రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు…

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు

రామడుగు, నేటిధాత్రి:

 

టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు శుక్రవారం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి జి.పి.వి.రంగనాథ శర్మ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఈపోటిలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపోందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీ మనోభావం, జ్ఞాన విస్తరణకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ విద్యా రంగంలో చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది…

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది.
పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు.
నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు.
తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
“వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.”
అని అన్నారు.
పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు.
సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.

పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.

పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,లో బుధవారం
రోజున చిట్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి సమక్షంలో ఏఎస్ఐ మధుసూదన్ సారధ్యంలో పాఠశాలలోని విద్యార్థులు అందరి చేత మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మధుసూదన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానవ మనుగడకు పెనుముప్పు అని మాట్లాడడం జరిగింది. మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి చెందిన దేశంఅని, మాదకద్రవ్యాలను అందరం కలిసికట్టుగా నిర్మూలించుదామని చెప్పారు.ఈ కార్యక్రమంలో బొమ్మ రాజమౌళి, రామ్ నారాయణ, శ్రీనివాస్, ఉస్మాన్ అలీ, శంకర్, బుర్ర సదయ్య, సరళ దేవి, నీలిమారెడ్డి, విజయలక్ష్మి, మౌనిక, స్వామి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి పూర్వ విద్యార్థి గుర్రపుచందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version