స్విమ్మింగ్ పూల్ పోటీలను ప్రారంభించిన సీఐ నరేష్ కుమార్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T153129.784.wav?_=1

 

స్విమ్మింగ్ పూల్ పోటీలను ప్రారంభించిన సీఐ నరేష్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సింగరేణి ఫంక్షన్ హాల్ దగ్గర సింగరేణి స్విమ్మింగ్ పూల్ అండర్ 14 అండర్ 17 బాల బాలికలకు స్విమ్మింగ్ పూల్ పోటీలను ఎస్ జి ఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎల్ జయపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ సింగరేణి స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస పిఈటీఏ అధ్యక్షులు శిరంగి రమేష్ లు హాజరై పోటీలను ప్రారంభించారు అనంతరం జయపాల్ మాట్లాడుతూ పోటీలలో 6 జిల్లాల నుండి సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు .ఇందులో ఎంపిక ఐన క్రీడాకారులు పెద్దపల్లిలో అండర్ 14 విభాగంలో హైదరాబాద్ లో అండర్ 17 విభాగంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ఎల్ జయపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో పి.డిలు టి రాజయ్య మమత సురేష్ సాంబమూర్తి, కోటి ,అన్వర్ పాషా స్విమ్మింగ్ కోచ్ పాక శ్రీనివాస్, మదన్ జల్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version