మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా.!

మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా సదానందం ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ కార్మికులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా సదానందం ఉపాధ్యక్షుడు కల్లేపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి రాజేందర్ బద్రిని భూపాలపల్లి మున్సిపల్ కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ కార్మికులు నామీద నమ్మకంతో నన్ను మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తాం అని వారు అన్నారు గౌరవ అధ్యక్షుడు బండారి బాబు ప్రకాష్ కమిటీ సభ్యులు జంపయ్య రాజయ్య మంజుల సునీత సతీష్ రాజేందర్ వెంకన్న రాజబాబు ఎన్నికైనారు కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు

శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి .

శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమార్చన పూజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అమీనాపురం కేసముద్రం మున్సిపాలిటీ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతా లతో అభిషేకం, శ్రీ హోమం, కుంకుమార్చన పూజ లు ఆలయ అర్చకులు వినయ్ మిశ్రా, హేమంతా చార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోమహిళా భక్తులు అధికంగా పాల్గొని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఓలం మురళి, బచ్చు పరమేశ్వర్, కొయ్య గూరి యాకుబ్ రెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి, బాణాల నాగరాజు, శ్రీరామ్ సంతోష్ భక్తులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ సభ్యులు రఘునాథరెడ్డి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17 వ వార్డ్ విద్యానగర్ ఏరియాలో 4.75 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో 92 మీటర్ల సిసి రోడ్డు పనులకు గురువారం రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి లు భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. 17వ వార్డు అభివృద్ధి కోసం 25 లక్షల నిధులతో డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను చేయించడం జరుగుతుందని తెలిపారు.బడ్జెట్ లేని కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఇకనుండి అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను విడుదల చేయించారని త్వరలోనే పనులు సైతం ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, రవీందర్, వెంకటేష్ కిష్టయ్య, రాజయ్య, కళ్యాణ్, కనకరాజు, వేణు, రమేష్, విజయ, పుష్ప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పరకాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి

పరకాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా

నూతన మున్సిపాలిటీ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి కొట్టబట్టల పంపిణీ

అనంతరం మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన,మెప్మా ఫుడ్ స్టాల్ ల సందర్శన

పరకాల నేటిధాత్రి

మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో వన మహోత్సవంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలను నాటి జెసిబి,6 స్వచ ఆటోలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,అధికారులతో కలిసి శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను అధికారులతో కలిసి సందర్శించి మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాల సందర్శన స్టాల్ ను పరిశీలించి అనంతరం మున్సిపల్ కార్మిక సిబ్బందికి బట్టలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన పరకాల గత పాలకుల వైఖరి వల్ల నిరాధారణకు గురైందని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నానన్నారు.పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయబోతున్నామని,త్వరలో సెట్విన్ రాబోతుందని,టి యుఎఫ్ఐడిసి నిధులతో డిపిఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు.త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే నలభై కోట్లతో డ్రైనేజీ,దాదాపు 11 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు.ప్రజల సహకారంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని,ప్రజలు పరిశుభ్రత పాటించి పారిశుద్ధ్యంను పరిష్కరించడంలో భాగస్వాములు కావాలన్నారు. పరకాలకు పూర్వ వైభవం తీసుకురావడంలో ప్రజలు సహకరించాలని కోరారు.మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని,రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,నివాస గృహాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరా,రైతు భరోసా,2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, యువతకు రాజీవ్ యువ వికాసం,మహిళలకు వడ్డీ లేని రుణాలను,ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు,మున్సిపాలిటీ ఆశీకారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనలో పట్టణ ప్రజలు.

శునకాల గుంపులు.. ఆందోళనలో పట్టణ ప్రజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు విలీన గ్రామాల ప్రజలు వీధి కుక్కల వల్ల తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆర్డిఓ రామ్ రెడ్డి గారికి వారి కార్యాలయంలో కలిసి బి.ఆర్.ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు ,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నామ రవికిరణ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లపై వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర్య విహారం చేస్తున్నాయని, పట్టణంలోని పలు ప్రదేశాలలో వీధి కుక్కలు చిన్న పిల్లలపై దాడులు సైతం చేశాయని అన్నారు.. వీధి కుక్కల వల్ల ద్విచక్ర వాహనదారులు రోడ్లపై కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తూ పలువురు ప్రమాదానికి గురి అయ్యారని అన్నారు… నిత్యావసర సరుకులు ఖరీదు చేసి ఇంటికి వెళుతున్న మహిళల చేతులలో ఉన్న సంచులను వీధి కుక్కలు వారిపై దాడి చేసి లాక్కొని వెళ్తున్నాయని తెలిపారు… ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.. ప్రత్యేక అధికారి గారు తక్షణమే చర్యలు తీసుకుని వీధి కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు రాజా రమేష్ యాదవ్, నరేష్ రెడ్డి, సందీప్ రాజ్, జహీర్, అజయ్ స్వామి, అల్లాడి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

కోహీర్ మున్సిపాలిటీలో మార్పేది.!

కోహీర్ మున్సిపాలిటీలో మార్పేది?

◆: కొత్త మున్సిపాలిటీకి కమిషనర్ కరువు

◆: నెల నుంచి ఆగిన ఆన్లైన్ సేవలు

◆: అయోమయంలో పట్టణ ప్రజలు

◆: పట్టించుకొని అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్,గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడిన పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో ఈ సంవత్సరం జనవరి 27న మున్సిపాలిటీగా ప్రకటిం చారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధి కారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జనవరి 28న ఉమామ హేశ్వర్రావు కోహీర్ పట్టణ తొలి మున్సి పల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిం చారు. కానీ ఆయన ఫిబ్రవరి 16 వరకు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించా రు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయ కపోవడంతో మున్సిపల్ అధికారులు సహితం ఇబ్బందులు పడుతున్నారు. కొత్త మున్సిపాలిటీ అయిన ఐదు నెలల్లో నలుగురు కమిషనర్లు ఇక్కడకు వచ్చి చేసే దేమీలేక తిరిగి వెళ్లారు. ఉమామహేశ్వర్ రావు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 16 వరకు కోహీర్ కమిషనర్గా విధులు నిర్వహించారు. తర్వాత వెంకట్రెడ్డి మార్చి 18వ తేదీ వరకు కార్యాలయ విధులకు హాజరయ్యారు. ఆయన బదిలీ కావడంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ బాధ్యతలను చేప ట్టారు. కానీ అతడు కూడా మార్చి 4వ తేదీ వరకు మా త్రమే ఇక్కడ పని చేశారు. తాండూర్ వెళ్లిపోవడంతో కొత్త కమిషనర్ గా ప్రకాశ్ విధుల్లో చేరారు. అతడిని కూడా సీడీ ఎంఏ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు ఉత్త ర్వులు జారీ చేశారు. కొత్త కమిషనర్ వచ్చే వరకు లోనే విధులు నిర్వహించాలని మౌకికంగా సూచించారు. కానీ ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఆయన మాత్రం జూన్ 4న దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో నెల గడిచినా కొత్త కమిషనరు నియమించలేదు. దీంతో పట్ట ణంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లపై మురుగు, రోడ్ల పక్కన చెత్త కనిపిస్తున్నది.

నిలిచిన ఆన్లైన్ సేవలు

కోహీర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వ హించిన ప్రకాశ్ జూన్ 4వ తేదీన హైదరాబాద్ కార్యాల యానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్క ఆన్లైన్ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త కమిషనర్ వస్తేనే అతడి కీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రారంభమవుతుంది. కానీ పట్టణ ప్రజలు పత్రాల కోసం నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిస్సా హయ స్థితిలో ఉన్నారు. వారు కేవలం పారిశుధ్యం, ఇంది

అభివృద్ధికి నోచుకోని కోహిర్ .

అభివృద్ధికి నోచుకోని కోహిర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడ్డ పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21 వేలకు పైగా జనాభా ఉండడంతో జనవరి 27న మున్సిపాలిటీగా ప్రకటించారు.

మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురు చూపులు తప్పడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి జనార్దన్ రెడ్డి.!

విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి జనార్దన్ రెడ్డి గారికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు నివాసి విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ కేతిరెడ్డి జనార్దన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా చిత్రపటానికి నివాళులర్పించి వారి కుమారులైన
ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధుకర్ రెడ్డి, అభ్యాస్ హైస్కూల్ కరస్పాండెంట్ నరేష్ రెడ్డి గార్లను పరామర్శించారు.
చాలాకాలం ఉపాధ్యాయులుగా ఎంతో నిబద్దతతో పనిచేసి చాలామంది విద్యార్థినీ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో జనార్దన్ రెడ్డి గారు కృషి గొప్పది అని ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేశార
ఈ కార్యక్రమంల తొర్రూరు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు మండల మాజీ జెడ్పిటిసి & జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఎనిమినేని శ్రీనివాసరావు, ధరావత్ జై సింగ్, రాయిశెట్టి వెంకన్న,
బోలగాని వెంకన్న పాల్గొన్నారు.

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు

కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీతో ప్రజల కష్టాలు తెర్చే అధికారులే లేరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ కొత్తగా మునిసిపాలిటీగా ఏర్పడిన తర్వాత అధిక సమస్యలు ఎదుర్కొంటున్న కోహిర్ ప్రజానీకం సమస్యలు చెప్పుకోవడానికి మున్సిపాలిటీ అధికారులు దిక్కులేరు,, వీధిలైట్లు లేక,,, మురికి నీరు నిండి వివిధ రోగాల బారిని పడుతున్న ప్రజలు,, బర్త్ సర్టిఫికెట్లు,, డెత్ సర్టిఫికెట్లు రాక,, రోడ్లు గుంతల మయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్న,, ప్రజల ఇండ్లు రికార్డులో ఒకరి పేరు ఆన్లైన్లో ఇంకొకరి పేరు ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను చెప్పుకుందాం అని వెళితే అధికారులు దిక్కులేరు టిపిఓ టౌన్ ప్లాన్ ఆఫీసర్ నియమితులై ఎన్నో రోజులు గడుస్తున్న ప్రజలకు అందుబాటులో లేకుండా కనీసం సమస్య తెలపటానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రతిస్పందన లేకుండా ప్రజల ఫోన్ నెంబర్లను బ్లాక్ లిస్టులో వేస్తూ వాట్సాప్ లో సమస్యల గురించి విన్నవించుకున్న నిమ్మకు నెరెత్తినట్టు ప్రజల కష్టాలను తీర్చడమే లేకుండా ఇంకా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఇలాంటి అధికారుల పైన కోహిర్ మున్సిపల్ కమిషనర్ ,,, జిల్లా కలెక్టర్,, CDMA కమిషనర్ చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను సస్పెండ్ చేసి ప్రజలకు సేవ చేసి అధికారిని నియమించవలసిందిగా ప్రజల విజ్ఞప్తి  చేస్తున్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి.

మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి పాలన గాడి తప్పిందన్నారు. ఫుల్ టైం కమిషనర్ లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. విలీన గ్రామాలలో వీధిలైట్లు వెలగక పోవడంతో బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అంతేకాకుండా దోమలు రాత్రి వేళల్లో స్వ్యేరా విహారం చేయడం వలన కంటిమీద కునుకు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా విష జ్వరాల బారిన పడకుండా తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని, సైడ్ కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాఖ మహాసభలు జూన్ 21 నుండి 29 వరకు జరుగుతాయని, జూన్ 30న మున్సిపాలిటీ కేంద్రంలో మండల మహాసభ జరుగుతుందని,ఈ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం సిపిఐ నాయకులు కాసు సాయిచరణ్, ఎస్కే ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఉద్యోగస్తులను ప్రశంసించిన కమిషనర్.

జమ్మికుంట మున్సిపాలిటీ ఉద్యోగస్తులను ప్రశంసించిన కమిషనర్ ఎండి ఆయాజ్
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రాపర్టీ టాక్స్ 100% వసూల్ చేశారని రాష్ట్రస్థాయిలో 139 మున్సిపాలిటీల కంటే ముందంజలో జమ్మికుంట మున్సిపాలిటీ ఉందని కమిషనర్ ఎండి ఆజాద్ కూ ప్రశంస పత్రాన్ని అందజేశారు ఇట్టి ప్రశంసా పత్రం నాకు రావడానికిఇట్టి నా తోటి ఉద్యోగస్తులే కారణమని ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా సిద్దూరి సంపత్ రావు,కడెం ఉపేందర్, మొగిలి అలియాస్ (గోవిందా) ప్రవీణ్ రెడ్డి ఈ నలుగురు నాలుగు పిల్లర్లు లాగా నిలబడి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి సపోర్ట్ గా నిలబడి ఈ వసూల్ కార్యక్రమంలో వారి వంతు వారు కృషి చేశారని ప్రశంసించి అందులో భాగంగా సిద్దూరి సంపత్ రావును బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద ప్రశంస పత్రాన్ని అందజేస్తూ శాలువాతో సన్మానించారు తోటి ఉద్యోగస్తులు అందరికీ కూడా అభినందనలు  తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version