సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాట,దీపావళి బోనస్ చెల్లించాలి
ఫిట్ కార్యదర్శి మారేపల్లి సారయ్య
శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:
తమ జీవితకాలంలో దీర్ఘకాలికంగా సంస్థ అభివృద్ధి కోసం పాటుపడి పదవి విరమణ పొందిన పదవీ విరమణ పొందిన గని కార్మికులకు యాజమాన్యం లాభాల వాటా,దీపావళి బోనస్ ను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం (ఎఐటియుసి) ఆర్కే -7 ఫిట్ కార్యదర్శి మారేపల్లి సారయ్య అన్నారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తూ అనారోగ్య కారణాల చేత అన్ఫిట్ అయిన లేదా పదవీ విరమణ పొందిన కార్మికులను యాజమాన్యం గుర్తించి సంస్థగతంగా ఆర్థికపరమైన ప్రయోజనాలను కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.పదవి విరమణ పొందిన కార్మికల సంక్షేమ ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.పదవి విరమణ కార్మికులు నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ యొక్క సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.
