కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి… తక్షణం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం మహా ముత్తారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అపరిశుభ్రతగా ఉంటే పరిసరాల్లోకి విష జంతువులు వచ్చే అవకాశం ఉన్నందున, విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అందువల్ల తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫోటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మరియు విద్యుత్ పనులను వెంటనే ప్రారంభించి, బుధవారం నుండి పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరా విషయమై మిషన్ భగీరథ అధికారులు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తనిఖీ అనంతరం
జిల్లా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. హలో స్టూడెంట్స్… ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు వ్రాసారు? ఎలా వ్రాసారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి?” అని అడిగి తెలుసు కున్నారు. మిగిలిన పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ప్రకాష్, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ పాఠశాల అభివృద్ధి పరిశీలన, వ్యవసాయ పరికరాలు పంపిణీ

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం,నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలో గల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు గడ్డం వినోద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు/పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేసేందుకు పంట సాగుకు అవసరమైన వ్యవసాయ అధునాతన పరికరాలను అర్హులైన రైతులకు అందించి పంట దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం ఎస్.ఎం.ఎ.ఎం. 2025-26 లో భాగంగా అర్హులైన రైతులకు యాంత్రికరణ పరికరాలను అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించి రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా లబ్ధి పొందేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version