కరోనా వర్షాకాల వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు.

కరోనా వర్షాకాల వ్యాధులు సోకకుండా
జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయంలో కాలానుగుణంగా వ్యాపించే వ్యాధులలో భాగంగా మాట్లాడుతూ సాధారణ జలుబు, దగ్గు(commoncold) గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండవలసిందిగా తెలియజేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలని, ప్రయాణాలలో జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్రు లు వాడాలని, అదే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాల్సిందిగా సూచించినారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ కొరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కొరకు వైద్యులను సంప్రదించవలసిందిగా తెలియజేసినారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు కరోనా విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని, చికిత్స తోనే పూర్తిగా నయమవుతుందని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ అవసరం ఉందని, కరోనా నిర్ధారణ కాగానే డాక్టర్ల సూచనలు పాటించాల్సిందిగా, మాస్కులు ధరించాల్సిందిగా, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి తక్కువ స్థాయి లక్షణాలే నమోదవుతున్నాయని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాంటి కోవిడ్ కేసులు నిర్ధారణ కాలేదని ఈ సందర్భంగా  తెలియజేసినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version