వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది…

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది.
పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు.
నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు.
తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
“వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.”
అని అన్నారు.
పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు.
సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.

ఘనంగా వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం…

ఘనంగా వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోనిబాలాజీ టెక్నోస్కూల్( సీబీఎస్ఈ)లో 150 సంవత్సరాల వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ .రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వందేమాతర గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ నవలా ప్రక్రియను పరిచయం చేసిన సాహితీ సుప్రసిద్ధులు భారతమాతకు వందనం అంటూ మొదటి చరణంతో ప్రారంభమైన గేయం స్వాతంత్ర్య సమరంలో ఎందరికో ప్రేరణ ఇచ్చిందని గుర్తు చేశారు.భారత జాతీయ గేయమైన వందేమాతరంను రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిందని తెలియజేశారు.బెంగాల్ సాయిధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకు గురైన తొలి యువకుడు కుదీరామ్ బోస్, వీర సావర్కర్ వంటి ఉద్యమకారులు ఉరికంబాన్ని ఎక్కే ముందు కూడా చిరునవ్వుతో వందేమాతరం అంటూ ఉరికొయ్య వైపు నడిచారని, ఈ గేయం ఎంతటి స్ఫూర్తినిచ్చిందో తెలియజేస్తుందని తెలిపారు.ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బిబిసి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోలో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాలలో వందేమాతరం రెండో స్థానం దక్కించుకుందని , ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను చాటుతోందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ఎన్.సి.సి క్యాడెట్ లు జాతీయ పతాకముతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు సామూహికంగా వందేమాతరం రాగయుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, క్రాంతి కుమార్, రవీందర్ రెడ్డి ,ప్రదీప్ ,వినోద్, స్వప్న, సంగీత, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గీతం!

ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ద తరంగం!
వందేమాతరానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా, పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కలనల్ సెంతిల్ రామదురై, పరిపాలన అధికారి రవి సోనహరే వారి ఆదేశాల మేరకు జడ్పీహెచ్ఎస్ మొగుల్లపల్లి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్.భాగ్యశ్రీ, ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థులచే జాతీయ గీతం అయిన వందేమాతరం పూర్తి గేయాన్ని మూడు నిమిషాల ఆలపించి, మొగుళ్లపల్లి వీధుల గుండా ర్యాలీగా వెళ్లి,చౌరస్తాలో మానవహారం ఏర్పరిచి మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, సమక్షంలో వందేమాతర గీతాన్ని ఆలపించి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎన్సిసి అధికారి మాట్లాడుతూ వందేమాతరం యొక్క పుట్టుక, దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టి. వెంకన్న,
బి. కుమారస్వామి, కె. ప్రవీణ్
ఎం. రాజు, డి. పద్మ, పి. లలిత,
జి. విజయభాస్కర్. ఆర్. చందర్ ఎండి. మజార్, బి. వేణు, ఎన్సిసి విద్యార్థులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

 

జహీరాబాద్ పాఠశాలలో విద్యార్థుల వందేమాతరం గీతాలాపన…

జహీరాబాద్ పాఠశాలలో విద్యార్థుల వందేమాతరం గీతాలాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు పాఠశాలలో శుక్రవారం ఉదయం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేంకటయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఏకకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఝరాసంగం విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం ఏకకంఠం

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికి జాతీయ గౌరవం ఐక్యతను పెంచుతున్న వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం గేయ ఆలాపనలో విద్యార్థులు తో సహా పోషక మహాశయులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల కరస్పాండెంట్ బి.నాగన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version