గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి

భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో వై సునీల్ రావు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎలక్షన్లు బిజెపి బలపరిచిన అభ్యర్థులు గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి గ్రామం పంచాయతీలలో ఒక చీపురు కట్ట కొనాలన్న కేంద్ర నిధులను తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు అభివృద్ధి కొరకై వేల కోట్ల నిధులు ఇస్తున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సొంతంగా ఫండింగ్ పెడతానని ప్రజలకు తెలియజేయుతున్నారు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పైసలు ఇచ్చే ప్రభుత్వం లో పనిచేస్తున్న కార్యకర్తలను మీ సర్పంచి అభ్యర్థుల గెలిపించుకోండి ఇలాంటి ఒక రూపాయి ఇవ్వని అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాలు అభివృద్ధికి కుంటుపడుతుందని మేము కోరడం జరుగుతుంది కావున మా అభ్యర్థులు గెలిపించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యుడు ప్రత్యేకమైన నిధులతో చెరువతో మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు,జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహారాజు, గొడుగు వినోద్, మాడుగురి సమ్మిరెడ్డి, లింగారెడ్డి ,ముత్యాల రవీందర్, కొండల్ రెడ్డి, ఎల్లా గౌడ్, దాట్ల వీరస్వామి, పార్లపల్లి స్వామి, దసారపు అశోక్, మోటం శ్రీనివాస్, కంకల సంతోష్, మడికొండ వెంకటేష్,చేతి వెంకటేశ్వర్లు, పత్తి శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, తోడేటి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version