మేడారం సమ్మక్క సారలమ్మ పాదయాత్ర ప్రారంభం

మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తజనులు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులపై అచంచలమైన భక్తితో వరంగల్ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత మానుకోట జిల్లా తొర్రూర్ నుంచి భక్తజనులు పాదయాత్రగా మేడారం వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్ర బృందం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రజలకు, భక్తి భావంతో దర్శనమిచ్చారు.ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ పాదయాత్రను ఈ సంవత్సరం కూడా గురువారం 22వ తేదీ నుంచి ప్రారంభించగా, సోమవారం 26వ తేదీన మేడారం చేరుకోనున్నట్లు పాదయాత్రకు సమన్వయం వహిస్తున్న కూరపాటి కామారాజు తెలిపారు.
ఈ పాదయాత్రలో స్త్రీలు, పురుషులు కలిపి సుమారు 300 మంది భక్తులు గ్రూపులుగా బయలుదేరగా, ఒక్కో గ్రూపులో సుమారు 45 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. పూర్వీకుల కాలం నుంచే తమ కుటుంబాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా ప్రతి జాతర సమయంలో పాదయాత్రగా వెళ్లి తల్లుల దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పాదయాత్రలో హస్తం వెంకన్న, తిరుపటి శ్రీనివాస్, కిన్నెర మోహన్, హస్తం వెంకటమ్మ, తిరుపటి శైలజ, లక్ష్మి, సారమ్మ, ధనమ్మ, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, యువకులు, యువత సమాన ఉత్సాహంతో మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ పాదయాత్ర భక్తుల హృదయాలను కదిలిస్తోంది.

మొంత తుఫాన్ బీభత్సం… నేలకొరిగిన పంట పొలాలు..

మొంత తుఫాన్ బీభత్సం… నేలకొరిగిన పంట పొలాలు

నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి

మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

తుఫాను ప్రభావంతో చేతికి అందిన పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి పరిహారం చెల్లించి ఆదుకోవాలి మానుకోట మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అనేక విధాలుగా రైతులు ఈ ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొని ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరికొద్ది రోజుల్లో కోత దశకు వస్తున్న నేపథ్యంలో ఈ తుపాను కారణంగా నియోజకవర్గంలో అనేకచోట్ల వరిచేను నీలమట్టం కావడం రైతులు పార్టీ నాయకుల ద్వారా తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక మండల నాయకులతో కలిసి కేసముద్రం మండలం ధనసరి గ్రామంలో నీలమట్టమైన వరి పంటను ఆయన పరిశీలించారు తక్షణమే సంబంధిత అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేసి బాధిత రైతులకు చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్, ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, బానోతు వెంకన్న నాయక్, బిర్రు వెంకన్న, బానోత్ శ్రీను నాయక్, బండారు గోపి, వంగల అశోక్, భానోత్ భీమన్న, గణేష్,బాధవత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version