ఇరువైపులా తుమ్మలతో రోడ్డు 

ఇరువైపులా తుమ్మలతో రోడ్డు

కాసిపేట రోడ్డుపై పెరిగిన తుమ్మ చెట్లతో ప్రమాద భయం – తక్షణ చర్యలు కోరుతూ టీబీజీకేఎస్ విజ్ఞప్తి

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 కాసిపేట 2 గనులకు వెళ్లే మార్గంలో ఇరు వైపులా తుమ్మ చెట్లు విస్తృతంగా పెరిగినట్టు టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు గమనించారు. ఈ రోడ్డులో ప్రతినిత్యం వందలాది సింగరేణి కార్మికులు ప్రయాణిస్తుండగా, రోడ్డుపై అడ్డంగా కనిపించకుండా ఉండే పశువులు – ఆవులు, గేదెలు, పందుల వలన ప్రమాదాల అవకాశం ఉందని వారు తెలిపారు.

ఇప్పటికే కొన్ని ప్రమాదాలు జరగగా, మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి తోడు, రోడ్డు ఇరువైపులా వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళ మరింత ప్రమాదకరంగా మారిందని అన్నారు.

ఈ నేపథ్యంలో, జి.ఎం గారిని కలిసిన టీబీజీకేఎస్ నాయకులు తక్షణ చర్యలు తీసుకుని చెట్లను తొలగించి, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

టీబీజీకేఎస్ కాసిపేట 1 కాసిపేట 2 యూనియన్ నాయకులు, టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బెల్లం అశోక్,
కాసిపేట-1 గని ఫిట్ కార్యదర్శి శంకర్,
ఏరియా నాయకులు సొలంగి శ్రీనివాస్,
మాజీ ఫిట్ కార్యదర్శులు బనోత్ తిరుపతి, బిక్షపతి, అఫ్జల్ ఉద్దీన్,
దోమ్మట్టి రమేష్, తోకల రమేష్, బండారి రమేష్,
మైకల్, క్రిష్ణ,
యువ నాయకులు సతీష్ వర్మ, సతీష్ యాదవ్, అందే శ్రీకాంత్, సంగి రవి, రామునూరి రాజేష్, రంజిత్, రవికాంత్, ఎండీ అజీమ్, మహీందర్ తదితరులు.

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరా

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version