తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
పైడిపెళ్లి రమేష్ బిసి జేఏసీ జిల్లా ఛైర్మెన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ
42% బీసీ రిజర్వేషన్
రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 4 ద్వారా మార్చి 2020లో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేస్తున్నాం
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జర్నలిస్టులపై ఎమ్మెల్యే మాటలను ఖండిస్తు.

జర్నలిస్టులపై ఎమ్మెల్యే మాటలను ఖండిస్తున్నా

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జర్నలిస్టు సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్లో లో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ…
  భూపాలపల్లి నియోజకవర్గం లో రాజకీయ నాయకులకు , అధికారులకంటే భిన్నంగా ఎటువంటి ఆశ ఆశయాలు లేకుండా వేతనాలు లేకుండా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుపోతున్న పత్రిక ,మీడియా సోదరులపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడిన మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూన్న .ఈరోజు మీరు అధికారంలోకి రావడానికి అదే అవమానించబడ్డ మీడియా కారణమని మీకు తెలియజేస్తన్నా జర్నలిస్టు సోదరులు లేకుంటే మీరు చేసిన ప్రోగ్రాములు మీరు చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేవా అని అడుగుతా ఉన్నా మరి ఏ ఆశ లేకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వానైనా ఎండైనా ఏ సమయంలోనైనా వెనకకుంట జనకకుండా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను అధికారుల దృష్టిలకు నాయకుల దృష్టికి తీసుకువచ్చి అట్టి సమస్యలను పరిష్కార దిశగా ఈరోజు జర్నలిస్ట్ సోదరులు చేస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే పదవి కంటే ఎక్కువ సేవ ఈరోజు మీడియా సోదరులు చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే
గండ్ల సత్యనారాయణ రావు జర్నలిస్టు సోదరులకు బహిరంగ క్షమాపణ  చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి బొజ్జాపెల్లి మహర్షి,రేణుకుంట్ల అరవింద్, బచ్చల చిరంజీవి,గుర్రం నాగరాజ్ లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version