మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు.

#నివాళులు అర్పించిన ఎం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సాంబయ్య మాట్లాడుతూ దొరలకు వ్యతిరేకంగా భూస్వాములపై పోరాటం చేసి పెత్తందార్ల గుండెల్లో మనకు పుట్టించి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి ఓంకార్ అలాంటి వ్యక్తి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని యువకులు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్త నాగరాజు, సుభాష్, సుదర్శన్, వెంకటయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ టైగర్… ఓంకార్ 17వ వర్ధంతి సభ…

అసెంబ్లీ టైగర్… ఓంకార్ 17వ వర్ధంతి సభ

ఎం సి పి ఐ యు, ఏఐ సి టియుసి ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం జ్యోతిరావు పూలే సెంటర్లో ఎంసిపిఐయు పార్టీ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ వర్ధంతి సభను ఎం సి పి ఐ యు- ఏఐసిటియు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలను వెన్ను ఎల్లయ్య, బొల్లోజు రామ్మోహన చారి లు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు -ఏఐసీటియు కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ ఓంకార్ భూమి కోసం, భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములపై, పెత్తందారులపై ,నిజాం దొరలపై పోరాడిన ధీరుడు అని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఓంకార్ అని ఆయన కొరియాడారు. పేదల పక్షపాతి ప్రజా సమస్యలపై ధారాళంగా గలమెత్తిన ఆయనను అసెంబ్లీ టైగర్ అని పిలిచేవారని ఆయన అన్నారు.ఓంకార్ ఐదు సార్లు నర్సంపేట నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన మీద కత్తిపోట్లు ,నాటు బాంబులు, తుపాకి తూటాలకు గురైన మృత్యుంజయడని ఆయన అన్నారు.ఓంకార్ శ్రామికుల శ్రమజీవి, బహుజనుల స్వప్నం, పోరాటాల యోధుడు ఆయన నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శప్రాయుడని ఆయన అన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతంతో, కమ్యూనిస్టు ఆశయంతో,వామపక్షాల ఐక్యత, సామాజిక శక్తుల సమీకరణ నే కర్తవ్యం గా భావించినాడని ఆయన అన్నారు. ఆర్థిక ,రాజకీయ, సామాజిక, సమానత్వ సాధనకు సాధికారతకు ఆయన పోరాట గొంతు కానీ, శ్రామిక వర్గాల ఆశాజ్యోతి ,సమస్త ప్రజల సమానత్వమే ఆయన నినాదం అని ఆయన అన్నారు .ఆయన ఆశయ స్ఫూర్తితో నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేయాలని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ధారావతు రమేష్, నేరడ వీరస్వామి, గుగులోతు రాజు, ధారావత్ వీరన్న, గుగులోతు చిన్నరాజు ,ఉప్పలయ్య, పందుల ఎల్లమ్మ ,వల్లందాస్ పుష్ప, శ్రీను, సమ్మయ్య ,బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచ్చితంగా పోరాటం చేసి, నాటి భూస్వాముల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరం, ఆమె యొక్క విరోచ్చిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట్ రాణి సిద్దు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version