ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత…

ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత

అప్పయ్యపల్లి ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్

గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో ఇటీవలే స్వర్గస్తులైన దొంతుల ఉప్పలయ్య కుమారుడు కోడలు ఆయన దొంతుల రవి సమ్మక్క లకు అప్పయ్యపల్లి గ్రామ ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్ 50 కిలోల బియ్యం అందించి వారి కుటుంబాన్ని ఓదార్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోలెడ్ల ప్రభాకర్ రెడ్డి యాదవ సంఘం మండల అధ్యక్షులు దోమల రాజయ్య, కందికొండ అనిల్ ,నేతగాని రాజేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు

నెక్కొండ గ్రామ సర్పంచ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ సర్పంచ్
#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన కొమ్ము ఉపేందర్ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాంపెల్లి నిరోషా శ్రావణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పదవ రోజు కార్యక్రమానికి తమ వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇడంపాక ప్రకాశం, బీసీ సెల్ అధ్యక్షులు కోలా నరేష్, రామాలయ కమిటీ వైస్ చైర్మన్ చీకటి సుమన్, వార్డు సభ్యులు చీకటి వెంకన్నతో పాటు సీనియర్ నాయకులు ఎడ్ల సురేందర్, చిదరాల నరేష్, రామస్వామి, బిక్షపతి, వేణు, హనుమంతు, అశోక్, యాకయ్య, శ్రీను తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
గ్రామ పాలకులు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version