పోతు గోపి,సమీర్ సర్కార్,నల్లపు పోతరాజు శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు పాల్గొన్నారు
కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. సోమవారము స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. హనుమంతరావు పటేల్ మాట్లాడుతూ..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ మల్లయ్య స్వామి సంగన్న పటేల్, మల్లికార్జున పాటిల్, అష్రఫ్ అలీ, లియకత్ అలీ, రాజేందర్ సింగ్, డీలర్ సంగన్న, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫక్రోద్దిన్, అనిల్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు
గణపతి మండపంలో ఘనంగా పూజలు
నర్సంపేట,నేటిధాత్రి:
గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 10 వార్డు పోచమ్మ ఆలయంలో పోచమ్మతల్లి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ,ఆ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేపట్టి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు హాజరైయ్యారు.పూజారి రామకృష్ణ ప్రత్యేక పూజలు చేపట్టారు. మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గణనాధున్ని వేడుకొన్నట్లు తెలిపారు.ఈ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ శీలం సత్యనారాయణ, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, కడారి కుమారస్వామి, ఎల్ల స్వామి, బిక్షపతి, పి.కృష్ణ,స్థానిక వ్యాపారులు బండి సుధాకర్, శ్రీనివాస్,కోడమ్ సారంగం, నాగిశెట్టి ప్రవీణ్ తదితరులు స్థానికులు పాల్గొన్నారు.
మమతా నగర్ గణనాధుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని పదో వార్డు మమత నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ దాత తాళ్లపల్లి వెంకటేశ్వర్లు కవిత ల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్న నేపథ్యంలో మమతా నగర్ కాలనీవాసులు ముప్పిడి రంజిత్ మమత,దార్న రవీందర్ సత్యవతిలచే స్వామివారి సన్నిధానంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు గణేష్ మహారాజ్ కి జై అంటూ స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల నిర్వాహణ అనంతరం స్వామివారి మహా అన్నప్రసాద వితరణను స్వీకరించి స్వామి వారి కృపకు ప్రాప్తులైనట్లు మహా అన్నప్రసాద వితరణ దాతలు ముప్పిడి రంజిత్ దార్న రవీందర్తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు పరకాల పట్టణంలోనే మమతా నగర్ గణనాథుడు పెట్టింది పేరుగా నవరాత్రి తొమ్మిది రోజులు మమతా నగర్ కాలనీ వాసులంతా ఒక పండగ వాతావరణంను ఏర్పాటు చేసుకుంటూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,ఈ నేపథ్యంలో శనివారం రోజున నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంకు విచ్చేసి కార్యక్రమమును విజయవంతం చేసిన కాలనీవాసులకు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
యూరియా కోసం రైతులు గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మేడ గ్రామంలో శనివారం రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సుమారు 400 బ్యాగులో యూరియా గ్రామానికి సరఫరా చేసింది. విషయం తెలుసుకున్న రైతులు అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తగినంత యూరియా రైతులకు అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ నరసింహులు, ఏఈఓ శ్రీలత, గ్రామస్తులు ఉన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికులక ఉద్యోగులకు టిఫిన్ వాటర్ బాటిల్ పంపిణీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తమ విధులను నిర్వహిస్తున్న పోలీసు శాఖతోపాటు మున్సిపల్ కార్మికులకు టిఫిన్ వాటర్, బాటిల్ పంపిణీ చేశారు. గురువారం పట్టణంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో అందించారు.
#క్యాంపు కార్యాలయం వేదికగా నగరవాసులకు మట్టి గణపతులను పంపిణీ…
హన్మకొండ, నేటిధాత్రి:
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగరంలోని భక్తులకు,ప్రజలకు స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు పర్యావరణ హితంగా ఉండాలని కోరుతూ నగరంలో 30000 విగ్రహాలకు అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు సరఫరా అందిస్తున్నదని వెల్లడించారు.మా వంతుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.ఈ మట్టి గణపతుల పూజతో పాటుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. ఇప్పటికే అధికారులకు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చామని నవరాత్రి వేడుకలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని,నగరంలో ఏర్పాటు చేసిన మండలాలలో పర్యవేక్షణను చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని 11వ వార్డులో గల 44వ చౌక ధరల పంపిణీ కేంద్రంలో 11వ వార్డు ప్రజలకు సుమారు 180 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది చాలా రోజుల నుండి రేషన్ కార్డుల పంపిణీ లేనందుకు రేషన్ కార్డుల్లో చిన్నపిల్లల పేర్లు నూతన వధువుల పేర్లు చేర్పించలేని పరిస్థితులలో ఇదివరకే కార్డు లేని వ్యక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ప్రజా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందివ్వడానికి ముందుకు విచ్చేసిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది ఇందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేసి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ గిరిధర్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సీనియర్ నాయకులు సిద్ధము ఉజ్వల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో 11వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పి.రాములు నేత మరియు సీనియర్ నాయకులు మాధవరెడ్డి నగేష్ వీరన్న అదేవిధంగా వార్డు ఆర్పీలు వరలక్ష్మి మాధవి గార్లు వాడు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,
రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన 400 మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎం. దేవేందర్ గారు పంపిణీ ప్రారంభించారు.
Clay Ganesha Distribution
ప్రజలు పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను అందజేస్తోందని కమిషనర్ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరుగుతుందని, మట్టి విగ్రహాల వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తదనంతరం మిగిలిన విగ్రహాలను మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులకు వార్డు అధికారులు, మహిళా రిసోర్స్ పర్సన్ల సమక్షంలో పంపిణీ పూర్తి చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవికుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో నర్సంపేట పట్టణానికి చెందిన 23, 24, వార్డుల్లో నూతనంగా మంజూరైన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు కోల చరణ్ రాజ్ గౌడ్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, వార్డు ఆఫీసర్లు మౌనిక, తరుణ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేల్లి సారంగం గౌడ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జానకమ్మ, సరోజన, మోహన్, బైరగోని రవి, మొగిలిచర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు
— యురియా కోసం క్యూ కట్టిన రైతులు • అందుబాటులో యూరియా.. అధైర్యపడొద్దు.. తహసిల్దార్ శ్రీనివాస్..
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఈనెల యూరియా ఆ నెలలోనే వస్తుందని సెప్టెంబర్ నెల యూరియా ఆగస్టులో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. శుక్రవారం నస్కల్ గ్రామానికి 20 మెట్రిక్ టన్నుల యూరియాను చల్మెడ, రాంపూర్, నస్కల్, నగరం గ్రామాలకు సంబంధించిన రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. యూరియాను అధిక మొత్తంలో చల్లకుండా 3 దాఫాలుగా చల్లడం వల్ల కర్ర ఎదుగుదల పెరుగుతుందన్నారు.
*ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 71.31 లక్షలు విలువజేసే 1078 పరికరాల పంపిణి..
పలమనేరు(నేటి ధాత్రి(
అగస్టు 21:
ప్రత్యేక ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాలలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సుమారు 71.31 లక్షల విలువచేసే 1078 ( ట్రై సైకిల్లు, వినికిడి యంత్రాలు ,వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ తదితర) పరికరాలను ఆయన చేతుల మీదుగా శుక్రవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది డిసెంబర్ లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారుఅర్హులైన వారికి వారి శారీరిక వైఖల్యం బట్టి పరికరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారుఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నట్లయితే త్వరలో శిబిరాన్ని ఏర్పాటు చేసి అర్హులందరికీ పరికరాల అందిస్తామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను 100% పూర్తిచేసిందని, చెప్పని హామీలను సైతం నెరవేర్చి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అనంతరం దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారుఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్డీవో భవాని, దివ్యాంగుల సంక్షేమ సంఘం సహాయక సంచాలకులు వినోద్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణారెడ్డి, నాయకులు కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, మదన్, కిరణ్, బిఆర్సి కుమార్,జనసేన నాయకులు దిలీప్, నాగరాజు లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని కోగిలేరు యానాది కాలనీవాసులకు తహశీల్దార్ హనుమంతు ఇంటి స్థలాలకు సంబంధించిన దృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. మొత్తం 12గృహాలు వుండగా 6మంది లబ్ధిదారులకు నివాస ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. అలాగే 19జనన దృవీకరణ పత్రాలకు అర్హులుండగా 16మందికి జనన దృవీకరణ పత్రాలను మంజూరు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవి, వీఆర్వో శివకుమార్, నాయకులు మురహరిరెడ్డి, చెంగారెడ్డి, నాగేశ్వరరావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
-సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
కరకగూడెం,,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి…
మండలంలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ తగిన స్థాయిలో యూరియా అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మండలంలోని అశ్వాపురం గ్రామంలో పార్టీ మండల కమిటీ సమావేశం కొమరం మల్లక్క అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే యూరియా మీద దృష్టి పెట్టినట్లయితే ఇంత పరిస్థితి ఉండేది కాదని రైతుల పక్షాన ఉండటంలో ప్రభుత్వం వైశాల్యం చెందుతుందని వారు విమర్శించారు ఒక్కో రైతు నాలుగైదు రోజుల తరబడి ఎదురు చూడటం ద్వారా నరకయాతనకు గురవుతున్నారని వారన్నారు తక్షణమే రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే యూరియా పంపిణీ విషయంలో పట్టాదార్ పాస్ పుస్తకలు లేని భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా ఆధార్ కార్డు నిబంధన అమలు చేయాలని మండలంలో చాలా మంది రైతులకు పట్టాలు లేవని గిరిజనులలో కూడా కొంతమందిలో భుమి పట్టాల సమస్య ఉందని పట్టాలు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు యూరియాను ప్రభుత్వం తగిన స్థాయిలో అందించకుంటే రైతులను సమీకరించి ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, బిలపాటి శంకరయ్య, కనితి రాము, పద్దం బాబురావు తదితరులు పాల్గొన్నారు
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ , తను పనిచేసే పాఠశాల లో తన సొంత డబ్బులతో (సుమారు 2000 రూపాయలు విలువచేసే) నవోదయ మెటీరియల్ ను విద్యార్థుల కు అందజేశారు, ఈ పుస్తకాల ను చిల్లంచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంద జయ చేతుల మీద విద్యార్థులకు అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా నవోదయ సీటు సాధించేలా కృషి చేయాలని సూచించడం జరిగింది. నవోదయ సీటు సాధించిన విద్యార్థులకు నవోదయలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు, విద్యార్థులు కష్టపడి నవోదయ సీటు సాధించి మీ తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం లక్ష్మయ్య ,రాజేశ్వరి గణేష్, క్రాంతి , తదితరులు పాల్గొన్నారు
మాజీ డైరెక్టర్ రామచంద్రనాయక్..మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్ నివాసాల్లోనూ సోద
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.