బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం.

బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం.

బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కి పట్టణ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో కలుషిత మురికి నీరు కలిసిన నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు. అట్టి నీటి నీ ప్రజలు వాడడం ద్వారా ప్రజల ఆరోగ్యం చెడిపోయి వ్యాధిగ్రస్తులైతున్నారు. కావున స్వచ్ఛమైన నీరును పట్టణ ప్రజలకు అందించవలెను. ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడగలరు.
పట్టణంలోని అన్ని వార్డులలో దోమల బెడద ఎక్కువగా ఉన్నది. దోమల బెడద నివారణకు దోమల మందును స్ప్రే (పోగింగ్) చేయించగలరు.
అన్ని వార్డులలో డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు. వెంటనే డ్రైనేజీలు క్లీన్ చేయించగలరు.
సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి కన్నాల బస్తి ఫ్లై ఓవర్ వరకు మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు జరుగుచున్నవి. ఈ అసౌకర్యాన్ని తొలగిస్తూ రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేపట్టగలరు.
పైన పేర్కొనబడిన సమస్యల గురించి ఇంతకుముందు మీకు వినతి పత్రము ఇచ్చినాము. దానిమీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరల ఒకసారి మీకు ఈ సమస్యలపై వినతి పత్రము ఇచ్చుచున్నాము. ఇప్పుడైనా స్పందించి పైన సమస్యలు వెంటనే పరిష్కరించగలరని విశ్వసించుచున్నాము. ఈ సమస్యలు పరిష్కరించని పక్షంలో మునిసిపల్ ఆఫీసు ముందు భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనల ను జరుపుతాము అని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొల్లం పూర్ణిమ రాష్ట్ర సమితి సభ్యురాలు,చిప్ప నరసయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు,బొల్లం తిలక్ అంబేద్కర్ పట్టణ సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ ఆడెపు రాజమౌళి
సిపిఐ పట్టణ కార్యదర్శి
తదితరులు పాల్గొన్నారు.

మండలంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవ.!

మండలంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ నేటి ధాత్రి:

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా ఇన్చార్జి రుద్రారపురామచందర్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించి సామాజిక ఉద్యమాలు ద్వారా సకల జనులకు మేలు చేశారని ఆరోగ్యశ్రీ పథకం వికలాంగులు వితంతువులు గుండె జబ్బు పిల్లల కోసం ఇలా సమాజానికి సేవ చేయడం సమాజం అండగా ఉండడం ద్వారా వర్గీకరణ సాధించామని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో దండోరా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అభ్యర్థులు కోట రాజబాబు ఫ్యాక్ట్ చైర్మన్ తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్ ఖాన్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్ మైనార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ ఆశ్రర్ సురేష్ టిఆర్ఎస్ నాయకులు ఆన్కారి ప్రకాష్ టిఆర్ఎస్ యూత్ నాయకులు కూర తోట రాకేష్ ముదిరాజ్ మండల అధ్యక్షులు గడ్డం స్వామి రజక సంఘం నాయకులు చెన్నూరు వెంకటయ్య మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆమీన్ నేతకాని సంగం నాయకులు ప్రేమానందం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామారావు, మండల ఆర్ ఎం పి నాయకులు అబీబ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ చేతుల మీదుగా గంజాయి.

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ చేతుల మీదుగా గంజాయి అవగాహనపై వాల్ పోస్టర్ విడుదల

బెల్లంపల్లి జులై 01 నేటి దాత్రి

 

 

 

నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్ సారాద్యంలో
బెల్లంపల్లి ఏసీపి కార్యాలయంలో
ఏ సి పి రవికుమార్ ని కలిసి వారి చేతులమీదుగా ప్రస్తుతం యువత రోజురోజుకు గంజాయి మత్తులో మునిగిపోతున్నారనే సంకల్పంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టిస్ మూమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి జూలై 30 వరకు గంజాయి పై అవగాహన సదస్సులకు సంబంధించి వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ ఎస్సై రాజశేఖర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ, బత్తిని కృష్ణ, లీగల్ సెల్ అధ్యక్షులు పెసర శ్రీకాంత్, పాల్గొనడం జరిగింది.

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం:

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్
గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ భారీ అవగాహన ర్యాలీ
మందమర్రి: మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో “మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ”ని గురువారం ఘనంగా నిర్వహించారు.

 

 

 

 

ఈ ర్యాలీని ఏసీపీ రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీలో సింగరేణి మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, ఇతర సింగరేణి అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. “మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి” వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.

 

 

 

 

ఈ సందర్భంగా ఏసీపీ రవి కుమార్ మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం మరియు వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది,” అని హెచ్చరించారు.

 

 

 

సింగరేణి జీఎం దేవేందర్ మాట్లాడుతూ, “చెడు వ్యసనాల వల్ల యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు అనే మహమ్మారి నుండి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది,” అని అన్నారు.

 

 

 

మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, “సరదాగా మొదలయ్యే అలవాటే వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలి,” అని కోరారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఉపాధ్యాయులకు, యాంటీ-డ్రగ్ కమిటీలకు లేదా డయల్ 100, 1908 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

 

 

 

 

ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్ఐలు, సింగరేణి పర్సనల్ మేనేజర్, ఎస్ఓ టూ జీఎం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆద్వర్యంలో కలం యోధుడు ఉద్యమనేత సీనియర్ పాత్రికేయులు దివంగత జర్నలిస్టు మునీర్ అన్నకు బెల్లంపల్లి పాత్రికేయుల నివాళులు అర్పించారు. సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్ర
పటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సజ్ను ఫఫీ మాట్లాడుతూ మునీర్ భాయ్ పత్రికా రంగానికి విశేష సేవలు అందించడం తోపాటు కార్మిక వర్గానికి చేసిన సేవ లను గుర్తు చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మడమతిప్పని పోరాటాలు చేసిన మహనీయుడని, పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయుడుగా రాణిస్తూ విశ్లేషణాత్మకమైన కథనాలతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషిని చేయడం జరిగిందని, నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో
బాధ్యతలు స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిని ప్రదర్శించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన మునీర్ భాయ్ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్ర
మంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ టేకుల బస్తి ఉపాధ్యక్షుడు ఇరుకుల్ల రమేష్,
ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే,కోశాధికారి కత్తుల నవీన్,కార్య
వర్గ సభ్యులు టి.శ్రావణ్, కె.రమేష్ ,
కె.సాగర్, ఉపాధ్యక్షుడు దండబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి సుభాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు…

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు…

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.

బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల సందర్భముగా యేసు క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానములను స్మరించు కొంటూ , బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లోని క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బెల్లంపల్లి పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణం లోని క్రైస్తవ మత పెద్దలు రెవ సి హెచ్ అశోక్, ఫాదర్ కురియన్, జార్జ్ మాత్యు , జోషి, స్వామి జాకబ్ వారి ఆద్వర్యం లోని సంఘాల విశ్వాసులు ప్రార్ధనా పూర్వకంగా పాల్గొని కార్యక్రం జయప్రదం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version