మేడారానికి “యునెస్కో” గుర్తింపు మంత్రి సీతక్క తోనే సాధ్యం…..

మేడారానికి “యునెస్కో” గుర్తింపు మంత్రి సీతక్క తోనే సాధ్యం…..

మేడారం జాతర విజయవంతంలో మంత్రి సీతక్క కృషి ఎనలేనిది…

* కలెక్టర్, ఎస్పీ మరియు అధికారులందరికి అభినందనలు….

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట నేటిధాత్రి

 

 

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర మునిపెన్నడూ లేని విధంగా విజయవంతమైందని జాతర విజయవంతం కావడంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క కృషి ఎనలేనిదని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళ వారం స్థానిక విలేఖరులతో సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి వందల కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి బావితరతరాలకు గుర్తుండే విధంగా వేయి సంవత్సరాల చరిత్రను నిర్మించిన మహనీయురాలు మంత్రి సీతక్క అన్నారు జాతర నిర్వహణలో మంత్రి సీతక్కకు వచ్చిన మంచి పేరును తట్టుకోలేని కొందరు రాజకీయ కుట్రలకు పాల్పడడం విచారకరమన్నారు ప్రపంచ దేశాల నుండి భక్తులు వచ్చి మేడారం జాతర అద్భుతం అని కితాభిస్తుంటే స్థానిక ప్రతిపక్షాలు జీర్నించుకోలేకపోతున్నాయన్నారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా సీతక్క ప్రతిష్టను తగ్గించలేరన్నారు మేడారం జాతరపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాను మరియు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు దుష్ప్రచారం చేసే వ్యక్తులు లేదా వ్యవస్థల పట్ల తాము క్షమా గుణం కలిగి ఉన్నా సమ్మక్క సారలమ్మలు వారికి తగిన శాస్తి చేస్తారని అన్నారు రాబోయే రోజుల్లో మేడారం జాతరకు యూనిస్కో గుర్తింపు తీసుకురావడం సీతక్కతోనే సాధ్యమని సాంబశివరెడ్డి అన్నారు పదిహేను రోజులపాటు కారోబార్ నుండి కలెక్టర్ వరకు వేలాదిమంది సిబ్బంది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ అహర్నిశలు కష్టపడి పనిచేసి మేడారం మహ జాతరను విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరున అభినందనలు తెలిపారు

మేడారం తల్లులను దర్శించుకున్న పెద్ది స్వప్న

మేడారం తల్లులను దర్శించుకున్న పెద్ది స్వప్న

నల్లబెల్లి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది సప్న సుదర్శన్ రెడ్డి శుక్రవారం మేడారం మహా జాతరలో వన దేవతలు సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర,అడవి తల్లి ఒడిలో జంపన్న వాగు ఒడ్డున వెలసిన సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకున్నట్లు తెలిపారు.అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకోవడం మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తోందని పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version