నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు..

నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

మండలంలో వానాకాలం పంటల సాగు మొత్తం 26,956 ఎకరాలకు చేరినట్లు తహసిల్దార్ వేముల రాజ్ కుమార్ చైర్మన్ తెలిపారు. గురువారం లైన్ డిపార్ట్మెంట్లతో కలిసి పంటల విస్తీర్ణంపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగులోకి వచ్చాయని వివరించారు. సమావేశంలో యం పి యస్ ఓ హనుమంతు నాయక్, ఏ ఓ నాగరాజు, ఇరిగేషన్ ఏ ఈ ఈ చందన, ఏ ఈ ఓలు రాజేష్, రఘు పాల్గొన్నారు.

యూరియా కోసం ఎండలో.. రైతులు

యూరియా కోసం ఎండలో.. రైతులు

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం ఉదయం నుండి రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. 34 డిగ్రీల ఎండలోనూ నిలబడి యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఒక్కసారిగా వ్యవసాయ సహకార సంఘం వద్దకు చేరుకోవడంతో రోడ్డుపై భారీగా రద్దీ ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వివిధ ఆరుతడి పంటలు సాగు చేసి యూరియా దొరకకపోవడంతో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి సరిపడ యూరియా సరఫరా చేయాలని రైతులు కోరారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం…

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హత పొందిన పనులను ఎమ్మెల్యే మాధవరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందని ఈ పథకం ద్వారా ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, పంట సాగులు, గొర్రెల గేదెల షెడ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతో తోడ్పడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, అడిషనల్ పీడీ రేణుక, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, డిసిసి కార్యదర్శి హరిప్రసాద్, సాయి కృష్ణ, ఆవుల శ్రీనివాస్, తిరుమల్, బండి శివకుమార్, రావుల మైపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, ఉడుగుల అశోక్, వడ్డె ఏకాంబరం, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version