దేశ సమగ్రతకు ఉక్కు మహిళ ఇందిర గాంధీ..

దేశ సమగ్రతకు ఉక్కు మహిళ ఇందిర గాంధీ

పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్

 

పరకాల,నేటిధాత్రి

 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి,దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని వారి సేవలను దేశంలోని పేదలకు భూములను పంచి, నిరుపేదలకు ఇండ్లు కట్టించిన ఘనత ఇందిరా గాంధీది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,చిన్నాల గోనాథ్,బండి సదానందం,మార్క రఘుపతి గౌడ్,బొచ్చు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి..

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంలో ఇంద్ర గాంధీ జయంతి సందర్భంగా ఇంద్ర గాంధీ విగ్రహానికి నర్సంపేట టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నేడు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే నాయకురాలు, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని దేశం స్మరించుకుంటూ దాని ప్రజాహితమే పరమ ధర్మంగా భావించి, కఠిన నిర్ణయాలు తీసుకున్న ఉక్కు మహిళగా ఆమె భారత రాజకీయాలకు చెరగని ముద్ర వేశారని గ్రీన్ రివల్యూషన్‌ నుండి పేదల సంక్షేమ పథకాల దాకా, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన శక్తి ఆమెదే.
దేశ ఐక్యత, భద్రత, మహిళ సాధికారత కోసం చేసిన ఆమె సేవలు నేటికీ ప్రజలకు ప్రేరణ ఇంద్ర గాంధీ సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయి కృష్ణ, కుసుమ చెన్నకేశవులు ,కొల్లు వెంకటసుబ్బారెడ్డి, రామలింగేశ్వర ఆలయ చైర్మన్, కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, మెరుగు విజయ్ ,గంధం సుధాకర్ ,మహమ్మద్ అన్వర్, ప్రభాకర్, రావుల మహిపాల్ రెడ్డి ,సింగం ప్రశాంత్, పోలిశెట్టి భాను, తదితరులు పాల్గొన్నారు.

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ….

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ.

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశికృష్ణ.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ మాట్లాడుతూ పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని అన్నారు. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు… నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిలుకల రాయకోమురు దొడ్డి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల నాయకులు గుమ్మడి సత్యనారాయణ, అరెపెల్లి మల్లయ్య, అరెపల్లి నర్సింహారాములు, ఆకుల రవీందర్, శనిగరపు మొగిలి యూత్ నాయకులు అల్లం రాజు ఏకు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version