జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనిటి మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ, మునీర్, మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ మరియు తదితరులులతో కలిసి శ్రీరామ్ నగర్ బస్తీలోని మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,నాయకులు కృష్ణ ,బాబు ,నర్సింలు ,యువ నాయకులు మిథున్ రాజ్,ఫిర్దోస్ ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు..

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం –

 

బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.

 

దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటుందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరియు మైనార్టీ వారి పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉందోనని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

 

ఇది వారి వర్గానికి అన్యాయం చేయడమే అవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు.

 

మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా చిన్న చూపు మరియు వివక్ష చూపిస్తుందని జ్యోతి పండాల్ అన్నారు.

 

సెంట్రల్ లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అమలు చేసి అట్టడుగు వర్గాల మైనార్టీ వాళ్ళని ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.

 

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 నాటికే ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 14 లక్షలు పైగా ఇండ్లని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం జరిగింది.

 

అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే డబ్బులు పెట్టుకొని చదువుకో లేని స్థితిలో ఉంటారో వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇలా అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటుంది మా బిజెపి ప్రభుత్వం.

 

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మైనార్టీలను మభ్యపెట్టి ఎలక్షన్ టైం లో వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పైన చిన్నచూపు చూసి వాళ్ళని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ అన్నారు.

 

కావున కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీల పట్ల వివక్షత, చిన్న చూపు మరియు కించపరిచేలా ప్రవర్తించవద్దని జ్యోతి పండాల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version