ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోపాల్ బుధవారం మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏడాదికి 125 రోజులు పని దినాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, తెర వెనుక మాత్రం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
