దేశ సమగ్రతకు ఉక్కు మహిళ ఇందిర గాంధీ
పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్
పరకాల,నేటిధాత్రి
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి,దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని వారి సేవలను దేశంలోని పేదలకు భూములను పంచి, నిరుపేదలకు ఇండ్లు కట్టించిన ఘనత ఇందిరా గాంధీది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ,చందుపట్ల రాఘవరెడ్డి,దుబాసి వెంకటస్వామి,చిన్నాల గోనాథ్,బండి సదానందం,మార్క రఘుపతి గౌడ్,బొచ్చు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
