పొగ కాలుష్యంతో విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం..

పొగ కాలుష్యంతో విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం

బ్లూ బర్డ్స్ పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం

నస్పూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ లోని బ్లూ బర్డ్స్ పాఠశాలలోని సిబ్బంది పాఠశాలలో ఉన్న చెత్తా,చెదారం చెత్తకుండీలో వేయకుండా నిప్పంటించి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు.పాఠశాల సమీపంలో చెత్తను కాల్చడం వల్ల పొగ కాలుష్యం తరగతి గదిలోకి వ్యాపించి విద్యార్థులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.అలాగే పక్కనే ఉన్న రెండు పాఠశాల గదుల్లోకి పొగ వ్యాపించడంతో చలికాలం దగ్గు,జలుబుతో బాధపడే విద్యార్థులకు కళ్ళ మంటలతో,శ్వాస ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.ఇప్పటికైనా పాఠశాలలోని చెత్త,చెదారం కాల్చి వేయకుండా చెత్తను సేకరించి చెత్త కుండీలో వేయాలని కోరారు.

అమ్మో.. కస్తూర్బా గాంధీ.. ఆకస్మిక తనిఖీల్లో షాకైన అధికారులు

అమ్మో.. కస్తూర్బా గాంధీ.. ఆకస్మిక తనిఖీల్లో షాకైన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ కోసం పలు రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కింది స్థాయి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణం, గదులు, మరుగుదొడ్లు, వంట గది ఉన్నాయి. ఆకస్మిక తనిఖీ కి వచ్చిన అధికారులే అక్కడి సమస్యలను చూసి అవాక్కయ్యారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు, ఎంపీడీవో మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామారావు, సాయికిరణ్ సిబ్బందితో కలిసి పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నిర్వహణ లోపం ఉండడం తో పాఠశాల ప్రత్యేక అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు జ్వరాలు వచ్చినా ఎందుకు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తూ అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. అధికారులు పాఠశాల వంటగదిని పరిశీలించగా ఎలుకలు కొరికిన టమాటాలు, కుళ్లిపోయ

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version