కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి… తక్షణం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం మహా ముత్తారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అపరిశుభ్రతగా ఉంటే పరిసరాల్లోకి విష జంతువులు వచ్చే అవకాశం ఉన్నందున, విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అందువల్ల తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫోటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మరియు విద్యుత్ పనులను వెంటనే ప్రారంభించి, బుధవారం నుండి పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరా విషయమై మిషన్ భగీరథ అధికారులు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తనిఖీ అనంతరం
జిల్లా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. హలో స్టూడెంట్స్… ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు వ్రాసారు? ఎలా వ్రాసారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి?” అని అడిగి తెలుసు కున్నారు. మిగిలిన పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ప్రకాష్, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version