పంచాయితీ కార్యదర్శులకు పలు సూచనలు.

పంచాయితీ కార్యదర్శులకు పలు సూచనలు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం ముఖ్య కార్య నిర్వహణాధి కారి నాగలక్ష్మి మండల ప్రజా పరిషత్ గుండాల ను శుక్రవారం సందర్శిం చారు.అనంతరం గుండాల గ్రామములోని వేపలగడ్డ గ్రామం నందు మెయిన్ రోడ్డు ప్రక్కన ఇంకుడు గుంతను పరిశీలించారు. గుండాల గ్రామ పంచాయతి లోని నర్సరి ని సందర్శించి పంచాయతీ కార్య దర్శులకు పలు సూచనలు జారీ చేశారు. అందరూ పంచాయతి కార్య దర్శుల తో ఈజిఎస్. సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశములో ఈజిఎస్,ఎఫ్టీఓ ల జనరేషన్ లో 100 శాతము సాదించాలని సూచించారు. వర్షాకాలంలో నీరు వృధాగా పోకుండా ఇంకుడు గుంతలు ప్రతి గ్రామ పంచాయతి లో ని గ్రామాలకు విరివిగా నిర్మించి అందరూ భూగర్భ జలాలను పెంచాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version