సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు…

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు

జైపూర్,నేటి ధాత్రి:

 

సింగరేణిలో సీఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి కమాండెంట్ సంచల్ సర్కార్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిపించారు.విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు అర్పించిన పోలీస్ వీరులకు కమాండెంట్ చంచల్ సర్కార్ నివాళులు అర్పించారు.సెప్టెంబర్ 1. 2024 నుండి ఆగస్టు 31.2025 మధ్యకాలంలో ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మొత్తం 191 పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాలని వారు తెలిపారు. అలాగే అమరవీరులైన పేర్లను చదివి వినిపించి వారి గౌరవం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ బలగాల ధైర్య సహసాలను అంకిత భావాన్ని గౌరవించడం వారి సంక్షేమం దేశ భద్రత పట్ల మన నిబంధతను తెలియజేయడమే మన లక్ష్యము అని తెలిపారు.

సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం…

సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో సిఐఎస్ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్,అసిస్టెంట్ సుధీష్ జాకర్,ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యం,దివార్ ఏ ఎస్ పవర్ ప్లాంట్ అధికారుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు.అక్టోబర్ 1వ తేదీన నేషనల్ బ్లడ్ డొనేషన్ డేను పురస్కరించుకొని సిఐఎస్ఎఫ్ అధికారుల సహకారంతో రక్తాన్ని సేకరించారు.సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అందించారు.ఈ రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని తల సేమియా పిల్లలకు ఉచితంగా అందజేస్తామని రెడ్ క్రాస్ సొసైటీ నెంబర్ కాసర్ల శ్రీనివాస్ తెలిపారు.
ఈకార్యక్రమంలో ప్రేమ్ సాయి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సురేష్, శిరీష,హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version