మిత్రబృందం చేయూతగా నిలిచిన స్నేహితులు

ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి చేయూతగా నిలిచిన మిత్రబృందం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంతెన శ్రీనివాస్ మరణించడంతో వారి బాల్య మిత్రులు 1991 టు 1992 బాయ్స్ హై స్కూల్ మిత్రులందరు శ్రీనివాస్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. మిత్రులు అందరూ కలిసి శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు శ్రీనివాస్ కుటుంబానికి శుక్రవారం అందజేశారు.కష్ట కాలంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని వారి వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి కష్టాల్లో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మిత్రులందరికీ తెలియజేశారు ఇకముందు కూడా శ్రీనివాస్ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్న మిత్రుల సహాయంతో సహాయ సహకారాలు అందిస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి

మహాదేవపూర్ అక్టోబర్ 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామం బెగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాధిత కుటుంబాన్ని శుక్రవారం రోజున మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పరామర్శించారు. మండలంలోని బెగులూర్ గ్రామానికి చెందిన శంకర్అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన అనంతరం ఆయనకు పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం…

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం

జైబీసీ జైజై బీసీ

బీసీల ఐక్యత వర్ధిల్లాలి

శాయంపేట నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 18న శనివారం రోజున రాష్ట్ర (జిల్లా) బంద్ ను విజయవంతం చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బందును పరిపూర్ణంగా సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ ,గ్రామ కమిటీ, మండల యువజన, సంఘం, మహిళా సంఘం అందరూ పాల్గొని విజయవంతం చేసి బీసీల లందరూ సత్తాచాటాలి.

మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు.

#నివాళులు అర్పించిన ఎం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సాంబయ్య మాట్లాడుతూ దొరలకు వ్యతిరేకంగా భూస్వాములపై పోరాటం చేసి పెత్తందార్ల గుండెల్లో మనకు పుట్టించి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి ఓంకార్ అలాంటి వ్యక్తి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని యువకులు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్త నాగరాజు, సుభాష్, సుదర్శన్, వెంకటయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్…

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక విమలక్క ,రైతు కూలీ సంఘం (ఆర్ సి ఎస్), ఏఐఎఫ్టియు లు
సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ…
గడిచిన డెబ్బై ఎనిమిదేండ్ల భారత దేశ స్వాతంత్రంలో శోషిత జనసమూహానికి ఏమీ న్యాయం జరకపోగా ఇంకా పీడితులుగా మిగిలిపోయారనీ,కేంద్రంలోని భాజపా సర్కారు మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటూనే వస్తుందనీ,పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉన్నారనీ,దేశంలో భాజపా సర్కారు ఇప్పటికీ కుల గణన జరపకుండా న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లను బీసీ,ఎస్ సి,ఎస్ స్టీ, మైనార్టీలకు అందకుండా చేస్తున్నదనీ,భాజపా సర్కారు కూలాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ డబ్లూ ఎస్ రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు అన్యాయం చేసిందనీ,
ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలైన గడిచిన డెబ్బై ఏళ్లుగా ఎన్నికల తంతులో ఇచ్చిన బూటకపు హామీలు ప్రజలని మభ్యపెట్టడానికేనని,అయితే తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్ లను ప్రవేశపెట్టిందనీ,దీని కోసం జీఓ 9 తీసుకొచ్చిందనీ,కేంద్రానికి ఆర్డినెన్సు కూడా పంపిందనీ,భాజపా సర్కారు ఫాసిస్టు పాలనలో బీసీలను అణచడం కోసం బీసీ ఆర్డినెన్సును అడ్డుకుందనీ,
తక్షణమే బీసీ ల 42 శాతం బిల్లును షెడ్యూల్డ్ 9 లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని, ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేస్తుందనీ,ఈ నెల 18 న జరిగే బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రగిరి శంకర్ తెలిపారు.

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ సత్కారం

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది…ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయరాదని ఉన్న జీవోను రద్దు చేయించి ముగ్గురు పిల్లలు ఆ పైన ఉన్న కూడా స్థానిక సంస్థల పోటీ చేయొచ్చు అనే జీవోను ఇప్పించినందుకు గాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో *చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండెపరెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మట్టికి రవీందర్, *సీనియర్ నాయకులు సిరిపురం కుమారస్వామి ,కొర్రి సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.

బీసీ బందుకు మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి

బీసీ బందును విజయవంతం చేయాలి రవి పటేల్

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

టి ఆర్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో టి ఆర్పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ
తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గండు కర్ణాకర్ సామర చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

అక్షర హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటేకి ఎంపిక

ఎస్జిఎఫ్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన అక్షర విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి కరాటే పోటిల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అక్షర హైస్కూల్ ఇ/మీ గుండి-గోపాలరావుపేట విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచి రాష్టస్తాయికి ఎంపిక అయ్యారు. గుంటి శ్రీనిది, తూడి అకరలు ప్రథమ బహుమతి, తూడి ప్రకాయ్, కమటం అద్వైత రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ మినుగుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులను అక్షర హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మినుకుల రాధ, కరాటే మాస్టార్ సుంకెరాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తదితరులు అభినంధించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనిటి మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ, మునీర్, మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ మరియు తదితరులులతో కలిసి శ్రీరామ్ నగర్ బస్తీలోని మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,నాయకులు కృష్ణ ,బాబు ,నర్సింలు ,యువ నాయకులు మిథున్ రాజ్,ఫిర్దోస్ ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు..

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు…

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు

కేంద్రంపై ఒత్తిడి చేద్దాం
రిజర్వేషన్లు సాధించుకుందాం
కదలిరండి బీసీ బిడ్డలారా

కేసముద్రం/ నేటి దాత్రి

 

వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు.
శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ జయశంకర్ కన్వీనర్‌గా ముక్క యుగంధర్ నియామకం

ఎన్ఎస్ఎస్ జయశంకర్ జిల్లా కన్వీనర్ గా ముక్క యుగేందర్ నియామకం.

చిట్యాల, నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ముక్క యుగంధర్ ను ను ఎన్ఎస్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా నియమించినట్లు ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. శుక్రవారం రోజున యుగేందర్ పూర్వపు కన్వీనర్ ప్రసన్నకుమార్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని, ఉత్సాహంగా రానున్న రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా కన్వీనర్ రాంబాబు, జనగాం జిల్లా కన్వీనర్ జంబు, ములుగు జిల్లా కన్వీనర్ ప్రసన్నకుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన…

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్లో సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, శుక్రవారం మధ్యాహ్నం జర్నలిస్టులు ఊరేగింపు నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని, అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

అసెంబ్లీ టైగర్… ఓంకార్ 17వ వర్ధంతి సభ…

అసెంబ్లీ టైగర్… ఓంకార్ 17వ వర్ధంతి సభ

ఎం సి పి ఐ యు, ఏఐ సి టియుసి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం జ్యోతిరావు పూలే సెంటర్లో ఎంసిపిఐయు పార్టీ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ వర్ధంతి సభను ఎం సి పి ఐ యు- ఏఐసిటియు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలను వెన్ను ఎల్లయ్య, బొల్లోజు రామ్మోహన చారి లు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు -ఏఐసీటియు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ ఓంకార్ భూమి కోసం, భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములపై, పెత్తందారులపై ,నిజాం దొరలపై పోరాడిన ధీరుడు అని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఓంకార్ అని ఆయన కొరియాడారు. పేదల పక్షపాతి ప్రజా సమస్యలపై ధారాళంగా గలమెత్తిన ఆయనను అసెంబ్లీ టైగర్ అని పిలిచేవారని ఆయన అన్నారు.ఓంకార్ ఐదు సార్లు నర్సంపేట నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన మీద కత్తిపోట్లు ,నాటు బాంబులు, తుపాకి తూటాలకు గురైన మృత్యుంజయడని ఆయన అన్నారు.ఓంకార్ శ్రామికుల శ్రమజీవి, బహుజనుల స్వప్నం, పోరాటాల యోధుడు ఆయన నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శప్రాయుడని ఆయన అన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతంతో, కమ్యూనిస్టు ఆశయంతో,వామపక్షాల ఐక్యత, సామాజిక శక్తుల సమీకరణ నే కర్తవ్యం గా భావించినాడని ఆయన అన్నారు. ఆర్థిక ,రాజకీయ, సామాజిక, సమానత్వ సాధనకు సాధికారతకు ఆయన పోరాట గొంతు కానీ, శ్రామిక వర్గాల ఆశాజ్యోతి ,సమస్త ప్రజల సమానత్వమే ఆయన నినాదం అని ఆయన అన్నారు .ఆయన ఆశయ స్ఫూర్తితో నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేయాలని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ధారావతు రమేష్, నేరడ వీరస్వామి, గుగులోతు రాజు, ధారావత్ వీరన్న, గుగులోతు చిన్నరాజు ,ఉప్పలయ్య, పందుల ఎల్లమ్మ ,వల్లందాస్ పుష్ప, శ్రీను, సమ్మయ్య ,బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి..

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వి.పి.ఓ వ్యవస్థ కల్గి ఉండాలి

పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు జిల్లా ఎస్పీ డివిజన్ పోలీస్ అధికారులు సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా పని చేయాలని ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు.
దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు వారు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. స్టేషన్ల పరిధిలోని రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అక్రమ కార్యకలాపాలు అయిన గుట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పిడిఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.ప్రజల నుండి వచ్చే సమస్యలను తెలుసుకుని ఏ రకంగా పరిష్కరించాలనే విషయంలో గ్రామ పోలీస్ అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, న్యాయం వైపు పని చేస్తూ బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పని చేయాలన్నారు.వి.పి. ఓ లు ప్రతి గ్రామని సందర్శించి గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచేటట్లు వారికి అవగాహన కల్పిచాలన్నారు.ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

వీధి కుక్కలకు వింత రోగం….. భయాందోళనలో స్థానికులు…

వీధి కుక్కలకు వింత రోగం….. భయాందోళనలో స్థానికులు

పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో మరియు పలు గ్రామాల్లో వీధి కుక్కలకు వింత రోగం సోకిం దని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ వీధికి వెళ్లిన కుక్కలకు చర్మము ఊడి నల్లటి మచ్చలతో దర్శనమి స్తున్నాయి దద్దుర్లు లేచి దుర దతో కుక్కలకు పుండ్లు నీరు కారడంతో ఈగలు దోమలు వాలి ఇండ్లలోకి వస్తున్నాయని కుక్కలకు సోకిన ఎలర్జీ చర్మ రోగం మనుషులకు సోకే ప్రమా దం ఉందని ప్రజలు భయభ్రాం తులకు గురవు తున్నారు.

గ్రామపంచాయతీ పరిధిలో అధిక శాతం వీధి కుక్కలకు చర్మవ్యాధి సోకింది, పలు గ్రామాల్లో గుంపులు గుంపులు గా స్వేరవిహారం చేస్తున్నాయి. తీవ్రమైన చర్మ వ్యాధికి సోకి కుక్కలు మృత్యువాత పడు తున్నాయి వ్యాధిన బారిన పడిన కుక్కలు, మరొక్క కుక్కలు కలిసి ఆహారాన్ని తిన్న, వేరొక ద్రవపదార్థాలను తీసుకుంటే వాటికి కూడా వ్యాధి సోకుతున్నట్లు స్థానికు లు చెబుతున్నారు. అవి సంచ రించే ప్రాంతాల్లో దమ్ము, ధూళి గాలి తాకిన జనాలకు ఈ వ్యాధి వ్యాపిస్తుందని కొందరు భయపడు తున్నారు.పరిస్థితి విష మిం చిన పశు వైద్యాధి కారులు, పంచాయతీ అధికా రులు ప్రజాప్రతినిధులు పట్టిం చుకున్న దాఖనాలు లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ అధికారులు, పారిశుద్ధ్యం, శానిటైజర్ పై ప్రత్యేక చొరవ చూపాలని కుక్కలకు పశు వైద్య అధికారులు సూచనలు సలహాలతో నివారణ చర్యలు చేపట్టి, ప్రజల ఆరోగ్యం కాపా డాలని మండల ప్రజలు కోరు తున్నారు.

ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది…

ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది

-ఆర్థిక సహాయం అందజేసి ఉదారతను చాటుకున్న విద్యుత్ ఉద్యోగులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి విద్యుత్ సెక్షన్ లో ఆన్ మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న జన్నే అనిల్ (అంజి) గత మూడు నెలల క్రితం విద్యుత్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగులగా..ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ..తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాలాడుతూ గత 11 రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది శుక్రవారం మృతుడు అంజి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 27,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ 327 జిల్లా నాయకులు జక్కు రాజేందర్ గౌడ్, పి ఆర్ వి కె ఎస్ జిల్లా నాయకులు గూగులోతు శ్రీనివాస్ నాయక్, ఫోర్ మెన్ యాదగిరి, లైన్ మెన్ లు, మచ్చ సత్యం, శ్రీనివాస్, అనిల్, మోత్కూరి రాములు, ఆర్టీజన్ కార్మికులు, ఆన్ మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్డర్స్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version