ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు…

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అక్కడ నివసిస్తున్న వృద్ధులు తీన్మార్ మల్లన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు మరింత సేవ చేయాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
అనంతరం భూపాలపల్లి జిల్లా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేసి మానవతా సేవను చాటారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ —
ప్రతి సంవత్సరం తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఎల్లవేళలా ప్రజల సేవకే తాము అంకితమని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం తీన్మార్ మల్లన్న గారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ గడపగడపకు పార్టీ నినాదాన్ని తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్‌పీకే సాగర్, జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, బండి సునీల్, సుంకరి సందీప్, జింకల శ్రీను, రొడ్డ శ్రీనివాస్, అనంతుల సంపత్ (బొట్టు), అశోక్, సంతోష్, రంజిత్, నవీన్, సమ్మయ్య, సాయి రాజేందర్, శ్రీధర్, రాంబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని తొలగించాలని

తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని తొలగించాలని

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని వెంటనే తొలగించాలని, అలాగే రెండవ స్థానంలో నిలిచిన గోనే ముకుంద ని సర్పంచ్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, గోనే ముకుంద పార్టీ జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ,
గుండ్రాతిపల్లి గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సమయంలో సమర్పించిన నామినేషన్ అఫిడవిట్, కుల ధ్రువీకరణ పత్రం తప్పుడు వివరాలతో కూడినవని, వాటిని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీ చేసి, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు స్పందిస్తూ,
ఈ అంశంపై తప్పకుండా సమగ్ర విచారణ (ఎంక్వయిరీ) నిర్వహిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని, అలాగే అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రవి పటేల్ తెలిపారు.
అలాగే, ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే,
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న స్వయంగా భూపాలపల్లికి వచ్చి జిల్లా కలెక్టర్ తో నేరుగా మాట్లాడతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పటికీ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ప్రజాపోరాటాలకు దిగుతామని, మీడియా ముఖంగా అధికారులను రవి పటేల్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

భూపాలపల్లి లో టీఆర్పీ నేతల ధర్నా

టి ఆర్ పి నాయకుల ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు భూపాలపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి పటేల్ రోడ్డు మీద బైఠాయించి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ రవి పటేల్ పేర్కొన్నదేమనగా— తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు పాత రిజర్వేషన్ విధానాలకే కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం కాంగ్రెస్ మోసపూరిత ధోరణికి నిదర్శనమని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ సత్తా చాటే సమయం ఇదేనని, ఈ వర్గాల్ని ఒక్కటిగా కలుపుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా ముందుకు సాగుతుందని రవి పటేల్ తెలిపారు. “65 శాతం బీసీలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమూహ బలం కలిసి వస్తే మాత్రమే నిజమైన రాజ్యాధికారం సాధ్యం. ఈ అగ్రవర్ణ పార్టీలు బహుజనులకు న్యాయం చేయవు. కేవలం బీసీల కోసం పుట్టిన పార్టీ మా టీఆర్పీ,” అని అన్నారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ పోటీలో ఉన్నదని, ఆసక్తి ఉన్న వారందరూ తమను సంప్రదించాలని, ఎటువంటి భారీ ఖర్చులేమీ లేకుండానే గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు.
జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బహుజనులు కలసి బుద్ది చెప్పాల్సిన రోజులు వచ్చాయని, పెద్ద ఎత్తున యువత టీఆర్పీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు

మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T152453.123.wav?_=1

 

మృతుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసనకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుడు బొల్లి రాజయ్య పని సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, పని ఒత్తిడి కారణమని కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు అత్యంత బాధాకరం అని అన్నారు మృతుని కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను ఉద్యోగాల నుండి తొలగించాలి అలా అలాగే కలెక్టర్, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు
భూపాలపల్లి మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ఇందిరమ్మ/డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, అలాగే సేఫ్టీ కిట్లు, శానిటైజింగ్ సామగ్రి, యూనిఫామ్‌లు సకాలంలో అందించాలని, వేతనాలు పెండింగ్ కాకుండా విడుదల చేయాలని రవి పటేల్ డిమాండ్ చేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో నేత‌లు అనంతుల సంపత్, ఇనుగాల ప్రణీత్, గట్టు శ్రీకాంత్ పాల్గొన్నారు

బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలు…

బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు వ్యతిరేకంగా అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా
రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మొదటి నుండి బీసీలను కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని చెబుతున్నాడు ఇప్పుడు అదే జరుగుతుంది
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ 9 లో చేర్చడం కోసం కృషి చేయాలి
దానికి మద్దతుగా అన్ని పార్టీలు కూడా ద్వంద వైఖరి వీడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి
బీసీలకు జరుగుతున్న అన్యాయం విద్య ఉద్యోగ వ్యాపార అన్ని రంగాలలో దామాషా ప్రకారం దక్కవలసిన వాటి కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము మా కార్యాచరణ మా చిత్తశుద్ధి తో పనిచేస్తున్నాను ప్రజలు అందరు కూడా గమనించి ఈ రెడ్డి వెలమల పార్టీలను బొంద పెట్టవలసినటువంటి అవసరం ఉంది
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్ గండు కరుణాకర్ తీన్మార్ జై అశోక్ శ్రీకాంత్ కిరణ్ పాల్గొన్నారు

బీసీ బందుకు మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి

బీసీ బందును విజయవంతం చేయాలి రవి పటేల్

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

టి ఆర్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో టి ఆర్పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ
తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గండు కర్ణాకర్ సామర చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్…

తాలూకా వీరశైవ లింగాయత్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,నియోజకవర్గం వీర శైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక బసవేశ్వర ఫంక్షన్ హాల్ లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యవర్గం, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణా కౌలాస్, కార్యదర్శి పద్మజ, స్థానిక లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో జిల్లా నుండి అధ్యక్షులు ఇప్పేపల్లి నరసింహు లు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధి కారి పోలీస్ సంతోష్ పటేల్, యువజన ప్రధాన కార్యదర్శి రామోజీ నవీన్, స్థానిక లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రాజశేఖర్ శెట్కర్, ప్రధాన కార్యదర్శి ఆర్ సుభాష్ సమక్షంలో జరిగిన ఎన్నికలలో జహీరాబాద్ నియోజకవర్గం మండలాల వారీగా కూడా ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా ఆగూర్ శివరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోహీర్ మండలం నుండి బిల్లాపాటి విజయకుమార్, మండల అధ్యక్షునిగా ఎన్నుకోగా మొగడంపల్లి మండల అధ్యక్షులుగా ఎం రా%శీ% శెట్టి, ప్రధాన కార్యదర్శిగా ఎల్ విజయ్ కుమార్ ఝరా సంగం మండల అధ్యక్షునిగా పట్లోళ్ల రవి పటేల్, ప్రధాన కార్యదర్శిగా పొట్లోళ్ల పరమేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన కార్యవర్గానికి అధ్యక్షులు త్వరలో ప్రకటిస్తారని సమావేశం ప్రకటించింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆగూర్ శివరాజ్ మాట్లాడుతూ తనమీద ఉన్న నమ్మకంతో జిల్లా, స్థానిక అధ్యక్ష కార్యవర్గానికి, మండల సభ్యులందరికీ తన ధన్యవాదాలు తెలిపారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్..

భూపాలపల్లిలో ధర్నా, రాస్తారోకో..

లీడర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ)జిల్లా నాయకుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎస్సై సాంబమూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో వెళ్లి ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా లాక్కెళ్లి, అదుపులోకి తీసుకుని వదిలేశారు. ధర్నా సందర్భంగా టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణిచివేయడానికి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించి ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఏం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదని, 42 శాతం రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తమ ద్వంద వైఖరిని ప్రకటిస్తున్నాయన్నారు. 64శాతం ఉన్న బీసీలు తమ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా దొంగ కారణాలు చెప్పి వెనకబడేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో లేదని, కావున ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్పీ జిల్లా నాయకులు కరుణాకర్, చంద్రశేఖర్, సంతోష్, శ్రీను, వెంకన్న, సమ్మయ్య, నవీన్, అక్షయ్, సన్నీ, శంకర్రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T175746.314.wav?_=2

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి.

తీన్మార్ మల్లన్న బిసి జేఏసీ రవి పటేల్.

చిట్యాల, నేటిధాత్రి :

 


 

 

సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో
తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ రవి పటేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూచిట్యాల మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన పంచిని మహేష్ యాదవ్ పైన ఆగస్టు 15 రోజున అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్ భార్య పిల్లలు వారి మామ ఇతరులపై దాడి చేశారని బిసి పొలిటికల్ జేఏసీ నీ కలవడం జరిగింది, మహేష్ పై భౌతిక దాడులు సమంజసం కాదని ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్టడం బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం
గుడికి సంబంధించింది గానీ ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలి గాని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు
మహేష్ యాదవ్ కాల్వపల్లి గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తాడని అక్కస్సుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అగ్రవర్ణాలు అని మా దృష్టికి రావడంతో మహేష్ ను తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ నుండి సర్పంచి అభ్యర్థిగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబెట్టడానికి మేము కార్యచరణ తీసుకొని కాల్వపల్లి లో మహేష్ యాదవ్ ను గెలిపించుకుంటామని
రవి పటేల్ అన్నారు ఈ కార్యక్రమంలో
రోడ్డ శ్రీను ప్రణీత్ వెంకటేష్ అఖిల్ సమిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం
తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది
గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ ట్రాక్ సర్జరీ అవసరం ఉంది అని చెప్పారు
హాజర హాస్పిటల్ dr ఉషిక కిరణ్ యూరలజిస్ట్ తో ఫోన్లో మాట్లాడి సర్జరీకి సహకరించని విజ్ఞప్తి చేశారు
పైడిమల్ల ఐలయ్య గీత కార్మికుడు తడిచేట్టు మీదనుండి పడితే కాలు విరిగింది వారిని చూసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తేలుకోవడం జరిగింది టీం సభ్యుడు నాగరాజు కూతురు లాస్య వికలాంగురాలు కావున పెన్షన్ రావడంలేదని చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మాట్లాడి తప్పకుండా పెన్షన్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది
మెదరమెట్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ స్కూలుకు విద్యార్థులు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలని అలాగే గ్రామ ప్రజలు గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపించాలని పవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్నవారు గునీకంటి విష్ణు కొడారి రాజు గజ్జి కుమారస్వామి కొడారి రమేష్ కొణికటి దీక్షిత్ పెంతల రాజు p రాజేందర్ ఎడకుల సురేష్ పైడిమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version