సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయిపై దాడి నిందనిరసన…

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి- అనిల్ బెజ్జంకి

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, ఎమ్మార్పిస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు మాట్లాడుతూ అక్టోబర్7, 2025న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డారు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనాగరికమైంది ఈదాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈదాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అందువల్ల దేశ ప్రజలందరూ ఈదాడిని ఖండించారని, దళితుడైన బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అహం పూరితంగా ఈదాడికి తెగపడ్డారని, ఈదాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే దాడి వెనుకున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈడిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో
తునికి వసంత్ మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, కనకం అంజిబాబు మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, చిలుముల రాజయ్య మాదిగ, ఎల్కపెల్లి పౌలు మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, బొద్దులవాని మాదిగ, దండు అంజయ్య మాదిగ, అంతడుపుల సంపత్ మాదిగ, అలువాల సంపత్ మాదిగ, రేపాక బాబు మాదిగ, అంబాలా మధునయ్య మాదిగ, కనకం నరేష్ మాదిగ, శనిగరపు కొమురయ్య మాదిగ, కనుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, కళ్లెపెల్లి కొమురయ్య మాదిగ, అన్నీవేణి కౌసల్య, దేవసాని ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు

ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.

ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో గత 20 ఏండ్ల నుండి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో “మా ఊరి సంత” పేరుతో నిర్మించిన కూరగాయల రేకుల షేడ్లు, మూత్రశాలలను గురువారం జేసీబీ సాయంతో కూల్చివేసే క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడిన విషయం విధితమే.
ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం మండల కేంద్రానికి చేరుకొని కూల్చివేతలు చేపట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగడి నిర్వహించుకునే ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు, అలాగే వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముకునే వారికి సౌకర్యవంతంగా ఉండేలా షెడ్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే, ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎటువంటి ముందస్తు నోటీసులు,పర్మిషన్ లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరైన పద్ధతి కాదని,ప్రజల ఆస్తిని కూల్చివేసిన వారి పై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్, ఐలోని రామచంద్ర రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి,గంజి జనయ, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,మామిండ్ల సాంబయ్య,రాజిరెడ్డి,మల్లారెడ్డి,జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటుగౌడ్ ,వాజిద్ ,సింహాచలం ,కొమురయ్య,శ్రీనివాస్,యాకయ్య,రఘు,తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version