కల్వకుర్తిలో బీజేపీ నేత హెచ్చరిక

కల్వకుర్తి జిల్లా ప్రకటిస్తే మున్సిపల్ ఎన్నికల్లో నుంచి తప్పుకుంటామన్న బిజెపి నేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తిని జిల్లాగా ప్రకటిస్తే ఆమనగల్ మున్సిపల్ ఎన్నికల్లో, ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆర్డీవో, సబ్ రిజిస్టర్, ఎస్ టి ఓ, ఆర్టీవో కార్యాలయా లను ఏర్పాటు చేస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పోటీ చేయమని బీజేపీ నేత, జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే బీజేపి లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోని కల్వకుర్తి భవిష్యత్తును మార్చాలని తల్లోజు ఆచారి విజ్ఞప్తి చేశారు.

జోరుగా ఎర్రరాయి తవ్వకాలు.. చర్యలెక్కడ..,.

జోరుగా ఎర్రరాయి తవ్వకాలు.. చర్యలెక్కడ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: న్యాల్కల్ మండలం గణేషాపూర్లో
కర్ణాటక వ్యక్తితో కలిసి కొందరు అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు రవాణా చేస్తున్నారు. ఆర్డీవో ఆదేశించినా న్యాల్కల్ తహశీల్దార్ చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులతో పాటు తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన…

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్లో సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, శుక్రవారం మధ్యాహ్నం జర్నలిస్టులు ఊరేగింపు నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని, అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version