గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కేంద్రం పరిశీలించిన అదనపు కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, హోతి బి గ్రామ శివారులోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చెంద్రశేఖర్ శనివారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డిఓ మహేందర్ రెడ్డి, తహశీల్దార్ దశరథ్, ఎంపీ ఓ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
