చిలుకమారి శ్రీనివాస్ కు పద్మశాలి సంఘం ఘన సన్మానం

చిలుకమారి శ్రీనివాస్ కు ఘన సన్మానం. పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాదుని సత్యనారాయణ.

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

మొగుళ్లపల్లి గ్రామపంచాయతీ ఎనిమిదవ వార్డు నంబర్ గా గెలుపొందిన శ్రీ చిలుకమారి శ్రీనివాస్ గారిని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం నాయకులు చేనేత కార్మికులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ భీమనాధుని సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ శ్రీనివాస్ గారు వార్డ్ నెంబర్ గా గెలుపొందడం ఆనందదాయకమని మొగుళ్ళపల్లి సమగ్ర అభివృద్ధి కోసం పాలకమండలి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు అలాగే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా చేనేత కార్మికులు పొద్దంతా కష్టపడితే 200 రూపాయల కూడా కూలి గిట్టుబాటు కావడం లేదని కావున రాష్ట్ర ప్రభుత్వం నెలకు 20 వేల రూపాయలు కూలిగిట్టుబాటు అయ్యే విధంగా పనికల్పించాలని ప్రతినెల చేనేత బంధు పథకం కింద ₹2,000 నేత కార్మికునికి కండెల చుట్టే వారికి 500 రూపాయలు గత ప్రభుత్వంఅందించిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా అందించి చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని మరియు 50 నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛను వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరారు

పద్మశాలి సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రభాకర్

పద్మశాలి సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రభాకర్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గణపురం మండల కేంద్రానికి చెందిన కాంబత్తుల ప్రభాకర్ ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మొరలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం లో చురుగ్గా పనిచేస్తున్నందుకుగాను ప్రభాకర్ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో సంఘంలో ప్రాతినిధ్యం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి జిల్లా అధ్యక్షులు ఖ్యాతం సతీష్ కుమార్ , గౌరవ అధ్యక్షులు గోనె భాస్కర్ భీమనాథుని సత్యనారాయణ షేర్ కుమారస్వామి లకు ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ కి సన్మానం..

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ కి సన్మానం

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ పాగాల దేవరాజు ను శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలలో అధ్యక్షులు మెట్టు రాజేందర్ , ఉపాధ్యక్షులు పోతున్న రాజు , క్యాషర్ గోశిక సతీష్, మురళి, శ్రీనివాస్, పాండురంగం, గణేష్ శంకరయ్య, బాలనర్సు , మెట్టు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు

“పద్మశాలి నేతలకు సోమేశ్వర టెక్స్టైల్స్ ఘన సన్మానం”

సోమేశ్వర టెక్స్టైల్స్ అసోసియేషన్ వారి ఘన సన్మానం

 

అధ్యక్షులు : గోరంట్ల కుమారస్వామి

ప్రధాన కార్యదర్శి : వన్నాల ప్రకాష్

పాలకుర్తి, నేటిధాత్రి :

 

అఖిల భారత పద్మశాలి యువజన సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, అఖిల భారత యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కిషోర్ సంఘ సూరత్ కి వచ్చిన సందర్భంగా సోమేశ్వర టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోరంట్ల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి వన్నాల ప్రకాష్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సమాజం అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, సభ్యులు కోట సాగర్, చిల్కమారి సాయిప్రసాద్, కైరం కొండ సురేందర్, జిగిజర్ల రమేష్, కైరం కొండ సత్యనారాయణ, సామల శ్రీనివాస్, కోట అంబదాసు, కుసుమ అశోక్, వెంగల్ దాస్ రవి, పెంటి సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం…

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం

జైబీసీ జైజై బీసీ

బీసీల ఐక్యత వర్ధిల్లాలి

శాయంపేట నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 18న శనివారం రోజున రాష్ట్ర (జిల్లా) బంద్ ను విజయవంతం చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బందును పరిపూర్ణంగా సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ ,గ్రామ కమిటీ, మండల యువజన, సంఘం, మహిళా సంఘం అందరూ పాల్గొని విజయవంతం చేసి బీసీల లందరూ సత్తాచాటాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version