ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం పది వేల పెన్షన్ అమలు గురించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో ప్రస్తావించాడని, కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కు ముందడుగు పడడంతో శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం పట్టణ అధ్యక్షులు కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ చిత్ర పటానికి ఫలాభిషేకం చేశారు. చాలీచాలని పెన్షన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికలకు ముందు రిటైర్డ్ కార్మికులంతా గడ్డం వంశీకృష్ణ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లడంతో ఎంపీగా ఎన్నికైన సందర్భంగా సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకున్నందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని కుమ్మరి మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మికులు సాతి శంకరయ్య, మెరుగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!

భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

జైపూర్,నేటి ధాత్రి:

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version