జీవితంపై విరక్తితో ఆత్మహత్య…

జీవితంపై విరక్తితో ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నవంబర్ 23: జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గొయి లో చోటు చేసుకున్నట్లు ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఎల్గొయి లావణ్య భర్త వెంకట్ అనే మహిళ తన కూతురు అనారోగ్యం పాలై న్యూమోనియా వ్యాధికి హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన సొంత కూతురు చనిపోయిందన్న బాధతో మానసికంగా కృంగిపోయి జీవితం పై విరక్తితో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి భర్త బోయిని వెంకట్ తండ్రి విట్టల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవా పంచనమనిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పటేల్ తెలిపారు.

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు..

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు

 

సన్న బియ్యం కంపెనీలో 90% ఖర్చును భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి గారి ఫోటో రేషన్ కార్డు పై లేకపోవడం విడ్డూరం
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట.వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో విచిత్రంగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వం పై మహేందర్రెడ్డి విమర్శలు చేశారు.

ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల పోటో ఏంటి. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి రేషన్ కార్డ్ పై తన ఫోటో ముద్రించుకొని ప్రజలకు ఎలా ఇస్తాడు. అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార కుందూరు మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.

దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇలా తలతిక్క పనులు చేయకుండా చూడాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. అని మహేందర్ రెడ్డి అన్నారు.

రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం రైతు భీమా ప్రచారం..

రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం రైతు భీమా ప్రచారం

*రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పడం లేదు
*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట( నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ రైతులందరూ రైతు బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుచున్నారు. ఇది చాలా ప్రయోజనకరమైన విషయమని ఇలా తెలియజేసినందుకు రైతులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతి నిధి తెలిపారు. కానీ రైతులకు అవసరమైన నీళ్ల గురించి ఎమ్మెల్యే స్పందించకపోవడం చాలా ఆస్యాస్పదంగా ఉందని మహేందర్ రెడ్డి విమర్శించారు. రైతులు చనిపోయిన తర్వాత ఇచ్చే రైతు బీమా కంటే రైతుల జీవితాలు ఎంతో విలువైనవని ఎమ్మెల్యే ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించి అధికారులను పురమాయించి నీళ్లు వచ్చే విధంగా పనిచేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుందని ఇప్పటికైనా ఎమ్మెల్యే మేల్కొని దేవాదుల ప్రాజెక్టు కాలువల ద్వారా నీళ్లు నియోజకవర్గం లోని అన్ని చెరువులను నింపే విధంగా పనిచేయాలని యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని లేదంటే రైతులు లక్షల రూపాయలు వెచ్చించి వేసుకున్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వెంటనే ప్రభుత్వం స్పందించాలని మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అతి త్వరలోనే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం రైతుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో జరుగుతుందని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version