నూతన గ్రంథాలయం నిర్మించాలని జిల్లా చైర్మన్ కు వినతి పత్రం అందజేత…

నూతన గ్రంథాలయం నిర్మించాలని జిల్లా చైర్మన్ కు వినతి పత్రం అందజేత.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా చైర్మన్ కోట రాజబాబు ని చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి, అంతులు ఆదేశాల మేరకు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం చిట్యాల గ్రంధాలయం గ్రామపంచాయతీలో ఉండడం ద్వారా పరిపాలనకు ఇబ్బందికరంగా మారిందని ఇరుకు గదిలో గ్రంథాలయం ఉండడం జరిగిందని, కావున* నూతన గ్రంధాలయ భవనాన్ని నిర్మించి గ్రంధాలయ పాఠకులకు సౌకర్యం కలిగించాలని బుధవారం రోజున పంచి బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డ్ మెంబర్ తౌటం నవీన్ గ్రామపంచాయతీ పాలవర్గం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అనంతరం గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ తప్పకుండా*నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది*ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు సభ్యుడు తౌటం నవీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గు మ్మడి శ్రీదేవి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , దొడ్డికిష్టయ్య, గ్రంథాలయ ఇన్చార్జి గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో డిఎల్ పిఓ కార్యాలయం ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో..???

జహీరాబాద్ లో డిఎల్ పిఓ కార్యాలయం ఏర్పాటుకు మోక్షం ఎప్పుడో..???

◆:- జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని అన్నీ రాజకీయ పక్షాలు,యువజన సంఘాలు,కుల సంఘాలు, ప్రజలు అఖిల పక్షంగా ఏర్పడి నిరసనదీక్షలు,నిరాహార దీక్షలు,ఆందోళనలు చేయడం జరిగింది ప్రజల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గి ఆనాడు జహిరాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ గా మారిన తర్వాత ఆర్డిఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసారు డివిజన్ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు అవుతున్న ఇంకా కొన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలు రాలేదు ఇంకా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నే కొనసాగుతున్నాయి,అందులో ముఖ్యంగా డిఎల్ పీవో కలదు.ఇది డివిజన్ స్థాయి కార్యాలయం జిల్లా కేంద్రం నుండే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కార్యాలయం అక్కడే కొనసాగుతున్నది,దీని వలన ప్రజలు తీవ్రమైన అసౌకర్యానికి గురి అవుతున్నారు ముఖ్యంగా గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయము లేకపోవడం వలన గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేయడం జరుగుతుంది

డిఎల్ పిఓ కార్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు గ్రామాల బాగోగులు చూడాల్సిన బాధ్యత కార్యదర్శుల పైన ఉన్నది ఆజమాషీ చేయాల్సిన డిఎల్ పిఓ కార్యాలయానికి ఉంటుంది గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగితే డీఎల్ పిఓ కు విన్నవిస్తారు,ఈ కార్యాలయం జహిరాబాద్ లో లేనందున సంగారెడ్డికి వెళ్లలేక తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు దృష్టి సారించి జహిరాబాద్ డివిజన్ కు సంబంధించిన డీఎల్ పిఓ కార్యాలయాన్ని వెంటనే జహిరాబాద్ లో ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు

నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేని జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి పైనా చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోని ప్రజలకు అందుబాటులో ఉండాలని దళిత నేత తుంకుంట మెహన్ కోరారు. దశాబ్ది కాలం నుండి జహీరాబాద్ డివిజన్ పరిధిలో అందరు డివిజనల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తుంటే,, డివిజనల్ పంచాయతీ అధికారి మాత్రం హైదరాబాద్ నుండి మరియు సంగారెడ్డి నుండి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజావాణి లో కూడ పిర్యాదు చేయడం జరిగింది అని అన్నారు.ఇప్పటికైనా డివిజనల్ పంచాయతీ అధికారి తీరు మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ కు మరియు పంచాయతీ రాజ్ కమీషనర్ లకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడం జరిగింది.

శేఖపూర్ లో వీధి కుక్కల బెడద: పిల్లల భద్రతపై ఆందోళన…

శేఖపూర్ లో వీధి కుక్కల బెడద: పిల్లల భద్రతపై ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి, బయట ఆడుకోవడానికి భయపడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని శేఖపూర్ గ్రామస్తులు శనివారం సంబంధిత అధికారులను కోరుతున్నారు.

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు…

జహీరాబాద్ నియోజకవర్గం లో వర్షానికి ఇబ్బందుల పాలవుతున్న ప్రాంత ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఇమ్రాన్ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నేషనల్ హైవే రోడ్లు చెరువుల్లా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. తాండూర్ వైపు వెళ్లే రోడ్డు చౌరస్తా వద్ద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కన నాళాలు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. స్థానికులు పలుమార్లు సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు త్వరితగతిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

తాసిల్దార్ తిరుమల రావు సమర్థ సేవలు అందిస్తున్నారు..

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న తాసిల్దార్ తిరుమల రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల్ తాసిల్దార్ పనిచేస్తున్న తిరుమల రావు ప్రజలకు సక్రమంగా సేవలు అందిస్తున్నారు. ప్రజల సమస్యలు విన్న వెంటనే పరిష్కారం చూపిస్తూ, పేదల అభ్యర్థనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తూ, కార్యాలయంలో పారదర్శకతను కాపాడుతున్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నందుకు స్థానికులు తాసిల్దార్ తిరుమల రావుకి ఝరాసంగం మండల్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు,

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

ప్రజా సమస్యలపై పోరాడుదాం…

బి జె పి జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపిటిసి మదన్ నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పు నూతల రమేష్, అధ్యక్షతన లక్ష్మి సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు ( బి.ఆర్.ఎస్ ) పార్టీ నాయకులు రాబందుల్లా దోసుకుంటే దాదాపు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల మీద బిజెపి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టి, కెసిఆర్ ను గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసముద్రం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదని,  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని స్తానిక సంస్థలకు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించక పొవట వలన గ్రామా పంచాయతిలకు  రావలిసిన  కోట్లాది రూపాయల కేంద్ర నిధులు మురిగి పోయి గ్రామిణా అభివృద్ది కుంటుపడుతున్నది,
గ్రామపంచయతిల లో పంచాయతి అధికరులకు   పరిపాలన భారంవుతన్నది. కావున వెంటనే అన్ని స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కార్యకర్తలు పోరాడాలని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలిగా వెళ్లి కేసముద్రం మండలం లోని వివిధ గ్రామల ప్రజలు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసారు.
ఈ సందర్భముగ బిజెపి మండల అద్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని ఉప్పరపల్లి , ఇంటికన్నె , వేంకటగిరి, కాట్రపల్లె, అర్పనపల్లె, మహమూద్పట్నం, తాళ్ళపుసపల్లి, నారయణపురం,అన్నారం, గాంధీ నగరం, సప్పిడిగుట్ట తండ, కోరుకొండపల్లె , మేగ్య తండ,అనేక తండా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు, రోడ్లపై నీళ్లు నిలవడం, బురద ఏర్పడటం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోవడం, మురుగునీటి నిల్వతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి  గ్రామాల్లో ప్రజలు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో  పారిశుద్ధ్యం, నీటి సరఫరా  సరైన  రోడ్డు, రవాణ, విద్యుత్ , మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా గ్రామాలలో పేరుకు పోయిన మురుగు  నీరును తొలగించి , బ్లీచింగ్ పౌడరు చల్లి మరియు అంటువ్యాధులు ప్రబలకుండా నివారించాలని ,మురుగు నీటి కాలువలను శుభ్రపరచాలని, పైప్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరచి, గ్రామాలలో  పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని.  కేసముద్రం మండలం లోని గ్రామాలలో అంటు వ్యాధుల నివారణ కు  మండల వైద్య శాఖా  అధికారులచే తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు .
 కల్వల  గ్రామంలో మురుగు నీరు బయటకు  పోయే కనీస వసతులు లేక పోవడంతో గ్రామస్థులు, ప్రజలు  ఇబ్బందులకు గురవుతున్నారని. మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ లేకకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు, వరద నిరు  ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు ఇళ్లలోకి వస్తుండడంతో  అనారోగ్యానికి గురవుతున్నారని. గతంలో సెల్యులైటిస్, బోదకాలు , డెంగ్యూ జ్వరాలతో కల్వల గ్రామంలో బాధపడ్డారని.కావున ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మరియు  కాలనీల్లో  డ్రైనేజీ నిర్మించి ప్రజల  ఆరోగ్యాన్ని కాపాడాల డిమాండ్ చేసారు.

 

  దీనికి తోడు ఇప్పుడు ఈ గ్రామంలో మనుషుల జనాభా కంటే కోతుల, కుక్కల  సంఖ్యనే ఎక్కువగా‌ ఉందని. భయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారని , గ్రామాల్లో ప్రజల పై కోతులు, కుక్కల  దాడులు పెరిగి అనేక మంది ప్రజలు  తీవ్ర గాయాల పాలైన సంఘటనలు జరిగాయని,అంతే కాకుండా  ఇక్కడ ప్రజలు ఆరుతడి పంటలు సాగు చేయడం వదిలిపెట్టారని. ఇప్పటికే ఇంటి పై కప్పులను ద్వసం చేస్తున్నాయని . గతంలో‌ మనుషులని చూస్తే కోతులు భయపడి పరుగులు తీసేవి. కాని ఇప్పుడు కోతులను, కుక్కలను  చూసి మనుషులు భయపడే పరిస్థితి నెలకొంటుందని కావున కేసముద్రం మండలం లోని అన్ని  గ్రామాలలో ఉన్న కోతుల, కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాటానికి తగు చర్యలు తీసుకోవాలని బిజేపి మండల శాఖ తరుపున డిమాండ్ చేసారు .
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు బోగోజు నాగేశ్వర చారి,ఉపేందర్ , మండల ఉపాద్యక్షులు కొండపల్లి మహేందర్ రెడ్డి ,నాగరాబోయిన చంద్రకళ, కార్యదర్శి జాటోత్ నరేష్ ,మాల్యాల రాములు, పూర్ణకంటి భాస్కర్ , బండి వెంకన్న ,శ్రీను ,రమేష్ నాయక్ ,సురేష్ నాయక్ ,మంగా వెంకన్న, భుక్య విజయ్ , జంగిటి అనిల్ ,సింగంశెట్టి మధుకర్ , పరకాల మురళీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version