నర్సంపేట మున్సిపల్ ఎన్నికల బరిలో 120 మంది అభ్యర్థులు
బిఆర్ఎస్, కాంగ్రెస్,భాజపా నుండి అన్ని వార్డుల్లో త్రిముఖ పోటీ
ఎంసిపిఐ(యు) 5 సిపిఎం నుండి ఇద్దరు పోటీ
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికలలో 120 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ తెలిపారు.నామినేషన్ల ముగింపు వరకు 291 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో వివిధ కారణాలతో 66 నామినేషన్లు తిరస్కరణ అయ్యాయి. కాగా మొత్తం 225 ఉండగా నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం చివరి రోజు కావడంతో 105 మంది అభ్యర్థులు వారి వారి నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారు.వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 120 ఎన్నికల బరిలో ఉన్నట్లు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ప్రాటించారు.కాంగ్రెస్ పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు, బిఆర్ఎస్ పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు,భాజపా పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంసిపిఐ(యు) పార్టీ నుండి 1,4,16,19,20, వార్డులల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిపిఎం పార్టీ నుండి 10,23 వార్డులల్లో బరిలో ఉన్నారు.జనసేనా పార్టీ నుండి ముగ్గురు, ఇతర పార్టీల నుండి నలుగురు అభ్యర్థులు, మిగతా మొత్తం మంది స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 120 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చిన బూర్జువా పార్టీలు
ప్రజా సమస్యల పరిష్కారం, రాజకీయ విలువలకై ఎన్నికల్లో ఎంసిపిఐ(యు) పోటీ
ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజాసేవ కోసం ఏర్పడిన రాజకీయాలను వ్యాపారంగా మార్చి లబ్ధి పొందడమే ధ్యేయంగా రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రలోభాలతో పాలక పార్టీలు ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ సమావేశం డివిజన్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన పట్టణంలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాల్సిన పాలక పార్టీలు స్వార్థంతో అధికారం కోసం ఎన్నికల్లో గెలవడానికి విలువలను మరిచి తప్పుడు పద్ధతుల్లో ఓటర్లను ప్రభావితం చేసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు విలయతాండవం చేస్తున్న సమస్యలపై చిత్తశుద్ధిలేని పాలకులు సమస్యలను మరింత పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీతికి నిజాయితీకి రాజకీయ విలువలకు నిలువుటద్దంగా నిలిచిన అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ లాంటి త్యాగదనుల ఆశలు ఆశయాలకు భిన్నంగా పాలక పార్టీలు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజలకు అవసరాలు తీర్చడానికి పోరాడడానికి ఎర్రజెండా నిత్యం పరితపిస్తుందని దోపిడీ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుందని ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా నిలబడుతుందని ఈ క్రమంలో ప్రజా సమస్యలను ఎజెండాగా చేసుకుని రాజకీయ విలువలను కాపాడడానికి ఎంసిపిఐ(యు) నిరంతరం ప్రయత్నిస్తుందని అందుకోసమే మున్సిపల్ ఎన్నికల్లో ఐదు వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజలు ఆదరించి గెలిపించాలని ఆ దిశలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాయబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేల్లి కొమురయ్య, కుసుంబ బాబూరావు,వంగల రాఘసుధ, డివిజన్ నాయకులు కలకొట్ల యాదగిరి, దామ సాంబయ్య, మహమ్మద్ అలీ సాబ్, కర్నే సాంబయ్య, చెక్క వెంకటయ్య, ఏఐసిటియు జిల్లా కోశాధికారి మాశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలను విస్మరించిన పార్టీలను మట్టి కరిపించాలి
ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ
నర్సంపేట,నేటిధాత్రి:
ఓట్లు, సీట్లు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టడం తప్ప పట్టణ సమస్యలపై పాలకపార్టీకి కనీస చిత్తశుద్ధిలేదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ డివిజన్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన పాలక పార్టీలను ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంసీపీఐ(యు) పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కేశెట్టి సదానందం అధ్యక్షతన నర్సంపేట ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాపరంగా పట్టణ విస్తృతి పెరిగిన అభివృద్ధి పరంగా అందుకు తగిన విధంగా లేదని ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. నర్సంపేట పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ప్రచారఆర్భాటం చేస్తున్నప్పటికి ఆచరణలో పట్టణ అవసరాలకనుగుణంగా ప్రణాళిక రూపొందించడంలో వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చిత్తశుద్ధితో అభివృద్ధికి బాటలు వేసే విధంగా నీతిగా నిజాయితీగా పట్టుదలతో పనిచేసే అభ్యర్థులను ఆదరించాలని, డబ్బులు మద్యం ఇతర ప్రలోభాలతో ఓట్లను కొనుగోలు చేసి గెలిచి దోచుకోవాలనే అభ్యర్థులను మట్టికరిపించాలని కోరారు.నీతిగా నిజాయితీగా సమస్యల పరిష్కారానికి పట్టణాభివృద్ధికి తోడ్పడే ఎంసిపిఐ(యు) అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని కార్యకర్తలు అందుకు అనుగుణంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ మాషుక్, పార్టీ పట్టణ నాయకులు మోటం సురేష్, అనుమల రమేష్, బండారి మల్లేష్, సాంబన్న,రవి,రథం తదితరులు పాల్గొన్నారు.
మాదన్నపేట రోడ్డుపై ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మానం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత హై లెవెల్ వంతెనను నిర్మించాలని నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటి సభ్యురాలు వంగాల రాగసుధ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధానదారిపై రాస్తారోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.నర్సంపేట నుంచి మాదన్నపేటకు వైపు వెళ్లే ప్రధాన రహదారి నిర్వీర్యమై ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ రోడ్డుపై నిత్యం మాదన్నపేట,నాగూర్లపల్లె, బాజీపేట చంద్రయ్యపల్లె నల్లబెల్లి వరకు అలాగే సుమారు 10 తండాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారని పేర్కొన్నారు.రోడ్డు వెడల్పు పేరుతో ప్రస్తుతం ఉన్న దారిని చెడగొట్టి రోడ్డు వేస్తామని తారు తీసివేసి అనేక నెలలు గడుస్తున్నా నేటికీ పునర్నిర్మాణం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆరోపించారు.గత రెండు రోజులుగా కురిసిన తుఫానుతో పంటలు కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలకు రైతులను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కర్నే సాంబయ్య పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి , జన్ను అనిల్,గణిపాక బాబు,పద్మ, విజయ,అరుణ, కోమల,అజయ్, రామకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేకల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు తనుగుల అంజి, కార్యదర్శి ఆరేల్లి శివ,రమేష్,ప్రభాకర్ అఫ్జల్,జంపయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి
వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జయప్రదం
వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భారీ నిరసన
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకుంటూ వారిని అణచివేస్తూ ఆ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పాలక పార్టీలు తమ ద్వంద విధానాలను విడనాడాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపెళ్లి రవి, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి డిమాండ్ చేశారు.42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణ ఆధిపత్య పాలక పార్టీల వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర బందులో భాగంగా వరంగల్ పట్టణంలో ఎం సి పి ఐ (యు), సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు పెద్దారపు రమేష్,కొత్తపెళ్లి రవి, ఎలకంటి రాజేందర్,అక్కనపెల్లి యాదగిరి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బిజెపి బీసీల బందుకు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వటానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్, జీవో నెంబర్ 9 లు తీసుకువచ్చి చట్ట పరిధిలో అమలు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ప్రజలు పాలక పార్టీల ద్వంద విధానాలను గమనించి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన బందును జయప్రదం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్షతను విడనాడి తక్షణమే పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు పాలకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా బిసి ఓటర్లు ప్రజలు చైతన్యవంతం కావాలని మేము ఎంతో మాకు అంత వాటా కావాలని నినదిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ నగర నాయకులు సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి న్యూ డెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్ బండి కోటేశ్వర్ జన్నారం రాజేందర్ మాస్ లైన్ జిల్లా నాయకులు చిర్ర సూరి మైదంపాని లిబరేషన్ నాయకులు రవిరాకుల ప్రసంగి జన్ను ప్రవీణ్ అప్పల శంకరాచారి ప్రజా సంఘాల నాయకులు ఐతం నాగేష్ ఎగ్గెని మల్లికార్జున్ మహమ్మద్ మహబూబ్ పాషా అప్పనపురి నర్సయ్య మాలి ప్రభాకర్ నలివెల రవి దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు
కేంద్రంపై ఒత్తిడి చేద్దాం రిజర్వేషన్లు సాధించుకుందాం కదలిరండి బీసీ బిడ్డలారా
కేసముద్రం/ నేటి దాత్రి
వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు. శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి
ఈనెల 11న కలెక్టరేట్ వద్ద ఆందోళన
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కామ్రేడ్ ఓంకార్ పాత్రపై ఈనెల 12న రాష్ట్ర సదస్సు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్రంలో,రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో పేరుకుపోతున్న స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ గందరగోళపరుస్తున్న భారతీయ జనతా పార్టీ తీరు పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.ఎంసిపిఐ(యు) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కార్యదర్శి కామ్రేడ్ మాలోత్ సాగర్ అధ్యక్షతన వరంగల్ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలను మభ్యపెడుతూ కపటనాటకం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు రాష్ట్రంలో వలె షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని డిమాండ్ చేశారు.రాజకీయ స్వార్థం కోసం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించకుండా స్థానిక సమస్యలు పేరుకుపోయే విధంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతున్నారని పేర్కొన్నారు. అందుకని తక్షణమే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు కార్యక్రమాలు చేపట్టాలని అలాగే అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవంలో భాగంగా తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో ఓంకార్ పాత్రపై ఈనెల 12న తొర్రూరులో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 17న వారోత్సవ ముగింపు ప్రదర్శన సదస్సు వరంగల్ పట్టణంలో జరుగుతుందని కాగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 12న జరిగే రాష్ట్ర సదస్సు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, నగర నాయకులు ముక్కెర రామస్వామి, గణిపాక ఓదెలు, మహమ్మద్ మహబూబ్ పాషా, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, తాటికాయల రత్నం, పోలేపాక రవీందర్, దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
యంసిపిఐ(యు) మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులు కామ్రేడ్ విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు,ఎంసిపిఐ(యు) పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.నర్సంపేట ఓంకార్ భవన్ లోఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాజస్థాన్ కోటా తల్వాండిలో అమరత్వం పొందిన పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ శంకర్ ఝా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం పార్టీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అమరజీవి విజయ్ శంకర్ ఝ కార్మిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూనే రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ మోహన్ పునామియాతో కలిసి కీలకమైన బాధ్యతలు నిర్వహించిన గొప్ప మార్క్సిస్ట్ నాయకుడని ఉన్నారు. కామ్రేడ్ ఓంకార్ చూపిన బాటలో బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యత కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఐక్య ప్రజానాట్యమండలి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శులు కన్నం వెంకన్న వంగల రాగసుద, పార్టీ రాష్ట్ర నాయకులు బాబురావు,నాగెల్లి కొమురయ్య, కనకం సంధ్య, జిల్లా నాయకులు మాలోత్ సాగర్,సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం,ఐతమ్ నాగేష్, మాలోత్ మల్లికార్జున్, ప్రభాకర్,ఓదేలు దాసు కుమారస్వామి,నరసయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.