పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు వీరే

పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు వీరే

# నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను వెల్లడించిన ఎంపీడీవో యసం లావణ్య. వివరాలు ఇలా ఉన్నాయి
అలంఖానిపేట బీసీ ఉమెన్, చీకటి రమాదేవి, నీలం రాధిక, నాంపల్లి నిరోషా, సూరూం సుజన, బొల్లి కొండ జనరల్ మహిళ, మాలోత్ అరుణ, భాను జ్యోతి, రెడ్యా నాయక్ తండా ఎస్టి ఉమెన్, ఆంగోత్ ఉమా, ఆంగోత్ దేవి, అమీన్ పేట్ ఎస్సీ మెన్ అండ్ ఉమెన్, డెక్క ఎల్లయ్య, డెక్క చంద్రయ్య, పనికర బిసి మేన్ అండ్ వుమెన్, ఓరుగంటి సమ్మయ్య, కొల లక్ష్మణ్, రామన్నకుంట తండా ఎస్ టి ఉమెన్, గూగులొతు రేణుక, భానోత్ శారద, అప్పలరావుపేట జనరల్, ఉడుగుల అశోక్, దొడ్డ సతీష్, రాగం రాజేందర్, తోపనపల్లి జనరల్ ఉమెన్, కన్నబోయిన రజిత, చాగంటి మమత, వెంకటాపురం ఎస్ టి ఉమెన్, జాటోత్ కవిత, జాటోత్ శైలజ, బంజారా పల్లి ఎస్టీ జనరల్, భూక్య రమేష్, బాధావత్ రవి, లావుడియా వాగ్యనాయక్ తండ ఎస్ టి ఉమెన్, భూక్య బాజు, బోడ రాజేశ్వరి, చంద్రుగొండ జనరల్, అనుముల సుప్రజ, బక్కీ కవిత, సంఘని సూరయ్య, గొల్లపల్లి బిసి మెన్ అండ్ వుమెన్, ధొనిక అశోక్, యం కుమారస్వామి, దాసరి సౌమ్య, మూడు తండా ఎస్టీ మెన్ అండ్ వుమెన్, బోడ బాలు, భూక్య రవీందర్, మూడు బాలాజీ, బోడ వీరన్న, దీక్షకుంట ఎస్సీ ఉమెన్, వారణాసి అనిత, కన్జర్ల కమల, జామండ్ల భూలక్ష్మి, మూడుసు రజిత, ముడుసు వినోద, సీతారాంపురం జనరల్, కట్టుకూరి విజయలక్ష్మి, కట్కూరి శేషారెడ్డి, ముదిగొండ జనరల్ మెన్ అండ్ వుమెన్, అనుముల శ్రీధర్ రెడ్డి, తుమ్మల సునీల్, పున్నం రంగారెడ్డి, హరిచంద్ తండా ఎస్టీ వుమెన్ జాటోత్ ఉపేంద్ర, జాటోత్ లలిత, జాటోత్ విజయ, గుండ్రపల్లి జనరల్ ఉమెన్, వల్లెం అరుంధతి, ఇటుకల దీపిక, బోళ్ళ యాదలక్ష్మి, కాస్నా తండా ఎస్సీ మెన్ అండ్ వుమెన్,సిహెచ్ ప్రభాకర్, పానుగంటి అశోక్,పి వెంకన్న, మడిపల్లి జనరల్ వుమెన్, ఆంగోత్ అనూష, తేజావత్ కవిత, నాగారం జనరల్ మహిళ , నాంపల్లి విజయ, పోలేపల్లి మంజుల, ఉండ్రాతి లావణ్య, నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ జనరల్, తాళ్లూరి కృష్ణ ,కొమ్ము రమేష్ యాదవ్ ,తాళ్లూరు లక్ష్మయ్య ,పెండ్యాల హరిప్రసాద్, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, నెక్కొండ తండా ఎస్టీ మెన్ అండ్ వుమెన్, భానొత్ రవికుమార్, బోడ అనిల్ కుమార్, పత్తిపాక ఎస్టి మెన్ అండ్ వుమెన్, లావుడియా యాకూబ్, లావుడియా సూరయ్య, పెద్ద కొరుపొలు ఎస్సీ మహిళ, చెరుకు మమత, జామాండ్ల పద్మ, మట్ట కీర్తన, మట్ట రేణుక, రెడ్లవాడ జనరల్ మెన్ అండ్ వుమెన్, బండి అఖిల్ ,దగ్గు సంతోష్ కుమార్, దూదిమెట్ల లావణ్య, అజ్మీర మంగ్య తండ ఎస్టీ మెన్ అండ్ ఉమెన్, బానోత్ వెంకన్న, మాలోత్ నరేష్, మాలోత్ వెంకన్న, మాలొత్ శివ లాల్, గొట్లకొండ జనరల్ మెన్ అండ్ వుమెన్, కునుసోత్ వెంకన్న, జాటోత్ బిక్షపతి, భూక్యా జనార్ధన్, సాయి రెడ్డి పల్లి జనరల్ ఉమెన్, మైనేని రత్తమ్మ, బండారుపల్లి వినాయ కుమారి, మహబూబ్ నాయక్ తండ ఎస్ టి ఉమెన్, బానోత్ మంజుల, భానోత్ సుశీల, పిట్ట కాలుబోడు తండా ఎస్టీ మెన్ అండ్ వుమెన్, ధరావత్ సతీష్, బాదావత్ సూర్య, సూరిపల్లి బిసి మహిళ, గడ్డం రజిత, జి కోమల, పి ప్రతిభ, ఎం శారద, ఎస్ ఎల్లమ్మ, చెరువు ముందరి తండా ఎస్టీ మహిళ, కులుసోతి మంగమ్మా, భానోత్ నీలా, కాగా చిన్న కొరుపొలు, వెంకట్ నాయక్ తండ, నక్కలగుట్ట తండా, దేవుని తండా, టేకులకుంట తండా ఈ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి.

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం…

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

పలు గ్రామాలలోని కాలనీలలో చేరిన వరద నీరు

వేల ఎకరాలలో మునిగిన వరి పంట

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో భారీ ఎత్తున పంట నష్టం తో పాటు పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు, పాలకులు, అప్రమత్తమై పలు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట , పత్తి పంటలు తుఫాన్ దాటికి నేలకొరకగా, కొన్ని ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి.

ముఖ్యంగా నెక్కొండ మండలం నుండి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం లో లెవెల్ కొట్టుకుపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వట్టే వాగు ప్రభావంతో భారీగా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎస్సై మహేందర్ రెడ్డి, తాసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో లావణ్య వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు గ్రామాలలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నాగారం గ్రామంలో నీట మునిగిన ఎస్సీ కాలనీ

నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుఫాన్ దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులను స్థానిక తహసిల్దార్ వేముల రాజకుమార్, నాగారం పలు పార్టీలకు చెందిన నాయకులు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందించారు. అంతేకాక నాగారంలోని తుఫాన్ దాటికి ఓ భారీ వృక్షం కింద పెట్టిన పల్సర్ బైక్ పై వృక్షం కూలడంతో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది.

ఎవరు కూడా బయటికి రావద్దు

భారీ తుఫాన్ ప్రభావంతో నెక్కొండం మండలంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని రాబోయే 48 గంటల వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయటికి రావద్దని స్థానిక తాసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో లావణ్య, ఎస్సై మహేందర్ రెడ్డిలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version